Publish Date:Apr 26, 2022
ఉక్కు సెగ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేయనుందా? ఉక్కు సంకల్పం విశాఖపట్నానికే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం అదే సంకల్పం కనిపిస్తుందా? ఏది ఏమైనా ఉక్కు దెబ్బకు వైసీపీ గింగిరాలు తిరగక తప్పదన్న సంకేతం అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నికలలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ ఎన్నికలలో వైసీపీకి చేదు అనుభవం ఎదురైంది. విపక్ష టీడీపీకి తీపి గెలుపు అందింది. నిజానికి ఈ ఎన్నికలలో వైసీపీ అనుబంధ కార్మిక సంస్థ ఐఎన్టీయూసీకి మద్దతు ఇచ్చింది. కేవలం మద్దతే కాదు..ఈ ఎన్నికలలో ఐఎన్టీయూసీ తరఫున...వైసీపీ నేతే పోటీలో దిగి పరాజయం పాలయ్యారు.
అయితే ఈ ఎన్నికలలో వైసీపీ అనుబంధ కార్మిక సంస్థ పోటీ చేయకపోవడానికి కారణం కార్మికులలో వ్యక్తమౌతున్న వ్యతిరేకతే కారణమి పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద వైజాగ్ ఉక్కు కర్మాగారం ఎన్నికల ఫలితం కేవలం ఉక్కు కర్మాగారానికే పరిమితం కాదనీ, అది విశాఖ నగరంలో అధికార పార్టీ వ్యతిరేకతకు అద్దం పడుతున్నదని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే కేవలం విశాఖ నగరానికే కాక ఉక్కు జ్వాలలు రాష్ట్ర మంతటా వ్యాపించే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ తెలుగువాడు నినదించి ఆందోళనలతో రగిలి వందల మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటు పరం చేస్తున్నా ఆపడానికి ఇసుమంతైన ప్రయత్నించని వైసీపీ సర్కార్ పై ఉక్కు కార్మికుల్లోనే కాదు...రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. విశాఖ ఉక్కు కేవలం ఒక కర్మాగారం కాదు అది ఆంధ్రుల సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ను వైసీపా పట్టించుకోని ఫలితమే వైజాగ్ స్టీల్ ఎన్నికల్లో ఓటమి.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నికలలో తెలుగుదేశం అనుబంధ యూనియన్ మద్దతు ఇచ్చిన ఐఎన్టీయూసీ దాదాపు 466 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది.
ఈ మూడేళ్లలో వైసీపీకి ఏదైనా ఒక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలడం ఇదే ప్రథమం అని చెప్పవచ్చు. విశాఖ ఉక్కు సెగ వైసీపీని మరింత ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయమన్నది పరిశీలకుల అంచనా. ఈ అంచనాకూ కారణం లేకపోలేదు. ఒక కర్మాగారం కార్మిక సంఘం ఎన్నికలే అయినా...ఈ ఎన్నికల ప్రచారం మాత్రం ఒక అ సెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఎన్నిక స్థాయిలో జరిగింది. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. చివరికి గేట్ మీటింగులకు కూడా హాజరై ప్రచారం నిర్వహించారు. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినా వైసీపీ తాను మద్దతు పలికిన యూనియన్ ను గెలిపించుకోలేకపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/steel-plant-privitisation-heat-defeats-ycp-25-134996.html
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.