బ్రిటీషు వారిని గడగడలాడించిన బోస్ గురించి తెలియని రహస్యాలు!

Publish Date:Jan 23, 2026

Advertisement

సుభాష్ చంద్రబోస్ పేరు వెంటే భారతీయుల ఒళ్ళు పులకరిస్తుంది.  ముఖ్యంగా భారత యువతలో దేశ భక్తి పొంగుతుంది.  భారతీయులను బానిసలుగా చేసుకుని దేశాన్ని దోచుకున్న బ్రిటీషు వారిని గడగడలాడించిన వ్యక్తిగా  సుబాష్ చంద్రబోస్ అందరికీ సుపరిచితం.  అందరూ బోస్ అని ముద్దుగా పిలుచుకునే చంద్రబోస్ జనవరి 23వ తేదీ,  1897లో జన్మించారు. ఈయన జన్మస్థలం కటక్.. జానకీనాథ బోస్,  ప్రభావతి దేవి ఈయన తల్లిదండ్రులు. సుభాష్ చంద్రబోస్ జయంతి రోజును పరాక్రమ్ దివస్ గా జరుపుకుంటారు.  ఆయన దైర్యం, త్యాగానికి ప్రతీకగా ఈ రోజును జరుపుకుంటారు. ఆయన జీవితం అంతా తెలిసినదే అనిపించినా, బయటికి ఎక్కువగా రాని రహస్యమైన, కీలకమైన, లోతైన విషయాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి స్పష్టంగా తెలుసుకుంటే..

బ్రిటీష్ ఇంటెలిజెన్స్ విషయంలో..

గాంధీజీని బ్రిటిష్‌లు “నెగోషియబుల్ శత్రువు”గా చూశారు. కానీ సుభాష్ చంద్రబోస్‌ను మాత్రం “నియంత్రించలేని విప్లవకారుడు”గా పరిగణించారు.

బ్రిటిష్ MI5, MI6 ఫైళ్లలో ఆయన పేరు మీదే అత్యధిక నిఘా నివేదికలు ఉన్నాయి.  ఆయనపై నిఘా భారతదేశంలోనే కాదు.. జర్మనీ, ఇటలీ, జపాన్‌లలో కూడా సాగింది.

ఈ వ్యక్తి బ్రిటిష్ సామ్రాజ్యానికి చాలా ప్రమాదకారి అని ఒక బ్రిటిష్ అధికారి వ్యాఖ్యానించారంటే బోస్ వారిని ఎంత భయపెట్టి ఉంటాడో ఊహించుకోవచ్చు. అంటే బ్రిటిష్‌లు నిజంగా భయపడింది గాంధీజీ కంటే ఎక్కువగా నేతాజీకే.

జర్మనీ–హిట్లర్ సంబంధం.. నిజానిజాలు..

చాలామంది నేతాజీ హిట్లర్‌తో కలిసి పనిచేశాడు బోస్ గురించి అపార్థం చేసుకున్నారు.  కానీ నేతాజీకి హిట్లర్ జాతి సిద్ధాంతాలపై తీవ్ర అసహ్యం ఉంది. భారతీయులు ఆర్యులు కాదు అన్న హిట్లర్ వ్యాఖ్యను నేతాజీ తీవ్రంగా ఖండించాడు. హిట్లర్‌ను కలవడానికే నేతాజీ పెద్దగా ఆసక్తి చూపలేదు

కాకపోతే ఆయన చెప్పింది మాత్రం ఒక్కటే.. బ్రిటిష్ శత్రువు – నా మిత్రుడు అని. ఇది వ్యూహం మాత్రమే, సిద్ధాంతం కాదు.

ఆజాద్ హింద్ ప్రభుత్వం..

ఇది కేవలం ప్రతీక కాదు. 1943లో నేతాజీ స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ప్రకటించారు.  జపాన్, జర్మనీ, ఇటలీ సహా 9 దేశాలు అధికారికంగా గుర్తించాయి.

ఆయన వద్ద  స్వంత కరెన్సీు, పోస్టల్ స్టాంపులు, న్యాయస్థానాలు, మహిళా సైన్యం కూడా  ఉన్నాయి.  భారతదేశానికి గాంధీజీ కంటే ముందే  ప్రధాని లాంటి పాత్రను నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోషించాడు.

మహిళలకు యుద్ధంలో స్థానం..

రాణి ఝాన్సీ రెజిమెంట్:-

ఇది పూర్తిగా మహిళలతో కూడిన యుద్ధ విభాగం. అప్పట్లో యూరప్‌లో కూడా ఇది అసాధారణం. మహిళలు ఆయుధాలు ధరించి ముందుండాలని నేతాజీ స్పష్టంగా చెప్పారు  భారతదేశంలో మహిళా సాధికారతను యుద్ధ స్థాయికి తీసుకెళ్లిన తొలి నాయకుడు ఆయన.

గాంధీజీతో విభేదాలు..


గాంధీకి, నేతాజీకి  మధ్య విభేదాలు ఉన్న..  గాంధీజీ నేతాజీని దేశభక్తులలో దేశభక్తుడు అన్నారు. నేతాజీ గాంధీజీని జాతిపిత అని గౌరవించారు.

వివాదం ఒక్కటే..

గాంధీజీ అహింసనే ఆయుధంగా మార్చుకున్నాడు. అదే దిశలో పోరాటం జరగాలని అనుకున్నాడు. కానీ నేతాజీ మాత్రం.. అవసరమైతే సాయుధ పోరాటం తప్పు కాదని, సాయుధ పోరాటంతోనే బ్రిటీషర్ల నుండి దేశానికి విముక్తి సాధ్యమని స్పష్టం చేశారు.

గాంధీ,నేతాజీ మధ్య వ్యక్తిగత శత్రుత్వం ఏదీ లేదు.. రెండు మార్గాల మధ్య తాత్విక పోరాటమే వారి మీద శత్రువులు అనే ముద్ర వేసింది.

రహస్య రేడియో ప్రసారాలు..

నేతాజీ రేడియో ప్రసారాల ద్వారా భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రసారాలు జర్మనీ, జపాన్ నుంచి జరిగాయి.  బ్రిటిష్‌లు ఆ సిగ్నల్స్‌ని ఆపలేకపోయారు. ఆ ప్రసారాలు వినడం నేరంగా ప్రకటించారు.  సమాచార యుద్ధంలో కూడా ఆయన ముందే ఉన్నారు.

నేతాజీ మరణం.. మిస్టరీ..

నేతాజీ మరణం – ఇప్పటికీ ఓ మిస్టరీ


నేతాజీ మరణం గురించి ఒక అధికార కథ ప్రచారంలో ఉంది. 1945లో తైవాన్ విమాన ప్రమాదం జరిగిందని, అందులో బోస్ మరణించాడని చెబుతారు.

కానీ అనేక ప్రశ్నలు పజిల్స్ గా ఉండిపోయాయి..

విమాన ప్రమాదంలో శవం దొరకలేదు. ఆ శవం ఎక్కడుంని ప్రశ్న.. DNA పరీక్ష ఎందుకు జరగలేదని కూడా ప్రశ్న ఉంది.

జపాన్ రికార్డుల్లో అస్పష్టత ఉంది.  భారత ప్రభుత్వం ఫైళ్లను దశాబ్దాల పాటు రహస్యంగా ఉంచింది.

అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే..  నేతాజీ కుటుంబసభ్యులే విమాన ప్రమాద కథను అనుమానించారు. ఆయన మరణం కంటే ఆయన జీవించి ఉండవచ్చన్న సందేహమే ఎక్కువ బలంగా ఉంది.

స్వతంత్ర భారతానికి ఆయన కల..

నేతాజీ దేశం గురించి చాలా కలలు కన్నాడు.  బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలని,   శాస్త్రీయ, పరిశ్రమాధారిత ఆర్థిక వ్యవస్థ ఉండాలని,  మతపరమైన రాజకీయాలకు స్థానం ఉండకూడదని,  క్రమశిక్షణ, జాతీయవాదం ముఖ్యంగా ఉండాలని కోరుకున్నాడు.

ఆయన బతికి ఉంటే, భారత రాజకీయ దిశ పూర్తిగా వేరేలా ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం.

1946లో జరిగిన రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుకి ప్రధాన ప్రేరణ.. INA ట్రయల్స్.. నేతాజీ ప్రభావమే..  ఇది బ్రిటీషర్లకు చాలా పెద్ద షాక్ ఇచ్చింది.  ఈ కారణంగానే నేతాజీ భారత్ ను వదిలి వెళ్లారని అంటారు.

నేతాజీ అంటే ఒక నాయకుడు కాదు.. ఆయన శత్రువుల పాలిట సింహ స్వప్నం.  దేశాన్ని దోచుకున్నవారికి ఆయన పేరు ఒక భయంకరమైన ప్రశ్న..

                                *రూపశ్రీ. 

By
en-us Political News

  
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత...
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.