సారీ! తెలంగాణా కోసం మాట్లాడలేను

Publish Date:Mar 26, 2013

Advertisement

 

 

 

 

కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణా విషయంలో ఇంతవరకు వెనుక నుండి సలహాలు ఈయడమే తప్ప, ఎన్నడూ తెర ముందుకు వచ్చి నిర్ద్వందంగా తన అభిప్రాయం చెప్పలేదు. తాను అధికార పార్టీలో బాధ్యతగల మంత్రి పదవిలో ఉన్నందునే మాట్లాడలేకపోతున్నానని ఆయన అనడం న్యాయమే. అయితే, ఆయన ఆ పదవిలో ఉనంతకాలం కూడా ఏమి మాట్లాడలేన్నపుడు, కేంద్రమంత్రిగా తన పరపతిని ఉపయోగించి కేంద్రాన్ని ఒప్పించలేనప్పుడు, ఆయన వలన తెలంగాణా కోరుకొంటున్నవారికి ఏమి ప్రయోజనం? ఆయన తెలంగాణాలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు కేంద్రమంత్రిగా తెలంగాణాపై మాట్లాడేందుకు తనకున్న పరిమితులు చెప్పుకొచ్చి, తన పరిస్థితిని అర్ధం చేసుకోమని ప్రజలను కోరడం నవ్వు తెప్పిస్తుంది.

 

ఆయనకు తెలంగాణ ఏర్పడాలని నిజంగా బలమయిన కోరికే ఉండి ఉంటే, అటు కేంద్రంతో తెలంగాణా కోసం పోరాడటమో లేక తెలంగాణా అనే పదం ఉచ్చరించడానికి కూడా అడ్డం పడుతున్న తన కేంద్రమంత్రి పదవిని, తన యంపీ పదవినీ త్యాగం చేసి, తెలంగాణా ఉద్యమానికి సారద్యం వహించడమో లేక వారితో కలిసి పోరాడటమో చేసి ఉండేవారు. గానీ, ఆయన తన మంత్రి పదవిని వదులుకోలేదు సరికదా, దాని వలననే తానూ తెలంగాణాపై మాట్లాడలేకపోతున్నానని క్షమించండంటూ తర్కం మాట్లాడుతున్నారు.

 

మే నెలలోగా కేంద్రం తెలంగాణా ప్రకటించకపోతే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణా ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని ఆయన అనుచరులు చెపుతున్నట్లు న్యూస్ పేపర్లలోవార్తలు ప్రచురితమయ్యాయి. ఆయన నిర్ణయం అదే అయినప్పుడు ఆ మాటేదో ఆయనే స్పష్టంగా ప్రజలకు, మీడియాకు చెప్పి ఉంటే హుందాగా ఉండేది. కానీ, తన అనుచరుల ద్వారా మీడియాకు చెప్పడం, మీడియా ద్వారా అధిష్టానం దృష్టికి వెళ్ళేలా చేయడం చూస్తుంటే తెలంగాణా పట్ల ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధం అవుతోంది.

 

దీని వెనుక ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే, ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం మీడియాలో వస్తున్న వార్తలను చూసి కంగారు పడి ఆయనకు నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తే ఆయనది పైచేయి అవుతుంది. అధిష్టానం ఈ విషయంలో సీరియస్ అయినట్లయితే ఆ వార్తలు మీడియా సృష్టి అని చెప్పి చల్లగా తప్పుకోవడానికి మార్గమూ ఉంటుంది. తానెక్కడా స్వయంగా పదవికి రాజీనామా చేస్తానని కానీ, తెలంగాణా ఉద్యమానికి అనుకూలంగా కానీ మాట్లాడలేదని ఆయన చెప్పుకోవడానికి అవసరమయిన మార్గాలన్నిటినీ ఆయన సిద్దంగా ఉంచుకొని ఈ విధంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. లేదంటే అపార రాజకీయ అనుభవజ్ఞుడయిన ఆయన, న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తలను వెంటనే ఖండించాలని తెలియక ఊరుకోలేదు.

 

ఇక, ఆయన తెలంగాణా కోసమే తన మంత్రి పదవిని త్యాగం చేయడం అనేది కూడా పూర్తిగా నిజం కాదు. గతంలో కీలకమయిన పెట్రోలియం శాఖను నిర్వహించిన ఆయన రిలయన్స్ కంపెనీకి అడ్డం పడుతునందునే ఆయనను ఆశాఖ నుండి తప్పించి అప్రదాన్యమయిన పట్టణాభివృద్ధి శాఖకు పంపేసారు. అంతకు మునుపు ఎన్నడూ కూడా ఆయనలో కాంగ్రెస్ అధిష్టానం పట్ల అసమ్మతి కనబడలేదు. కానీ, తనకు కేంద్రంలో ప్రాధాన్యత తగ్గిన తరువాతనే ఆయనకు పార్టీ అధిష్టానం పట్ల ఆగ్రహంతో ఉన్నసంగతి అందరికీ తెలిసిందే.

 

ప్రస్తుతం ఆయన చేప్పటిన మంత్రి పదవి ఆయనకు ఉన్నా ఊడినా ఒక్కటే గనుక, ఆయన ఆదేదో తెలంగాణా కోసమే త్యాగం చేస్తున్నట్లు చెప్పుకొంటే కనీసం రాష్ట్రంలోనయినా కొంచెం మంచి పేరు సంపాదించుకోవచ్చునని ఆయన ఉద్దేశ్యం కావచ్చును. కానీ, త్వరలో ఎన్నికలు రానున్న ఈ సమయంలో ఆయనే కాదు, పార్టీలో ఎవరూ కూడా పార్టీ అధిష్టానాన్ని ఎదిరించలేరు. ఎదిరిస్తే టికెట్లు రావని జగమెరిగిన సత్యం.

 

రాహుల్ యువమంత్రం పటిస్తున్న ఈ సమయంలో ఇటువంటి సీనియర్లలో ఎంతమందికి పార్టీ టికెట్స్ దక్కుతాయో ఎవరికీ తెలియదు. గనుక, టికెట్స్ రావనే విషయం కూడా కూడా పూర్తిగా రూడీ చేసుకొన్నతరువాతనే, ‘తెలంగాణా కోసమే’ రాజీనామా చేస్తే తీర్దానికి తీర్ధం ప్రసాదానికి ప్రసాదం రెండు కూడా దక్కుతాయని ఆయన ఉద్దేశ్యం కావచ్చును. అయినా, ప్రస్తుతం తెలంగాణా ఉద్యమాలు చేసేవారు ఇక్కడ చాలా మందే ఉన్నారు, గనుక అయన ఇప్పుడు వచ్చి కొత్తగా చేసేదేమీ ఉండదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.