టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు!?

Publish Date:Apr 27, 2022

Advertisement

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రెండు పదుల వయసును దాటేసింది. 21 ఏళ్లను పూర్తి చేసుకుని 22లోకి అడుగుపెడుతోంది. ఒక ప్రాంతీయ పార్టీ చరిత్రలో 20 ఏళ్లు అంటే చిన్న వయసు కాదు. నిజానికి, తెరాస ఆవిర్భావ సందర్భంలో అయితే అంతకు ముందు ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా అంతకు ముందు ఏర్పడిన పార్టీల బాటలోనే తెరాస కూడా తెరమరుగై పోతుందనే అభిప్రాయమే బలంగా వినిపించింది. అయితే, పుష్కర కాలం పైగా తెరాస సారధ్యంలో సాగిన తెలంగాణ ఉద్యమం 1200 మంది తెలంగాణ బిడ్డల బలిదానంతో 2014 లో విజయవంతమైంది. అది చరిత్ర.

ఇక ప్రస్తుతంలోకి వస్తే, అలా, మఘలో పుట్టి పుబ్బలో పోతుందనుకున్న పార్టీ, ఈరోజు 21సంవత్సరాలు పూర్తి చేసుకుని 22 వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది.అంతే కాదు, ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న తెరాస, కాలానుగుణంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు ఉద్యమ పార్టీగా అందరినీ కలుపుపోయిన తెరాస, రాష్ట్ర ఆవిర్భావ క్షణం నుంచే, ఫక్తు పదహారు అణాల రాజకీయ పార్టీగా అవతరించింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఏమి జరిగింది అనేది, కళ్ళ ముందు కదులుతున్న చరిత్ర. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ఉద్యమ పార్టీగా అవతరించిన తెరాస, ఇప్పుడు కుటుంబ పార్టీగా మారిపోయిందనే విమర్శలు, ఆ నాటి ఉద్యమ నాయకులే ఆరోపిస్తున్నారు.  

ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం తెరాస భవిష్యత్ విషయంలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర అవతరణ నాటి నుంచి ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలలో తెరాస ఆధిపత్యం కొనసాగుతూనే వుంది. అయినా, ముఖ్యమంత్రి ఇజ్జత్ కాసవాల్ గా తీసుకున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో వేల కోట్ల రూపాయలు కుమ్మరించినా, ఫలితం లేక పోవడంతో తెరాసలో భయం మొదలైంది. హుజురాబాద్ ఓటమితో మొదలైన  అలజడి, ఈరోజు వరకు కూడా కొనసాగుతూనే వుంది. చివరకు, ఎన్నికల వ్యూహరచనలో ఎవరికీ తీసిపోని, కేసీఆర్, దేశంలో ఎన్నికల వ్యూహకర్తగా ఓ వెలుగు వెలుగుతున్న ప్రశాంత్ కిశోర్’ ను ఎంగేజ్ చేసుకున్నారు. ఇందుకు తెరాస నాయకులు ఏకారణం చెప్పినా, తెరాస నాయకత్వానికి విశ్వాసం సన్నగిల్లడం వల్లనే పీకే. ఐప్యాక్ అవసరం ఏర్పడిందని పరిశీలకులే కాదు, ప్రజలు కూడా నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఎవరో అన్నట్లుగా ఇలా ఒక ఉద్యమ పార్టీ, కిరాయి వ్యూహకర్తను వేల కోట్ల రూపాయలు కుమ్మరించి హైర్ చేసుకోవడం, ఉద్యమ స్పూర్తికే అవమానమా అనే మాట వినవస్తోంది.

అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, అందుకు ఇంకా కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ, అన్నటికంటే ముఖ్యంగా 1200ల మంది బలిదానంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన, కుటుంబ అవినీతి పడుకుపోవదమే ప్రధాన కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అయితే, తెరాస నాయకత్వం మాత్రం, ఆవిషయంలో తగ్గేదేలే, అన్న విధంగా ముందుగు సాగుతోంది. ఈ రోజు జరుగుతున్న ప్లీనరీ క్రతువు మొత్తం, అంతా (తారక) రామ మయం అన్నవిధంగా సాగుతోంది. అంటే, కుటుంబ పాలనకు జై కొడుతోంది. కేసీఆర్’ స్థానంలో కేటేఆర్’ బొమ్మ కనిపిస్తోంది.ఈ నేపధ్యంలో తెరాస భవిష్యత్ ఏమిటి? ఎలా ఉంటుంది? ఏమవుతుంది?అనేది కాలమే నిర్ణయించాలి..నిర్ణయిస్తుంది, అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

By
en-us Political News

  
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు. నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం త‌న వ‌ల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.