నాకేంటి ... మాకేంటి ..

Publish Date:Jun 6, 2025

Advertisement

కాంగ్రెస్’లో కొత్త పంచాయతి!

నిజమే..  హస్తం పార్టీలో కుస్తీ పట్లు కొత్తకాదు. అందులోనూ.. అధికారంలో ఉన్న సమయంలో నాయ కులు, కార్యకర్తలు నాకేంటి.. మాకేంటని పార్టీని నిలదీయడం మరీ కామన్. ఇతర పార్టీలలో అలాంటి,  గోల ఉండదా  అంటే..  అదేమీ లేదు, అన్ని పార్టీలలో ఉన్నదే. ఉండేదే. అందులో అనుమానం లేదు.  ప్రస్తుతం  తెలంగాణలో మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్ లో, కల్వకుంట్ల కుటుంబంలో జరుగతున్న రచ్చంతా.. నాకేంటి?  అన్న దగ్గరే మొదలైంది, దాని  చుట్టూనే తిరుగుతోంది. అలాగే..  పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లోనూ.. అక్కడి మాజీ అధికార పార్టీ వైసీపీలో, పెద్దాయన  (వైఎస్సార్) ఫామిలీలో ఏమి జరిగిందో, ఏమి జరుగుతుందో  చూస్తూనే ఉన్నాం.  దోచుకున్న సొమ్ముల పంపకాల్లో వచ్చిన పేచీలు  పార్టీని, ఫ్యామిలీని నిట్ట నిలువునా చీల్చివేసాయి. 

అయితే..  ఇప్పడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఈ సందడి కొంచెం ఎక్కువగా వినిపిస్తోంది. హస్తం పార్టీలో  అసంతృప్తికి సంబందించిన వార్తలు ప్రతిరోజూ ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా త్వరలో  జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు స్థానిక నాయకులను, క్యాడర్ ను సిద్దం చేసేందుకు  కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ జిల్లాల వారీగా నిరహిస్తున్న సమావేశాల్లో అసంతృప్తి అగ్ని పర్వతాలు బద్దలవుతున్నట్లు గాంధీ భవన్ వర్గాల సమాచారంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల మొదలు జిల్లా నాయకుల వరకూ పార్టీ అధికారంలో ఉన్నా పనులు  కావడం లేదనీ..  ఎంతో  కాలంగా అణచి పెట్టుకున్న అసంతృప్తిని మీనాక్షి మేడంకు విన్నవించు కుంటున్నారని అంటున్నారు.  

ఓ వంక స్థానిక సంస్థల ఎన్నికలను సవాలుగా తీసుకున్న  మీనాక్షి నటరాజన్  పార్టీని క్రింది స్థాయి నుంచి ఆక్టివేట్ చేసే ఉద్దేశంతో  స్వయంగా రంగంలోకి దిగి,  జిల్లాల వారీగా   సమావేశాలు నిర్వహి స్తుంటే.. మరో వంక ఇదే అవకాశంగా తీసుకుని స్థానిక నాయకులు, కార్యకర్తలు  ప్రభుత్వంలో తమకు  రావలసిన వాటా  రావడం లేదని అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదనే  అసంతృప్తి నేతలు, క్యాడర్ లో వ్యక్తమవు తోందని అంటున్నారు.  ప్రతిపక్షంలో ఉన్నపదేళ్ళ కాలంలో  నాయకులు పట్టించుకున్నాపట్టించుకోక పోయినా.. పార్టీకోసం కష్టపడి పని చేసిన నాయకులు, కార్యకర్తలు  పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ తమకు  మొండి ‘చేయి’ చూపిస్తోందని అంటున్నారు.  నిజానికి, ఇంతలా గుప్పుమనక పోయినా.. జిల్లాల్లో  జిల్లా స్థాయి నాయకుల మొదలు సామాన్య కార్యకర్తల వరకు ఎప్పటినుంచో అసంతృప్తితో రగులు తున్నారని అంటున్నారు.  

నిజానికి..  స్థానిక నాయకులు, కార్యకర్తల్లో  అసంతృప్తి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు, జిల్లాల నాయకులు, కార్యకర్తలు ఎప్పటి నుంచో  ఎమ్మెల్యేల వద్ద  తమ బాధను చెప్పుకుంటున్నారని అంటున్నారు.  అయితే,ఇంతవరకు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే కావడంతో..  డోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్లు ఉందని, కార్యకర్తలను సముదాయిస్తూ వచ్చారని అంటున్నారు.

 అయితే..  ఇప్పుడు స్థానిక ఎన్నికలను సవాలుగా తీసుకుని, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ స్వయంగా  సంప్రదింపులు జరపడంతో  కార్యకర్తలు, నాయకులతో పాటుగా ఎమ్మెల్యేలు కూడా ఆమెకు పార్టీ పరిస్థితితో పాటుగా తమ పరిస్థితిని  విపులంగా, వివరంగా చెపుతున్నారని అంటున్నారు. అలాగే..  ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలన్న సామెతను గుర్తుకు తెచ్చుకుని ఆమె ముందు తమ కోర్కెల చిట్టాను ఉంచుతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే.. నిన్నమొన్నట్లో మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధి నేతలతో జరిగిన భేటీలో ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, కార్యకర్తలోలలో భగ్గుమంటున్న అసంతృప్తిని మీనాక్షి నటరాజన్ దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు అయితే  మీరు చెప్పినట్లుగా  స్థానిక సంస్థలో  ఎన్నికలో కార్యకర్తలు, నాయకులు గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేయాలంటే, మమ్మల్ని గెలించిన వారికి న్యాయం చేయండి. వారికి  కాంట్రాక్టులు ఇవ్వండి.  పార్టీ ప్రభుత్వ పదవులు ఇవ్వండి.. అంటూ మీనాక్షి మేడంకు విన్నవించుకున్నట్లు చెపుతున్నారు. అలాగే.. అదే చేత్తో ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వాలని డిమాండ్ టోన్ లో రిక్వెస్ట్ చేశారని తెలుస్తోంది. అంతే  కాకుండా మంత్రులు  నిధులు మొత్తం తమ సొంత నియోజకవరగాలకు తరలించుకుకు పోతున్నారనీ, అధికారులు తమ మాట వినడం లేదనీ,  కనీసం ఫోన్  లిఫ్ట్ చేయడం లేదని ఎమ్మెల్యేలు ఆరోపించినట్లు సమాచారం. 

ఇలా ఓ వంక అసెంబ్లీ ,లోక సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు పనులు కాక, పదవులు రాక నిరాశగా ఉన్నారు, మరో వంక కులగణన జరిపించిన నేపధ్యంలో.. పదవులు ఆశిస్తున్న బీసీ నేతలలోనూ నిరాశ వ్యక్తమవుతోందని మీనాక్షి నటరాజన్ కు పరిస్థితిని  వివరించినట్లు తెలుస్తోంది. 

నిజానికి ఈ సమావేశంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పదవుల పంపకాల్లో ఆలస్యం కారణంగా నాయకులలో అసంతృప్తి ఉన్న మాట  నిజమే అని  అంగీకరిస్తూనే..  త్వరలోనే అర్హతలను బట్టి పార్టీ పదవులు ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు చెపుతున్నారు.  మరో వంక, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌  పార్టీ పదవులు, నామినేటెడ్‌ పోస్టుల్లో పార్టీ పట్ల అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేసిన వారికి కచ్చితంగా గుర్తింపు, గౌరవం దక్కుతుందనే భరోసాఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, జిల్లా అధికారులు తమ మాట వినకపోవడం వలన పార్టీ కార్యకర్తలకు సాయం అందించ లేకపోతున్నామని ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు విషయం ముఖ్యమంత్రితో చర్చించి చక్కదిద్దడానికి యత్నిస్తానని ఆమె హామీనిచ్చినట్టు తెలిసింది. 

అదలా ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికలను సవాలుగా తీసుకున్న కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌  కు కాంగ్రెస్ పార్టీలో నాటుకు పోయిన నాకేంటి ..మాకేంటి కల్చర్  అసలు సవాలుగా నిలుస్తోందని అంటున్నారు. ఈ నేపధ్యంలో, స్థానిక ఎన్నికల టాస్క్ లో  ఆమె ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చూడవలసిందే అంటున్నారు.

By
en-us Political News

  
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.