Publish Date:Mar 17, 2025
తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మరికొద్ది సేపట్లో భూమిని చేరుకోనున్నారు. ఆమెతో బాటు మరో వ్యోమగామి బుల్ విల్మోర్ చేరుకోనున్నారు. ఇప్పటికే అంతరిక్షంలో తిరుగు ప్రయాణానికి వీరు సిద్దమయ్యారు. సునీత విలియమ్స్ ను తీసుకొచ్చేందుకు రోదసిలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూడ్రాగన్ ఆదివారం(మార్చి 16) సక్సెస్ ఫుల్ గా భూ కక్ష్యలోని అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానమైంది. క్రూ మిషన్ లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒకరితర్వాత ఒకరు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లారు. వీరు వెళ్లడంతో సునీతా విలియమ్స్ రాక కన్ఫర్మ్ అయ్యింది. సునీతా విలియమ్స్ రిటర్న్ జర్నీ గూర్చి ఇప్పటికే నాసా ప్రకటించింది. అమెరికా కాలమాన ప్రకారం అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్ డాకింగ్ ప్రాసెస్ ప్రారంభమౌతుంది. సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు(మార్చి 17) అంతరిక్షకేంద్రం నుంచి క్రూడ్రాగన్ విడిపోయే ప్రాసెస్ ప్రారంభం కానుంది. స్పేస్ ఫిప్ విజయవంతంగా విడిపోయి మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు భూమ్మీదకు రిటర్న్ జర్నీ ప్రారంభమౌతుంది. సాయంత్రం 5.11 గంటలకు భూ కక్ష్య దాటుకుని క్రిందకు వచ్చి సాయంత్రం ఫ్లోరిడా తీరంలోని సముద్రజలాల్లో స్పేస్ ఎక్స్ క్యాపుల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరు (వ్యోమగాములు) దిగనున్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన వ్యోమనౌక ‘స్టార్ లైనర్ ’లో సునీతా విలియమ్స్ అంతరిక్షంలో అడుగుపెట్టారు. ప్లానింగ్ ప్రకారం వీరు వారంరోజులకే భూమ్మీదకు చేరుకోవాలి. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తెలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే భూమ్మీదకు స్టార్ లైనర్ వ్యోమనౌక తిరిగి వచ్చేసింది. అప్పటి నుంచి సునీతా విలియమ్స్ విల్మోర్ లు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sunita-williams-will-return-to-earth-from-space-in-a-few-moments-39-194498.html
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పురందేశ్వరి రాజమహేంద్రవరంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాజమహేంద్రవరం నగరం, గోదావరి పర్యాటక ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయి.
ఆర్సీబీ విజయంతో బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవాల సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట సంఘటనకు సంబంధించి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై కబ్బన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పేరును అనధికారికంగా వాడుకుంటూ, భౌగోళిక సూచిక హక్కులను ఉల్లంఘిస్తున్న పుష్ మై కార్ట్ సంస్థ కు తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు జారీ చేసింది. ఒక్క పుష్ మై కర్డ్ సంస్థకే కాకుండా ఇలా లడ్డూ ప్రసాదం పేరును, పవిత్రతను అనధికారికంగా ఉపయోగించుకుంటున్న పలు ఇతర సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమై లీగల్ నోటీసులు జారీ చేసింది.
ఎప్ స్టీన్ మామూలోడు కాడు. ఇటు బిల్ క్లింటన్ లాంటి ప్రెసిడెన్షియల్ పర్సనాల్టీస్.. అటు హాలీవుడ్ హీరోస్ తో కస్టమైజ్డ్ ప్రైవేట్ జెట్స్ లో ఆఫ్రికా పర్యటన చేసికొచ్చిన రకం. దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు.. ఎప్ స్టీన్ ఎలాంటివాడో.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 ప్రభాకర్రావుకు సోమవారం (జూన్ 9) సిట్ విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి. వాస్తవానికి ఆయన గురువారం (జూన్ 5) విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయనకు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ జారీ కావడంలో జరిగిన జాప్యంతో ఇండియాకు రాలేకపోయారని చెబుతున్నారు.
చేసిన పాపం ఎప్పటికైనా బయటపడక తప్పదు. అందులోనూ తిరుమల దేవుడి విషయంలో చేసిన అపచారానికి ఎంతటి వాడికైనా శిక్ష తప్పదు. కర్మఫలం అనుభవించకతప్పదు. ఇప్పుడు జగన్ హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలు, అరాచకాలు ఒక్కటొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి.
నిజమే.. హస్తం పార్టీలో కుస్తీ పట్లు కొత్తకాదు. అందులోనూ.. అధికారంలో ఉన్న సమయంలో నాయకులు, కార్యకర్తలు నాకేంటి.. మాకేంటని పార్టీని నిలదీయడం మరీ కామన్. ఇతర పార్టీలలో అలాంటి, గోల ఉండదా అంటే.. అదేమీ లేదు, అన్ని పార్టీలలో ఉన్నదే. ఉండేదే. అందులో అనుమానం లేదు. ప్రస్తుతం తెలంగాణలో మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్ లో, కల్వకుంట్ల కుటుంబంలో జరుగతున్న రచ్చంతా.. నాకేంటి? అన్న దగ్గరే మొదలైంది, దాని చుట్టూనే తిరుగుతోంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వారాంతం కావడం, వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో తిరమల భక్త జన సందోహంతో కిటకిటలాడుతోంది.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తామంటూ గుర్తు తెలియని దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్లో చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మరో కీలక నేత మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందారు.
బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే విమర్శస్తుంటే మాజీ సీఎం కేసీఆర్ నోరు విప్పలేని స్ధితిలో ఉన్నారని సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు.
వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. ఇవాళ అమరావతిలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయాలు ప్రకటించారు.