హర్మూజ్ జలసంధి ఓపెన్.. ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన ఇరాన్

Publish Date:Apr 17, 2026

Advertisement

 

హర్మూజ్ జలసంధిని ప్రపంచ వాణిజ్యానికి ఓపెన్ చేస్తున్నట్లు ఇరాన్ కీలక ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ  అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని ఇరాన్ ప్రకటించింది.   హోర్ముజ్ జలసంధిని మూసివేసే ఆలోచన తమకు లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ చమురు రవాణాలో ఈ మార్గం అత్యంత ప్రాధాన్యత కలిగినదని, దీని ద్వారానే ప్రపంచంలోని మూడో వంతు ముడి చమురు సరఫరా జరుగుతుందని   తెలిసిందే.

తాజాగా లెబనాన్,  ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. కాల్పుల విరమణ గడువు ముగిసేంత వరకూ హర్మూజ్ పూర్తిగా తెరిచే ఉంటుందని, నౌకల రాకపోకలకు ఎటువంటి అడ్డంకులూ ఉండవనీ స్పష్టం చేసింది. కాగా ఇరాన్ నిర్ణయంపై స్పందిచిన అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి ధ్యాంక్స్ చెప్పారు. 

హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన విషయాన్ని ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ధ్రువీకరించారు. గతంలో ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమైంది. అయితే..  ట్రంప్ బృందం జరిపిన సంప్రదింపులు సత్ఫలితాలనివ్వడంతో ఇప్పుడు నౌకల రాకపోకలకు మార్గం సుగమమైంది. లెబనాన్‌తో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, లెబనాన్, ఇజ్రాయెల్  కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నంత కాలం హర్మూజ్ జలసంధి తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్య నౌకల ప్రయాణానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని ఆయన హామీ ఇచ్చారు.  ఇరాన్ తాజా నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం.  ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం తగ్గుముఖం పట్టడం వల్ల పశ్చిమాసియాలో శాంతి నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ఈ రకమైన సానుకూల ధోరణిని కొనసాగిస్తే, భవిష్యత్తులో ఆ దేశంపై ఉన్న మరిన్ని ఆంక్షలను అమెరికా సడలించే అవకాశం ఉందన్న భావన అంతర్జాతీయంగా వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
జేఎన్టీయూ నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందో ళనకు గురయ్యారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
హర్మూజ్ ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి పీక్స్ కు చేరింది. హ‌ర్మూజ్‌పై అమెరికా నౌకా దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
డీలిమిటేషన్ బిల్లులో ఉన్న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని నియోజకవర్గాల పునర్విభజన చేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కట్టబెడుతూ డీ లిమిటేషన్ బిల్లులోని ప్రతిపాదనలపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేస్తూ, ఈ ప్రక్రియను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ అజింక్యా రహానే డకౌట్‌గా వెనుదిరిడాడు. అయితే, స్టార్ బ్యాటర్ కామెరూన్ గ్రీన్ 55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. కామెరూన్ గ్రీన్ కు రోవ్‌మన్ పావెల్, రమణ్‌దీప్ సింగ్ సహకారాన్ని అందించారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అత్యంత ఘాటుగా స్పందించారు.
డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి, ఇతర నిందితులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు.
లైంగిక వేధింపులే కాకుండా, బలవంతపు మత మార్పిడిలు, గూమింగ్, అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్, టెర్రర్ ఫండింగ్ లాంటి తీవ్రమైన అంశాలు ఈ కేసులో ముడిపడి ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.
ఇది కేవలం బిల్లు ఓటమి కాదని, భారత ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయమని రాహుల్ గాంధీ అభివర్ణించారు
చైనా ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితులు సాధారణ మందగమనం కంటే ఎక్కువగా, ఒక లోతైన వ్యవస్థాత్మక సంక్షోభాన్ని సూచిస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేత చర్యలు ఏడో రోజుకి చేరుకున్నాయి.
దేశ అత్యున్నత చట్టసభ అయిన లోక్‌సభలో శుక్రవారం అనూహ్యమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.