వాతావరణ శాఖ చల్లటి కబురు.. నైరుతి వచ్చేస్తోంది!

Publish Date:May 14, 2026

Advertisement

వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే భారత్ ను తాకనున్నాయి. మండే ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు నైరుతి రుతుపవనాల రాక గురించి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.  ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే ముందే అండమాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులు రుతుపవనాల రాకకు సానుకూలంగా మారడంతో ఈ వారం చివరి నాటికి ఇవి అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని  తెలిపింది. శనివారం ( మే 16) నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ ను చేరుకుంటాయని పేర్కొంది. . ప్రస్తుతం  నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం కేంద్రీకృతమై  ఉన్న అప్పపీడనానికి అనుబంధంగా  సముద్ర మట్టానికి   4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందనీ, రానున్న 48 గంటల్లో ఇది బలపడి..   రుతుపవనాల కదలికకు దోహదపడుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. 

సాధారణంగా అండమాన్ దీవులకు రుతుపవనాలు మే 22 నాటికి చేరుకుంటాయి. అయితే ఈసారి పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో దాదాపు   6 రోజుల ముందే ఇవి ప్రవేశించే అవకాశాలున్నాయి.   అండమాన్ నికోబార్ తీరానికి చేరుకున్న రుతుపవనాలు అక్కడ నుంచి కేరళ తీరాన్ని తాకుతాయి.   

By
en-us Political News

  
బీసీసీఐ సహకారం కోరుతూ బంగ్లా క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ నజ్ముల్ అబేదిన్ తాజాగా ఓ లేఖ రాశారు. మేం బీసీసీఐకి రాసిన లేఖలో ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి ప్రస్తావించాం. బంగ్లాకు సహకారం అందించే అవకాశాలను పరిశీలించమని విజ్ఞప్తి చేశాం. సెప్టెంబర్‌లో బంగ్లా పర్యటనకు టీమిండియాను పంపించాలని కోరాం.
ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లోని సైనిక స్థావరాల నుంచి పారిపోయిన అమెరికా సైనికులు హోటళ్లలో తలదాచుకుంటూ.. పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఇక అటువంటి వారికి ఆశ్రయమిచ్చే హోటళ్లపై తమ డ్రోన్లు దాడి చేస్తాయని స్పష్టం చేశారు.
పండితులు వేదమంత్రోచ్ఛారణాల మధ్య మోడీకి, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు ఆశీర్వాదం అందజేశారు. అమ్మవారి స్వామి వార్ల ప్రసాదాలను, అలాగే చిత్రపటాన్ని మోడీకి అందించారు. అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా శ్రీశైల ఆలయ కళా రూపాన్ని మోడీకి బహూకరించారు.
Publish Date:Sep 21, 2012

The role or involvement of al Qaeda in the attack

Publish Date:Sep 21, 2012

Nearly two years after President Barack Obama ordered 33,000

సైనా నెహ్వాల్‌ మేనేజింగ్ కంపెనీ రీతీ స్పోర్ట్స్‌తో రూ. 40 కోట్ల విలువ చేసే డీల్‌ను కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో సైనా నెహ్వాల్ సంవత్సరానికి 14 కోట్ల రూపాయలు పొందుతుంది. ఇంతకు ముందు సైనా నెహ్వాల్ ఏడాదికి 1.5 కోట్ల రూపాయలు పొందేది. ఈ డీల్ కుదరటంతో తను ఎంతో థ్రిల్ అయ్యానని, ఇంత త్వరగా పెద్ద అవకాశం లభిస్తుందని అనుకోలేదని సైనా చెప్పింది.

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.