అస్తమించని సూర్యుడు.. సీమసింహం.. పరిటాల రవీంద్ర‌ చ‌రిత్ర ఇదే..

Publish Date:Jan 24, 2022

Advertisement

పరిటాల రవి.. దివంగత టీడీపీ నేత. 2005 జనవరి 24న ప్రత్యర్థుల చేతిలో పట్టపగలే హత్యకు గురైన ప్రజల మనిషి. చివరి శ్వాస వరకూ ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు. అరాచక శక్తులకు సింహస్వప్నంలా తిరుగాడిన నేత. అయితేనేం.. శత్రువులు పకడ్బందీగా పన్నిన పద్యవ్యూహంలో క్షణం పాటు పొరపాటుతో వేసిన ఆయన అడుగే నెత్తుటి మడుగులో ముంచింది. పరిటాల రవి మీద ప్రత్యర్తులు బుల్లెట్ల వర్షం కురిపించి, అనంతపురంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఆవరణలోనే ఆయన ఆఖరి శ్వాసను తీసేశారు దుర్మార్గులు.

తండ్రి శ్రీరాములు, సోదరుడు హరిబాబు సాగించిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రజా నాయకుడు పరిటాల రవి. అనంతపురం జిల్లాలోని ముఠా కక్షల నిర్మూలనే జీవిత ధ్యేయంగా ప్రతి క్షణమూ తపించారు పరిటాల రవి. ఏపీలో తొలి మండల వ్యవస్థకు జరిగిన ఎన్నికల్లో పరిటాల రవి మద్దతుతో రామగిరి మండల అధ్యక్ష పదవికి రంగంలో దిగిన దళితుడు ఓబన్న అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో రవి రాజకీయ రంగంలో తొలిసారిగా తన ఉనికికి చాటుకున్నారు పరిటాల రవి. భారీ పోలీస్ బందోబస్తుతో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చెన్నారెడ్డిని రామగిరి మండలంలో  కాలిడనివ్వకుండా పరిటాల రవి ఆత్మాహుతి దళంతో అడ్డుకున్నారు. రవి చేసిన ఈ చర్యతో బడుగు బలహీన వర్గాలకు కొండంత బలాన్నిచ్చింది.

1991 నుంచి ప్రత్యర్థులు పెనుగొండ, ధర్మవరం ప్రాంతాలపై విశృంఖల స్వైర విహారంతో విరుచుకుపడ్డారు. హత్యలు, అపహరణలు, మానభంగాలు నిత్యకృత్యం అయ్యాయి. అలాంటి అరాచక శక్తులతో ఎదురొడ్డి పోరాడిన పరిటాల రవి స్థానికుల్లో హీరో అయ్యారు. తనపై, తన అనుచరులపై నక్సలైట్ల ముద్ర వేసి హతమార్చాలనే ప్రయత్నం జరుగుతోందని తెలుసుకున్న రవి 1992లో జిల్లా ఎస్పీ కేవీ రెడ్డి సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు.

1993 జూన్ 7న పరిటాల రవి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన రవికి అనంతపురం జిల్లాతో పాటు మొత్తం రాయలసీమ టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు పరిటాల రవికి బ్రహ్మరథం పట్టారు. మద్దెలచెరువు టీవీ బాంబు కేసులో జైలులో ఉన్న రవి జైలు నుంచే టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి, అన్ని అవాంతరాలు అధిగమించి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. పరిటాల రవి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైనా.. అప్పటి సీఎం ఎన్టీ రామారావు కేబినెట్ లో కార్మికశాఖ మంత్రి పదవి వరించింది. ఇక ఆ తర్వాత అనంపురం జిల్లా చరిత్రే పరిటాల రవి అడుగుజాడల్లో నడిచిందంటే అతిశయోక్తి కాదు.

పరిటాల రవి తన బలంతో శత్రు సంహారం చేస్తాడని ప్రత్యర్థులు భయపడ్డారు. వారి భయాలు, అంచనాలను చిత్తు చేశారు పరిటాల రవి. అనేక గ్రామాల్లోని వివిధ ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చారు. ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలకు పునరావాసమూ కల్పించారు. జిల్లాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషిచేశారు. ఆ తర్వాత టీడీపీ పగ్గాలను, సీఎం పదవిని ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు చేపట్టారు. ఎనిమిదేళ్లు కేబినెట్ మంత్రిగా పనిచేసిన పరిటార రవి ఎన్టీఆర్ మరణానంతరం శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో చేరారు. 

1997లొ తన తండ్రి జీవిత కథ ఆధారంగా తాను నిర్మిస్తున్న ‘శ్రీరాములయ్య’ సినిమా ముహూర్తం నవంబర్ 19న కారుబాంబు పేలుడులో తీవ్రంగా గాయపడినా ప్రాణాలతో బయటపడ్డారు. నసనకోట వద్ద శిథిలావస్థలో ఉన్న రాయల కాలంనాటి దేవాలయాన్ని 2003లో ఎంతో శ్రమతో పునరుద్ధరించారు. అదే ఆలయం ప్రాంగణంలో రెండున్నర లక్షల మంది ప్రజల సమక్షంలో పరిటాల రవి 550 జంటలకు సామూహిక వివాహాలు చేయించారు. 2004 ఫిబ్రవరిలో మరో 1,116 జంటలకు పెళ్లిళ్లు జరిపించారు.

2004లో టీడీపీ పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో పరిటాల రవి అనుచరుల ఏరివేత ప్రారంభించింది. రవిపై ఉన్న పాత కేసులు తిరగదోడింది. తన ప్రాణానికి ముప్పు ఉందని, సరైన రక్షణ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు పరిటాల రవి. దీంతో రవికి అప్పటి వరకు రక్షణగా ఉండే గన్ మెన్ సంఖ్యను రెండుకు తగ్గించింది కాంగ్రెస్ సర్కార్. రవి ఇళ్లలో సోదాలు జరిగాయి. తెలుగుదేశం అనుచరులు, మద్దతుదారుల మీద దాడులు, హత్యల పరంపర కొనసాగింది.

ఇక తన ప్రాణాలకు వాటిల్లే పరిస్థితి వచ్చిందని తెలుసుకున్న రవి మానసికంగా అన్నింటికీ సిద్ధం అయ్యారు. తన ఒక్కడి ప్రాణాలను రక్షించుకోవడం కోసం తనను నమ్ముకున్న ప్రజలను వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదని నిర్ణయించుకున్నారు. 2005 జనవరి 24న అనంతపురం టీడీపీ ఆఫీసులో అనేక మంది అతిరథ మహారథులు, పార్టీ శ్రేణులు, నాయకులు, సాయుధులైన అంగరక్షకులు ఉండగానే పరిటాల రవిపై ప్రత్యర్థులు గుళ్ల వర్షం కురిపించారు. ప్రజల నాయకుడిని నెత్తుటి మడుగులో నింపేశారు.

దివంగత జననేత పరిటాల రవికి స్వగ్రామం రామగిరి మండలం వెంకటాపురంలో ప్రతి ఏటా వర్ధంతి కార్యక్రమం జరుగుతోంది. కుల, మత, ప్రాంతాలకు అతీతమైన వ్యక్తిత్వంతో ప్రాణం ఇచ్చే అసంఖ్యాకమైన అభిమానులను సంపాదించుకుని ‘అస్తమించని సూర్యుడు రవి’ అని ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.

By
en-us Political News

  
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పొటెత్తుతున్నారు.
తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్. తెలుగు నేల, తెలుగు జాతి ఉన్నంత వరకూ గుర్తుండి పోయే మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. తెలుగుజాతి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిన సందర్భంలో ఆయన చేసిన సింహ గర్జన యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందజేశారు.
తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూభారతి’ అనేది పేద రైతుకు చుట్టమని ముఖ్యమంత్రి అన్నారు.
మహానాడు ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగు దేశం పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయిందని జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్ నడిపేందుకు ఇండియన్ రైల్వేశాఖ ప్లాన్ చేస్తోంది.1667కి.మీ దూరాన్ని ఈ రైలు ఒక్క రోజులోనే చేరనుంది. ఢిల్లీలో రాత్రి 8.50కు బయల్దేరే ఈ రైలు తర్వాతి రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ రానుంది.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మన దగ్గర ఉంటే మనకు విలువ తెలియడం లేదని మంత్రి టీజీ భరత్ అన్నారు.
కడప నగర శివారుల్లోని పబ్బాపురం లే ఔట్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహానాడుకు భారీ సంఖ్యలో తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. పూర్తిగా మహానాడు పసుపుమయం అయ్యింది. కళాకారులు, సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళ వాయిద్యాలతో స్వాగతాలు పలికారు.
ఊరాసాకు ఎకరం 99 పైసలకే ఇచ్చినట్టు నిలిపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. కడప నగరంలో పబ్బాపురం లే ఔట్ లో నిర్వహించిన మహానాడు మొదటి రోజు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నవంబర్ వరుకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ జీవో ఆర్టీ నంబర్ 1028ను జారీ చేశారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత, సొంత తండ్రి అయిన కేసీఆర్ కు రాసిన లేఖ సృష్టించిన, సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపణలు ఇప్పటిలో ఆగేలా లేవు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే భద్రతకు కీలకమైన "కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే పరిశోధన సంస్థను ఏర్పాటు చేయడానికి రూ.265 కోట్లు మంజూరు చేసింది.
కరకట్ట కమల్ హసన్ ఆర్కేపై కేసు నమోదైంది. మంగళగిరిలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.