Publish Date:Oct 16, 2019
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు సమీపంలో గోదావరిలో మునిగిపోయిన బోటును బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గోదావరి వరద తగ్గటంతో ధర్మాడి సత్యం టీమ్ రంగంలోకి దిగి ఆపరేషన్ కొనసాగిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన బోట్ వెలికితీత పనులు మళ్లీ రెండో రోజు కొనసాగుతున్నాయి. అయితే నిన్నంతా దేవీపట్నం నుంచి కేవలం ఐరన్ రోప్ లతో పాటు తాళ్లు అన్నీ తీసుకొని అలాగే ధర్మాడి సత్యం బృందంకి సంబంధించి ఒక ఇరవై ఐదు మంది బృందం దేవీపట్నం నుంచి కచ్చులూరుకు రావడం జరిగింది.
మళ్లీ పంటల మీద ఉన్న రోప్ అంతటిని కూడా గోదావరి మధ్యలోకి ఎక్కడైతే ప్రమాదం జరిగిందని చెప్తున్నారో ఆ ప్రమాద ఘటన జరిగిన స్థలం దగ్గర నుంచి రోప్ లు వేసుకొని రావటం జరుగుతుంది. గోదావరి వరద ఉధృతి తగ్గు ముఖం పట్టడంతో గోదావరి లోతు కూడా తగ్గింది. ఘటన జరిగిన సమయంలో చూసినట్లయితే రెండు వందల పదిహేను అడుగుల వరకు ఉన్న గోదావరి వరద నీటి మట్టం ఇప్పుడు సుమారు ముప్పై నుండి నలభై అడుగుల వరకు దాని నీటి మట్టం తగ్గడం జరిగింది.
స్తుతం మొత్తం నూట డెబ్బై నుంచి నూట ఎనభై అడుగుల వరకూ కూడా లోతు ఉండే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. రోప్ సాయంతోటి యాంకర్ లన్నింటినీ కూడా గోదావరిలోకి దింపడం జరిగింది. గోదావరిలోకి దింపిన తర్వాత అక్కడి నుంచి ఘటన ఎక్కడ అయితే జరిగిందో దానికి పదిహేను మీటర్లకి ముందు నుంచి ఈ యాంకర్ లన్నింటినీ వేయటం జరిగింది. ప్రస్తుతం నాలుగు యాంకర్ లను ఉపయోగిస్తున్నారు, ఈ నాలుగు యాంకర్లను కూడా పై నుంచి లాక్కొని వచ్చి అక్కడ నుంచి కూడా కిందకి లాక్కురావడం జరుగుతది.
ఎక్కడైతే పట్టుబడతదో ఆ పట్టుపట్టిన తరువాత అప్పుడు రోప్ సాయంతో లాగుతారు. ఇప్పటికే బోటు వెలికితీతకు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు కాగా తర్వాత సుమారు ఎనిమిది లక్షల వరకు కూడా ఖర్చు కావటం జరుగుతది. అయితే ధర్మాని సత్యానికి సంబంధించిన బాలాజీ మెరైన్ సంస్థ ఇరవై రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకు ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది.
ప్రభుత్వం ఇప్పటికే పది లక్షల ఖర్చు చేసిన కారణంగా ఒకవేళ బోటు తీయలేని పక్షంలో మొత్తం నష్టం వాటిల్లుతుందేమో అని చెప్పి ఎలాగైనా బోటును బయటకు తీయాలనే కృతనిశ్చయంతో సత్యం బృందం మొత్తం ప్రయత్నించడం జరుగుతున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/godavari-boat-capsize-25-90132.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.