Publish Date:Apr 27, 2022
కొన్నాళ్లుగా వైసీపీలో హోల్ అండ్ సోల్ సజ్జలనే. జగన్ తర్వాత నెంబర్ 2 పొజిషన్. మొదట్లో విజయసాయిరెడ్డికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ఉత్తరాంధ్రకు సామంతరాజును చేశారు. ఆయనేమో రాజ్యం మొత్తం నాదేనంటూ విర్రవీగారు. బాగా ఓవర్ చేశారు. వరుస ఫిర్యాదులతో సాయిరెడ్డి కోరలు కట్ చేశారు సీఎం జగన్. విశాఖ నుంచి తీసుకొచ్చి.. తన తాడేపల్లి ప్యాలెస్లో బంధించేశారు. పార్టీ అనుబంధ సంఘాల సమన్వయ బాధ్యతలంటూ ఏదో చిన్న పోస్టు పడేసి.. ఇకపై ఇక్కడే పడుండంటూ ఆదేశించారు. ఇక విజయసాయి పని ఖతం అనుకున్నారంతా. హవా అంతా సజ్జలదేనంటూ చర్చ జరిగింది. కానీ, నెల రోజుల వ్యవధిలోనే సీన్ మారిపోయింది. ప్రయారిటీ తారుమారు అయింది. సజ్జల పవర్స్కు కోత పెట్టారు. విజయసాయికి ఆ పదవులు కట్టబెట్టారు. ఎవరికి ఏ పనులు అప్పగించాలో.. బహుషా జగన్కే క్లారిటీ లేనట్టుంది.
సలహాదారు తానే.. పార్టీ బాధ్యతలూ తనకే.. తానే నెంబర్ 2 అనుకుంటూ గాల్లో తేలిపోతున్న సజ్జల రామకృష్ణారెడ్డిని.. తీసుకొచ్చి నేల మీద నిలబెట్టేశారు జగనన్న. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డికి.. వైసీపీ జిల్లా అధ్యక్షుల్ని.. రీజనల్ కోఆర్డినేటర్లను సమన్వయం చేసుకునే బాధ్యతలు ఇచ్చారు. దాదాపు పార్టీ అంతా సజ్జల చేతిలో పెట్టినంత పని చేశారు. అంతలోనే ఏమైందో ఏమో.. ఆ వెంటనే మళ్లీ నిర్ణయాన్ని సవరించుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు.. రీజనల్ కోఆర్డినేటర్ల సమన్వయ బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రం కేవలం ఎమ్మెల్యేల బాధ్యతలకే పరిమితం చేసి.. ప్రాధాన్యం తగ్గించేశారు. ఎప్పటిలానే మీడియా కోఆర్డినేషన్ను ఆయన దగ్గరే ఉంచేశారు.
ఎందుకు? సడెన్గా జగన్మోహన్రెడ్డి ఎందుకిలా సజ్జల పవర్స్కు కోత వేశారు? విజయసాయిరెడ్డికి మళ్లీ ఎందుకు ప్రాధాన్యం పెంచారు? అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నెంబర్ 2 అనే పదమే జగన్లో భయానికి కారణం అంటున్నారు. పార్టీ అంటే తానొక్కడి పేరు మాత్రమే వినిపించాలని.. తన తర్వాత మరెవరూ నెంబర్ 2గా ఉండకూడదనేది జగన్ లెక్క అంటున్నారు. అందుకే, సొంత చెల్లి షర్మిలను సైతం పక్కనపెట్టేశారని గుర్తు చేస్తున్నారు. ఇటీవల సజ్జల పేరు పార్టీలో మారుమోగుతుండటం.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఆయన సలహాలు, సూచనల మేరకే జరిగిందంటూ పార్టీ నేతలంతా సజ్జల చుట్టూ తిరుగుతుండటం జగన్కు నచ్చలేదని తెలుస్తోంది. అందుకే, పార్టీలో సజ్జల స్థాయిని అమాంతం తగ్గించేశారని చెబుతున్నారు. విజయసాయిరెడ్డిని ఇప్పటికే పార్టీ నేతలంతా దూరం పెట్టేశారు కాబట్టి.. సజ్జలను కాదని సాయిరెడ్డిని ఎంచుకున్నారని అంటున్నారు. ఇలా వైసీపీలో ఎవరికీ ప్రాధాన్యం ఉండదని.. ఎవరూ సూపర్ పవర్ కాదని.. తాను మాత్రమే సుప్రీం అనే మెసేజ్ పార్టీ వర్గాలకు ఇవ్వడానికే.. జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-action-on-sajjala-25-135050.html
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం తన వల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.