Publish Date:Oct 19, 2022
పిల్లలతో వాళ్ల ఆటలు ఆడుతూండు, వాళ్ల పక్కనే కూచుని చదువుతూంటే గమనిస్తూండు నీ బాల్యం గుర్తొస్తుంది.. అదో ఆనందం, గొప్ప శక్తినిస్తుందంటాడు పిల్లల రచయిత లివింగ్స్టన్. అదేమోగాని, పిల్లల చదువు అనగానే తల్లిదండ్రులకు కూడా పెద్ద పరీక్షలతో సమానం. పెద్ద చదువులకు వెళ్లే కొద్దీ వాళ్లతో పాటు చదివినంత పని అవుతుంది. దగ్గరుండి హోమ్వర్క్ చేయించడంతో ఆరంభమై వాళ్లకి పోటీ పరీక్షలకు పుస్తకాలు తేవడం, వీలయితే ఒకటి రెండు సబ్జెక్టులు కాస్తంత తెలుసుకోవడం తల్లిదం డ్రుల వంతే అవు తోంది. ఇపుడు రాకేష్ పరిస్థితి ఇదే.
అభిజిత్ అనే ఉద్యోగి ఆమధ్య ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి బయలుదేరాడు. ఆ క్యాబ్ డ్రైవర్ రా కేష్ తన ఫోన్ లో అప్పటివరకూ చూస్తున్న యూట్యూబ్ బంద్ చేశాడు. ఆ ఉద్యోగి ఏం చూస్తున్నావ్, చదువుతున్నావని అడిగాడు. ఈ చానల్లో కరెంట్ అఫైర్స్, ఆర్ధికశాస్త్రం సంబంధించిన అంశాలు చదు వుతున్నానన్నాడు. అభిషేక్కి మతి పోయింది. క్యాబ్ డ్రైవర్కి వాటితో అవసరం ఏమొచ్చిందా అని తెగ ఆలోచిస్తూ ఆఫీసుకు వెళ్లాడు. తర్వాత కనుక్కుంటే తన కూతురు కోసం రాకేష్ చదువుతు న్నాడని తెలు సుకుని చాలా ఆనందించాడు. ఏ పనిచేస్తున్నా, తండ్రి తండ్రే.. పిల్లల భవితకు తప్పని శ్రమ..ఎంతో ఆనందాన్నిచ్చే శ్రమ!
తన కూదురు యుపిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. అందుకే రాకేష్ ఆమెకు కావలసిన పుస్తకాలు కొనడమే కాకుండా కొంత నోట్సు రాసుకోవడానికి అతను అధ్యయనం మొదలెట్టాడు. అతనికీ ఎంతో తెలుసుకోవాలన్న తపనా పెరిగింది. పిల్లల్ని తమకంటే ఎక్కువ చదివించాలని, మంచి స్థాయిలో చూడాలనే కదా తల్లిదండ్రులు ఆశించేది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/strain-that-gives-pleasure-25-145702.html
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.