వాతావరణ శాఖ చల్లటి కబురు.. నైరుతి వచ్చేస్తోంది!
Publish Date:May 14, 2026
Advertisement
వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే భారత్ ను తాకనున్నాయి. మండే ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు నైరుతి రుతుపవనాల రాక గురించి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే ముందే అండమాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులు రుతుపవనాల రాకకు సానుకూలంగా మారడంతో ఈ వారం చివరి నాటికి ఇవి అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. శనివారం ( మే 16) నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ ను చేరుకుంటాయని పేర్కొంది. . ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం కేంద్రీకృతమై ఉన్న అప్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందనీ, రానున్న 48 గంటల్లో ఇది బలపడి.. రుతుపవనాల కదలికకు దోహదపడుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. సాధారణంగా అండమాన్ దీవులకు రుతుపవనాలు మే 22 నాటికి చేరుకుంటాయి. అయితే ఈసారి పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో దాదాపు 6 రోజుల ముందే ఇవి ప్రవేశించే అవకాశాలున్నాయి. అండమాన్ నికోబార్ తీరానికి చేరుకున్న రుతుపవనాలు అక్కడ నుంచి కేరళ తీరాన్ని తాకుతాయి.
http://www.teluguone.com/news/content/southwest-monsoon--arriving-early-36-219803.html
The role or involvement of al Qaeda in the attack
Nearly two years after President Barack Obama ordered 33,000
సైనా నెహ్వాల్ మేనేజింగ్ కంపెనీ రీతీ స్పోర్ట్స్తో రూ. 40 కోట్ల విలువ చేసే డీల్ను కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో సైనా నెహ్వాల్ సంవత్సరానికి 14 కోట్ల రూపాయలు పొందుతుంది. ఇంతకు ముందు సైనా నెహ్వాల్ ఏడాదికి 1.5 కోట్ల రూపాయలు పొందేది. ఈ డీల్ కుదరటంతో తను ఎంతో థ్రిల్ అయ్యానని, ఇంత త్వరగా పెద్ద అవకాశం లభిస్తుందని అనుకోలేదని సైనా చెప్పింది.





