Publish Date:Feb 12, 2026
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డికి 2024 ఎన్నికల తరువాత నుంచీ లెవన్ రెడ్డి అనే పేరు కూడా వచ్చి చేరింది. వైసీపీ కార్యకర్తలు పార్టీ ర్యాలీల్లోనే ఈ పేరుతో నినాదాలు కూడా చేస్తుంటారు. ఇందుకు కారణం 2024 ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని వైసీపీ సాధించిన సీట్ల సంఖ్య 11 కావడమే. కొందరైతే ఆయనను లెవనాసుర అని కూడా అంటుంటారు.
అది పక్కన పెడితే తాజాగా జగన్ అసెంబ్లీకి ఇలా హాజరై, అలా వాకౌట్ చేసినప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు 11-11-11 అంటూ కామెంట్ చేశారు. పదకొండు మంది ఎమ్మెల్యేలతో వచ్చిన జగన్ 11 నిమిషాల 11 సెకన్లు మాత్రమే ఉండి వెళ్లడంతోనే స్పీకర్ ఈ కామెంట్ చేశారని అంటారు. ఆ మధ్య ఒక సినిమా వేదికపై నటుడు పృధ్వీ పదకొండు గొర్రెలు అంటూ చేసిన కామెంట్ ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో.. ఆ కామెంట్ చేసిన పృధ్విని జగన్ సైన్యం, అంటే వైసీపీ శ్రేణులు ఎంతలా వేటాడి, వెంటాడి వేధించాయో కూడా తెలిసిందే. ఇందుకు కారణం మరేమీ కాదు.. 11 అన్న సంఖ్య అంటే జగన్ కు, ఆయన సామాజిక మాధ్యమ సైన్యానికీ కూడా అస్సలు గిట్టదు. ఈ సంఖ్య నినడానికీ, కనడానికీ కూడా వారికి భయం, బెదురు. దీంతో ఎక్కడ 11 నంబర్ కనిపించినా, అది జగన్ ను ఉద్దేశించినదే అని వాళ్లకు వాళ్లు నిర్ణయించేసుకుని ఉడుక్కుంటుంటారు. అంతెందుకు ఆయన జైల్లో ఉన్న కాలాన్ని కూడా పదకొండుకు ముడిపెట్టి నెటిజనులు సెటైర్లు వేస్తున్న పరిస్థితి. అలాగే ఆయన చట్టపరంగా ఎదుర్కొంటున్న కేసులలోనూ 11 నంబర్ మేజిక్ చేస్తూన్నదంటారు. సీబీఐ ఆయనపై వేసిన ఛార్జి షీట్ల సంఖ్య 11. ఇక ఆ కేసుల్లో ఆయన ఏవన్ నిందితుడు.
ఏ అంటే న్యూమరాలజీ ప్రకారం ఒకటి. వన్ అంటే ఒకటి. ఈ రెండింటినీ పక్క పక్కన పెట్టి చూసినా పదకొండే వస్తుందని జగన్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతున్న సంగతీ విదితమే. ఇక జగన్ వరుసగా 11 శుక్రవారాలు.. కోర్టుకు హాజరవడం కూడా అప్పట్లో మీడియా బాగా హైలెట్ చేసింది. అయితే అది 11వ నెంబర్ గా కాకుండా శుక్రవారంగా ప్రచారంలోకి వచ్చింది. అది వేరే సంగతి. ఒకప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య కూడా 11 ఉండేది. ఇటీవల కొందరు రిజైన్ చేయడంతో ఆ సంఖ్యలో మార్పు వచ్చింది. అలాగే జగన్ ఢిల్లీ పర్యటనల్లోనూ, సీట్ల కేటాయింపుల్లోనూ, పదకొండవ నెంబర్ ఆయన్ను వదల కుండా వెంటాడిందని అంటారు. గతంలో జగన్ ఢిల్లీ వెళ్లినపుడు ఆయనకు కేటాయించిన నివాసం, లేదా ఆయన హోటల్ రూం నెంబర్ కూడా 11.
ఇక జగన్ లెవన్ పై మీమ్స్ గురించి చెప్పనక్కర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవన్ లాగా.. జగన్స్ బొ*గ్స్ లెవన్ అనే పేరు మీద కూడా కొందరు మీమ్స్ గుప్పించారు. ఇలా జగన్ ని పదకొండో నెంబర్ ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో వెంటాడి వేధిస్తోందంటారు పరిశీలకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/speaker-satire-in-jagan-25-213932.html
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.