న్యూయార్క్ టైమ్స్ లో అమరావతి కథనం.!

Publish Date:Aug 13, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని   అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అమరావతి డిజైన్, అభివృద్ధి, నగర నిర్మాణంలో వేగం ఇలా అమరావతికి సంబంధించిన ప్రతి అంశానికీ అంతర్జాతీయంగా విశేష గుర్తింపు వస్తోంది. తాజాగా   ది న్యూయార్క్ టైమ్స్ అమరావతి నిర్మాణం, పురోగతి, ప్రత్యేకతలపై ప్రత్యేక కథనం ప్రచురించింది. దానికి   ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సామాజిక ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇండియాలో  నగర జీవన ప్రమాణాలకు అమరావతి ఒక కొత్త కొలమానాన్ని నిర్దేశిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.   పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా, పర్యావరణహితమైన, అత్యాధునిక సాంకేతికతతో కూడిన నగరంగా అమరావతిని తీర్చిదిద్దడమే తన ధ్యేయమని చంద్రబాబు పేర్కొన్నారు. 

అమరావతిని  నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న కృషిని వివరిస్తూ  ది న్యూయార్క్ టైమ్స్  సమగ్ర విశ్లేషణాత్మక కధనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో ఒక వ్యక్తి (చంద్రబాబు) దృఢ సంకల్పంతో ఇండియాలో దేశంలోనే అతి పెద్ద పట్టణ ప్రణాళిక రూపుదిద్దుకుందని ఆ కథనంలో న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కృష్ణా నదీ తీరాన   ఆధునిక మౌలిక వసతులతో నూతన నగరం రూపుదిద్దుకుంటున్న తీరును ఈ కథనం కళ్లకు కట్టింది. పర్యావరణ పరిరక్షణ,  ఆధునిక అవసరాలకు తగినట్లుగా నగర డిజైన్ ఉందంటూ ప్రస్తుతించింది.

నగర వైశాల్యంలో దాదాపు 60 శాతం పచ్చదనం, జల వనరులకే కేటాయించారనీ, పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించడంలో భాగంగా వేల మైళ్ల పొడవైన ప్రత్యేక సైక్లింగ్ మార్గాలు, అంతర్గత జలమార్గాలకు ప్రాధాన్యత ఇచ్చారనీ పేర్కొంది.   ప్రసిద్ధ  ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్  లేఅవుట్ ప్రకారం రాజధాని నగర పరిపాలనా కేంద్రాలు,  అసెంబ్లీ  భవనం,  ఇతర ప్రధాన మౌలిక వసతుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని వివరించింది.  

ఇంకా ఆ ప్రత్యేక కథనంలో న్యూయార్క్ టైమ్స్.. అమరావతి   పాలనా నగరంగానే  గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మారేందుకు చంద్రబాబు సర్కార్ అమలు చేస్తున్న ప్రణాళికలూ ప్రస్తుతించింది.  50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు అవుతున్న క్వాంటం వ్యాలీని ప్రత్యేకంగా ప్రస్తావించింది.   దీని ద్వారా  అత్యాధునిక డీప్ టెక్నాలజీ,  పరిశోధనలకు పెద్దపీట వేస్తున్న తీరునూ పేర్కొంది.  ఐటీ దిగ్గజం ఐబీఎంకు చెందిన క్వాంటం కంప్యూటింగ్ మౌలిక వసతులను ఇక్కడ అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతిని వివరించింది. ఈ టెక్ హబ్  వల్ల అంతర్జాతీయ పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. 

అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు రాజధాని పరిధిలోని రైతులు, పెట్టుబడిదారులు మరియు ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు. రాజధాని నిర్మాణ ప్రాజెక్టుపై ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమౌతున్న సానుకూల దృక్పథం రాబోయే రోజుల్లో బహుళజాతి కంపెనీల పెట్టుబడులను మరింతగా ఆకర్షించే అవకాశం ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ.

Special story on Amarawathi, Newyork Ttimes, CBN, Share, Social Media, World Class, City   

 

By
en-us Political News

  
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఎర్రకోట పరిసరాల్లో మల్టీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు వేడుకల ముంగిన  ఈ ఈమెయిల్ బెదిరింపులు రావడంతో  భద్రత, నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు.  ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని ప్రవేశ  నిష్క్రమణ మార్గాల్లో వాహనాలు, ప్రయాణీకుల తనిఖీలు చేపట్టారు.  
కేసీఆర్ ఉచితంగా ఇస్తే.. ఇందిరమ్మ ఇండ్లకు 6 లక్షలా..!
గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో  ఇండియ్  ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎగుమతులు   పుంజుకున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో ఇండియా  దాదాపు 44.24 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో  4.22 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.
గతంలో   ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసినగా లా విద్యార్థులు వీసీకి ఈ లేఖ రాశారు. దీనిపై తీవ్రంగా మడిపడిన బీసీఐ..   నాల్సార్‌ విద్యార్థులను అడ్వకేట్లుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.  
తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది
వైసీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఎండనకా, వాననకా తమ కళ్లెదుటే మట్టి దిబ్బలుగా మిగిలిపోయిన కలల రాజధానిని చూసి మూగబోయిన గుండెలకు నేడు కొద్దిగా ఉపశమనం లభించింది.
సావర్కర్ పరువునష్టం కేసులో ఊరట..!
గోదావరి పుష్కరాలు– 2027 నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని సికింద్రాబాద్‌ జోన్‌ అద నపు డీసీపీగా పనిచేస్తున్న జె. నర్సయ్యకు 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకం అందుకోనున్నారు.
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రజాస్వామ్య స్ఫూర్తితో నినాదించిన మన సభ.. జన సభ ఇప్పుడు మా అసెంబ్లీ ప్రజల అసెంబ్లీ అన్నఆయన ఆశయానికి సజీవ రూపంగా నిలవనుంది.
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సురక్ష కా తిరంగా ప్రత్యేక సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.