అవినీతికి కేరాఫ్ అడ్రస్లా మారుతోందా!
Publish Date:Oct 7, 2012
Advertisement
ఇంకా నామకరణం కూడా పార్టీ అప్పుడే ఓ అవినీతి బాంబ్ను పేల్చింది యుపిఎ సర్కార్లో ప్రధాన పార్టీ అయినా కాంగ్రెస్పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీగారి అల్లుడిపై... అది కూడా మామూలుగా కాదు 300 కోట్లు... ఇండియన్ ఎగైనెస్ట్ కరప్షన్ సభ్యులు అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్లు రియల్ ఎస్టేట్ సంస్థ డిఎల్ఎఫ్ నుండి వడ్డీలేకుండా 65 కోట్ల రూపాయల రుణం పొందారని, అలాగే కోట్లాది రూపాయల ఆస్తులను ఎలాంటి పూచీకత్తు లేకుండా కొనుగోలు చేశారని.. కేవలం మూడేళ్ళ కాలంలో తన ఆస్తులను 50 లక్షల నుండి 300 కోట్ల రూపాయలకు పెంచుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం వాద్రాకు ఐదు కంపెనీలు వున్నాయన్నారు. ఆయా కంపెనీలు వ్యాపార లావాదేవీల ద్వారా సంపాదిందేమీ లేదని.. వడ్డీ ద్వారా పొందిన ఆదాయమేనని అన్నారు. దీనిపై స్పందిస్తూ.. సోనియాగాంధీ తీవ్రంగా ఖండిరచారు. వాద్రా వ్యాపారవేత్త అని ఆయనకు అనేక వ్యాపారాలున్నాయని చెప్పారు. అక్రమాలకు పాల్పడవలసిన అవసరం లేదని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆరోపణల వెనుక బిజెపి హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు విమర్శించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపితే నిజానిజాలేవో బయటకు వస్తాయని బిజెపి అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ సఖ్వీ పేర్కొన్నారు. ఏమిటో... దేశం అవినీతి కేరాఫ్ అడ్రస్లా మారుతోందేమో అనిపిస్తోంది. ఎంతోమందిపై అవినీతిఆరోపణలు వస్తున్నాయి... దానికి సాక్ష్యాధారాలున్నాయని ఇంకొందరు చెబుతున్నారు. కేవలం రాజకీయ ఆటలకోసం కాకుండా అధికార, ప్రతిపక్ష, మిత్రపక్షమన్న భేదంలేకుండా అవినీతి ఆరోపణలు వచ్చిన లేదా ఎదుర్కొంటున్న అందరిపై త్వరితగతిన విచారణ చేపట్టి నిజాలు బయటకు తీస్తే ఆరోపణలు రుజువైన వారికి రాజకీయబహిష్కరణతో పాటు ఆస్తులను జప్తుచేసి అలా సేకరించిన ఆస్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులచే ఓ సంఘం ఏర్పాటుచేసి వారి ద్వారా ప్రజోపయోగ కార్యక్రమాలకు వాటిని నిజాయితీగా, లోపాలు లేకుండా ఖర్చుచేయించేలా చూస్తే దేశం వచ్చే ఐదారేళ్ళలోనే అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని సామాన్య ఆశాజీవి ఆశ. అయితే ఆరోపణల్లో నిజానిజాలు ఎలా వున్నా అవి నిరూపణ కావాలిగా.. కానివ్వాలిగా...! మనది ప్రజాస్వామ్యం...! పాలకుల చేతుల్లో, పార్టీల చేతుల్లో వున్న ప్రజాస్వామ్యం.
http://www.teluguone.com/news/content/sonia-gandhi-24-17960.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





