నరసింహావతారం నరులకు ఇచ్చే సందేశం!

Publish Date:May 12, 2022

Advertisement

మహావిష్ణువు అవతారాలు ఎన్ని అంటే చాలా మంది పది అంటారు. కానీ మహావిష్ణువు పూర్తి అవతల 21. వీటిని ఏకవిశంతి అవాఘారాలు అంటారు. వీటిలో చాలా ప్రముఖమైనవి, కథలుగా ప్రాచుర్యంలో ఉన్నవి పది. ఆ పది అవతారాలు మహావిష్ణువు ఒక్కో యుగంలో ఒకో విధంగా ఆవిర్భవించి ఈ లోకాన్ని దుష్టుల నుండి కాపాడుతూ దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణ అనే విషయాన్ని వ్యాప్తం చేసాడు. అలా  విష్ణుమూర్తి దశావతారాలలో నాలుగవ అవతారం అయిన నరసింహ అవతారం ఎంతో విశిష్టమైనది. పూర్తి మనిషిగా కాకుండా, పూర్తి మృగంలా కాకుండా రెండింటి కలయికతో ఆవిర్భవించిన భీకర స్వరూపం ఈ నరసింహ అవతారం.

ఆవిర్భావం వెనుక కథ, వృత్తాంతం!!

జయవిజయులు వైకుంఠంలో విష్ణుమూర్తి ద్వారపాలకులు. అర్థమయ్యేలా చెప్పాలంటే లోపలికి ఎవరికీ పంపకుండా కాపలా ఉండటం. ఎవరైనా విష్ణుమూర్తిని కలవడానికి వస్తే మొదట విష్ణుమూర్తికి విషయం చెప్పి ఆయన సరేనంటే వాళ్ళను లోపలికి పంపడం. ఒకరోజు సనకసనందనాది మునులు విష్ణుమూర్తి దర్శనానికి వస్తే "ఇప్పుడు విష్ణుమూర్తిని కలవడానికి కుదరదు" అని చెప్పారు. ఆ మునులకు కోపం వచ్చి "మీరు విష్ణుమూర్తి  దగ్గర ఉంటున్నామని గర్వంతో ఇలా అంటున్నారు కదా, విష్ణులోకం నుండి మీరు దూరమైపోతారు" అని శాపం పెట్టారు. 

ఆ జయవిజయులు విష్ణుమూర్తిని అడిగితే "ఏడు జన్మలు నాకు మంచి భక్తుల్లా పుడతారా?? లేక మూడు జన్మలు నాకు శత్రువులుగా పుట్టి నాచేతిలోనే మరణిస్తారా??" అని అడిగాడు విష్ణువు. 

ఏడు జన్మలు మేము ఉండలేము, మూడు జన్మలు మీకు శత్రువులుగా పుట్టి మీ చేతిలోనే మరణిస్తాము" అని అన్నారు వాళ్ళు.

అలా కృతయుగంలో పుట్టిన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులే ఈ జయవిజయులు. చాలామంది తిట్టుకుంటూ ఇలా గుర్తుచేసుకోవడాన్ని వైరి భక్తి అంటూ ఉండటం వైన్ ఉంటాం.

హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి వరం పొందాడు. గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని, దేవదానవమనుష్యుల చేతుల్లో కానీ, జంతువులతో కానీ, ఆయుధములచేత కానీ, ఇంట్లోకాని, బయటకాని మరణము కలగకుండా వరం సంపాదించాడు. అందువల్ల హిరణ్యకశిపుడిని ఎవరూ ఏమీ చేయలేకపోయారు.

ప్రహ్లాదుడు, నృసింహ ఆవిర్భావం!!

ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి కొడుకు. యుద్ధం జరిగి హిరణ్యకశిపుడి భార్యను ఇంద్రుడు ఎత్తుకుని పోతే నారదుడు ఇంద్రుడిని మందలించి ఆమెను తన ఆశ్రమానికి తీసుకెళ్లి రక్షణ కల్పిస్తాడు. ఆ సమయంలో నారదుడు చెప్పిన భాగవత విషయాలను విన్న ప్రహ్లాదుడు పుట్టుకతో విష్ణు భక్తుడిగా మారిపోయాడు. 

శివుడు, విష్ణువు శత్రువులు కాకపోయినా వీరి భక్తులు మాత్రం ఎప్పుడూ శత్రుత్వంతో రగిలిపోయేవారు. వాళ్లలో హిరణ్యకశిపుడు కూడా ఒకడు. విష్ణువంటే సరిపడదు అందుకే కొడుకును చంపాలని చూసి విఫలమై చివరకు ఎక్కడున్నాడు నీ హరి??" అని ప్రశ్నించగా. స్థంబాన్ని చీల్చుకుని వచ్చిన మనుష్య, మృగ అవతారమూర్తి నరసింహుడు.

బ్రహ్మ ఇచ్చిన వరంలో ఉన్న అంశాల ఆధారంగా వాటన్నిటినీ మినహా ఇస్తూ హిరణ్యకశిపుడిని ఇంటి గడప మీద చేతి గొర్లతో కడుపు చీల్చి వధించాడు. 

ఇదీ నరసింహావతార కథ.

అంతార్థం!!

ఆ భగవంతుడు ఈ సృష్టిలో అణువణువు నిండి ఉంటాడు. భగవద్గీత చెప్పే విషయం ఇదే. దాన్నే ప్రహ్లాదుడు తన భక్తితో చెప్పాడు.

వైర భక్తి. ప్రపంచంలో మనుషులు శత్రువులు అయినా వారిలో ఖచ్చితంగా ఎదజేటివాడు సరిచేసుకోగలిగిన అంశాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుచేస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఒక శత్రువు లోపాన్ని ఎత్తి చూపినట్టు, స్నేహితులు, దగ్గరివాళ్ళు చూపించరు. కాబట్టి శత్రువు ఎప్పటికైనా మంచివాడే.

మృగ స్వభావం ప్రతి మనిషిలో అంతర్లీనంగా ఉంటుంది. ఆ మృగస్వాభావం వచ్చినప్పుడు మనిషి విచక్షణ కోల్పోతాడు అనే విషయం ఈ నరసింహ అవతారంలో స్పష్టం అవుతుంది. విచక్షణ కోల్పోయిన మనిషి చేసే పనులలో చాలా నష్టాలు ఉంటాయని అంటారు. కాబట్టి మృగ స్వభావం అనేది మనిషిని ఎప్పుడూ దిగజార్చకూడదు.

ఇలా నరసింహ అవతారం మనిషికి ఎన్నో విషయాలు బోధిస్తుంది. నరసింహస్వామిని ఆరాధిస్తే అరిశడ్వర్గాలను అదుపులో ఉంచుకునే మానసిక శక్తి, ఇంకా అంతులేని ధైర్యం చేకూరుతాయి. అలాగే భయాలు తొలగిపోయి. 

ఒకటి మాత్రం నిజం. లక్ష్మినారాయణుడు అన్నా, లక్ష్మీ నరసింహస్వామి అన్నా ఒకటే, అవతారాలు వేరు.  అన్నింటిలో నిండినది ఆ పరమాత్మే.

                          ◆ వెంకటేష్ పువ్వాడ.

By
en-us Political News

  
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా అపురూపమైనది.  భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా ఉంటూ,  ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం బాగుటుంది.  అయితే ఈ బంధంలో చాలామంది..
Why Indian Tulsi Is in Huge Demand Across Muslim Countries, Indian Tulsi Becomes a Hot Commodity in Muslim Countries, Indian Tulsi Demand Explodes in Muslim Nations, Why Muslim Countries Are Crazy About Indian Holy Basi
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు...
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే...
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.