Publish Date:Apr 25, 2022
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ నిర్ణయాలు నవ్వుల పాలౌతున్నాయి. తుగ్లక్ పాలనను స్ఫురింప చేస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణగా రాష్ట్రంలో టీచర్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చెప్పుకోవచ్చు. సమ్మర్ హాలీడేస్ ను వర్షాకాలానికి మార్చేసి జగన్ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి జూలై 3 వరకూ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. అంత వరకూ బానే ఉంది కానీ టీచర్లకు మాత్రం ఈ సెలవులు వర్తించవట. వీరంతా మే 20 వరకూ పాఠశాలలకు హాజరు కావాల్సిందేనట. రాష్ట్రంలో పరీక్షలన్నీ మే 7తో ముగుస్తున్నాయి. పరీక్షలు అయిపోయిన తరువాత విద్యార్థులకు సెలవులు ఇచ్చేసిన తరువాత టీచర్లు పాఠశాలలకు ఎందుకో అర్థం కాదు. సీపీఎస్ రద్దు కోసం డిమాండ్ చేస్తున్నారన్న కక్షతో ఏదో రకంగా వేధింపులకు గురి చేయడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికీ టీచర్లకు క్లాసులో విద్యార్థులకు పాఠాలు చెప్పడం కంటే ఇరత పనులే అధికమయ్యాయి. విద్యార్థుల అటెండెన్స్ నుంచి అన్నీ ప్రతి రోజూ వాట్సన్ ద్వారా విద్యాశాఖకు పంపాల్సిందే. ఇక ఇప్పుడు తాజాగా వేసవి సెలవులను మే 20 తరువాతే టీచర్లకు ఇవ్వాలన్న నిర్ణయం వెనుక కూడా టీచర్లకు ఆదాయంలో కోత పెట్టే ఉద్దేశమే కనిపిస్తున్నది. టీచర్లకు వేసవి సెలవులలో స్పీట్ వేల్యుయేషన్ విధులు ఉంటాయి. ఆ విధులకు హాజరైన వారికి ఆర్జిత సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. దానిని ఎగ్గొట్టేందుకే సర్కార్ వేసవిలో సెలవులను వర్షాకాలానికి మార్చేయడం లాంటి వింత పోకడలకు పోతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆర్థిక క్రమశిక్షణ లేక...ఆర్థికంగా రాష్ట్రాన్ని కుదేలు చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు..టీచర్లకు న్యాయబద్ధంగా రావాల్సిన వేతనాలు అలవెన్సులు వంటి వాటిని చెల్లించలేక వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నదని టీచర్లు విమర్శిస్తున్నారు. ప్రశ్నించడమే నేరం అన్నట్లు సీపీఎస్ రద్దు కోసం చలో విజయవాడ వెళ్లిన టీచర్లను అరెస్టులు చేయడమే కాకుండా మొత్తం బెజవాడనే జైలుగా మార్చేశారంటే రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? అన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు. ఏది ఏమైనా వేసవి సెలవులను వర్షాకాలంలో ఇస్తామంటూ...జగన్ సర్కార్ వింత నిర్ణయం ప్రజలలో నవ్వుల పాలౌతున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/summer-holidays-in-rainy-season-to-teachers-39-134960.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.