శ్రీ లంక సమస్యపై తమిళ పార్టీల రాజకీయ చదరంగం

Publish Date:Mar 26, 2013

Advertisement

 

రెండు నెలల క్రితం కమల్ హస్సన్ తన విశ్వరూపం సినిమాను తన స్వంత రాష్ట్రమయిన తమిళనాడులో విడుదల చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలిసిందే. పాము-ముంగీసల వంటి ఆజన్మ శత్రుత్వం ఉన్న డీయంకె పార్టీ అధ్యక్షుడు కరుణానిధి, ఏఐఏ డీయంకె పార్టీ అధ్యక్షురాలు మరియు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారి జయలలితల మద్య జరిగే రాజకీయ పోరాటాలలో ఇటువంటివారు అనేకమంది బలయిపోతూనే ఉంటారక్కడ.

 

ఇటీవల డీయంకె పార్టీ అధ్యక్షుడు కరుణానిధి శ్రీ లంక సమస్యను సాకుగా చేసుకొని యుపీఏ ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో, రాష్ట్రంలో ఆయన పార్టీకి అనుకూలంగా రేటింగ్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. పార్లమెంటు ఎన్నికలు దగ్గిరపడుతున్నఈ సమయంలో పూర్తిగా అణచివేశాననుకొన్న డీయంకె పార్టీ మళ్ళీ అనూహ్యంగా బలం పుంజుకోవడంతో అప్రమ్మత్తమయిన జయలలిత, వెంటనే దానికి విరుగుడు మంత్రం వేశారు.

 

త్వరలో చెన్నైల్ లో జరుగనున్న ఐపియల్ మ్యాచులో శ్రీ లంక క్రికెట్ ఆటగాళ్లను తమ రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు అనుమతి ఇస్తే ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో వారికి బద్రత కల్పించడం కష్టం అవుతుంది కనుక, వారిని చెన్నై మ్యాచులో పాల్గొనకుండా నిషేదించాలని కోరుతూ జయలలిత ప్రధాని డా. మన్మోహన్ సింగుకు ఒక లేఖ వ్రాసారు.

 

డీయంకె పార్టీ మద్దతు ఉపసంహరణతో చిక్కులో పడ్డ యుపీయే ప్రభుత్వానికి, ఇంతవరకు బయట నుండి మద్దతు ఇస్తున్నసమాజ్ వాది పార్టీ కూడా క్రమంగా దూరమవుతున్న సూచనలు స్పష్టంగా కనబడటంతో, ప్రభుత్వం పడిపోకుండా ఉండాలంటే మరొక పార్టీ మద్దతు వెంటనే అత్యవసరం. కనుక, ఊహించని విధంగా జయలలిత నుండి వచ్చిన లేఖను ఒక అపూర్వ అవకాశంగా అందుకొన్న యుపీయే ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందిస్తూ బీసీసీఐ తో ఒక ప్రకటన కూడా చేయించింది. తద్వారా జయలలితను ప్రసన్నం చేసుకొని ఆమె పార్టీ మద్దతు పొందే ప్రయత్నాలు మొదలుపెట్టింది. డీయంకె పార్టీ కేంద్రాన్ని విరోధించి గనుక, జయలలిత తప్పకుండా తమ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.

 

అయితే, ఈ రెండు పార్టీలు కోడెద్దులా రాజకీయ పోరాటాలు చేస్తుంటే వాటి మద్య శ్రీ లంక తమిళ ప్రజలు మొదలుకొని క్రీడాకారుల వరకు అందరూ లేగ దూడలా నలిగిపోతుండటమే చాల బాధాకరం. నిజం చెప్పాలంటే శ్రీ లంక తమిళుల సమస్య ఈ నాటిది కాదు. గత మూడు దశాబ్దాలుగా ఉన్నదే. ఒకనాడు యల్.టీ.టీ.యి. నాయకుడు ప్రభాకరన్ చేతిలో అనేక మంది అమాయకులయిన తమిళులు ధన, మాన, ప్రాణాలు కోల్పోగా, ఇప్పుడు శ్రీ లంక ఆర్మీ చేతుల్లో కోల్పోతున్నారు.

 

ఈ రోజు వారికోసం వీదులకెక్కి పోరాటాలు మొదలుపెట్టిన రెండు తమిళ పార్టీలు ఏనాడు కూడా పూర్తి స్థాయిలో వారికి అండగా నిలబడలేదు సరికదా, అదే అంశం పట్టుకొని ఇద్దరూ రాజాకీయ లబ్ది పొందారు, ఇంకా ఇప్పటికీ పొందాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు.

 

గత శాసన సభ ఎన్నికలలో ఘోరంగా ఓటమిపాలయిన డీయంకె పార్టీకి నాటినుండి అనేక కష్టాలు చుట్టుముట్టాయి. కరుణానిధి కుమార్తె కనిమోలి, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఎ.రాజా అరెస్టులు, మరో వైపు జయలలిత రాజకీయ కక్ష సాదింపులు, కరుణానిధి ఇద్దరు కొడుకులు అళగిరి, స్టాలిన్ ల మద్య పార్టీ పీఠంకోసం పోరాటాలు వంటి అనేక సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కరుణానిధి, మంచి ప్రతిఫలం అందించే శ్రీ లంక సమస్యను ఎత్తుకొని, రాష్ట్ర రాజకీయాలలో పార్టీ పరిస్థితిని చక్కబెట్టాలని పన్నిన వ్యూహం కొంత మేరకు సత్ఫలితాలు ఇచ్చినట్లే కనిపిస్తోంది.

 

కరుణానిధి తన వ్యుహాలతో ముందుకు సాగిపోతుంటే ఆయనను తీవ్రంగా వ్యతిరేఖించడమే తన పార్టీ సిద్ధాంతంగా చేసుకొన్న జయలలిత చేతులు ముడుచుకొని కూర్చోరు గనుక, ఆమె కూడా అందివచ్చిన ఐపియల్ మ్యాచులతో ఆట మొదలుపెట్టేసారు.

 

డీ.యం.కే.పార్టీ ఐక్యారాజ్య సమితిలో మానవ హక్కుల సదస్సులో శ్రీ లంకకు వ్యతిరేఖంగా భారత్ ఓటేయాలని డిమాండ్ చేస్తే, త్వరలో శ్రీ లంకలో జరుగనున్న కామన్వెల్త్ అధినేతల సమావేశాలను బహిష్కరించాలని జయలలిత డిమాండ్ చేసారు.

 

తమిళ ప్రజల సున్నితమయిన భావోద్వేగాల నుండి రాజకీయ లబ్ది పొందాలనే ప్రయత్నంలో యల్.టీ.టీ.యి. మరియు శ్రీ లంక ఆర్మీల కంటే కూడా చాల దారుణంగా శ్రీ లంక తమిళుల సమస్యలతో ఈ రెండు తమిళ పార్టీలు ఆడుకొంటున్నాయిప్పుడు. సాటి తమిళులు కష్టాలలో ఉంటే వారిని ఏవిధంగా ఆదుకోవాలో ఆలోచించాల్సిన ఈ రెండు తమిళ పార్టీలు అదే అంశం మీద రాజకీయ చదరంగం ఆడుకోవడం చాలా హేయమయిన చర్య.

 

ఇక మరో విచారకరమయిన విషయం ఏమిటంటే, మన జాతీయ నాయకులెవరూ కూడా ఇంతవరకు వీరి ఆటలను ఖండించలేదు. ఎందుకంటే రానున్న ఎన్నికల తరువాత వారి అవసరం పడవచ్చునని దురాలోచనతో వెనుకంజ వేస్తున్నారు.

 

ఇంత కంటే మరో దారుణమయిన విషయం ఏమిటంటే, జాతీయ మీడియా శ్రీ లంక తమిళుల సమస్య కేవలం తమిళనాడుకు మాత్రమే చెందిన సమస్యగా భావిస్తూ, శ్రీ లంకలో ఆర్మీ చేతిలో ధన, మాన, ప్రాణాలు కోల్పోతున్న వారిపట్ల కనీస మానవధర్మం పాటించక నిర్లక్ష్యం వహించడం. జాతీయ మీడియాకు దక్షిణ భారతదేశం మీద మొదటినుండి చిన్న చూపే ఉంది. అందుకే శ్రీ లంక తమిళుల సమస్యల పట్ల స్పందించక పోయినప్పటికీ, జయలలిత ఐపియల్ క్రికెట్ మ్యాచులకు అడ్డం పడటం గురించి మాత్రం చాల పెద్ద చర్చలే చేస్తున్నాయి.

 

ఈ పరిణామాలన్నీ మనుషుల్లో నానాటికి మానవత్వం, నైతిక విలువలు కనుమరుగవుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.