19వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష.. : వైద్య సేవలు అందించాలని కోర్టు ఆదేశం.!

Publish Date:Jul 16, 2026

Advertisement

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరశన దీక్ష  గురువారం (జులై 16) నాటికి 19వ రోజుకు చేరింది.  ఈ నేపథ్యంలో   ఆయన ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు తాజాగా  వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని   వైద్య చర్యలను తక్షణమే చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని   ఆదేశించింది.

వివరాలిలా ఉన్నాయి..  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనల్లో  భాగంగా వాంగ్‌చుక్ నిరవధిక నిరశన చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందంటూ దాఖలైన ఒక అత్యవసర పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రజాస్వామ్యంలో ప్రతి   పౌరుడి ప్రాణం అత్యంత విలువైనదని   ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిరసనకారుడి ప్రాణ రక్షణ నిమిత్తం తగిన వైద్య సహాయాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యత అని   స్పష్టం చేసింది.

 59 సంవత్సరాల వయసున్న సోనమ్ వాంగ్‌చుక్..  గత 19 రోజులుగా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇప్పటికే సుమారు 8.5 కిలోల మేర బరువు తగ్గినట్లు పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. మరో 48 గంటల పాటు ఇదే విధంగా నిరశన దీక్ష కొనసాగితే ఆయన అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం పడి ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.   ఆయనను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అవసరమైన పక్షంలో ద్రవరూపంలో ఉండే పోషక విలువలు, విటమిన్లు, అలాగే ఖనిజాలను శరీరానికి అందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 

ఈ పిటిషన్  విచారణ సమయంలో న్యాయస్థానం.. ఇంత కాలంగా దీక్ష జరుగుతున్నా ప్రభుత్వ వైద్య బృందాలు ఆయన ఆరోగ్యాన్ని ఎందుకు క్రమబద్ధంగా పరీక్షించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది తుషార్ మెహతా స్పందిస్తూ, వాంగ్‌చుక్‌కు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ వైద్యులు సైతం ఆయనను పరీక్షిస్తున్నారని   వివరించారు. అయితే దీనిపై సంతృప్తి చెందని హైకోర్టు..  ఇకపై కేవలం ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలోనే రోజువారీ ఆరోగ్య పర్యవేక్షణ సాగాలని, పరిస్థితి విషమిస్తే ఆలస్యం చేయకుండా చికిత్స ప్రారంభించాలని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది.

మరోవైపు హైకోర్టు ఈ   ఆదేశాలు జారీ చేయడానికి కొన్ని గంటల ముందే సోనమ్ వాంగ్‌చుక్ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. సుదీర్ఘ నిరాహార దీక్ష కారణంగా తన శరీరం  కొంత బలహీన పడిన మాట నిజమేనని..  అయినప్పటికీ తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని ఆ వీడియోలో  పేర్కొన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుండి సరైన స్పందన వచ్చేంత వరకు తానే రకమైన పరిస్థితుల్లోనూ ఈ దీక్షను విరమించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. 

తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసే దిశగా ఆయన రాబోయే రోజుల్లో చేపట్టబోయే  నిరసన ప్రణాళికను కూడా వెల్లడించారు. జులై 20న   జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టినట్లు చెప్పారు. ఈ మహా ధర్నాకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, ముఖ్యంగా వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ నిరసన కార్యక్రమం పూర్తయిన తర్వాత, తాము లేవనెత్తుతున్న ప్రజా సమస్యల బాధ్యతను ప్రజాప్రతినిధులైన పార్లమెంట్ సభ్యులకు అప్పగిస్తామని వాంగ్‌చుక్ వివరించారు. ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ఈ అంశాలపై గళం విప్పినప్పుడే ఈ ఉద్యమం సరైన మార్గంలో పయనించి ఆశించిన లక్ష్యాలను చేరుకుంటుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తాజా ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం వాంగ్‌చుక్ నిరసన వేదిక వద్ద ప్రభుత్వ డాక్టర్లతో కూడిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది.   

 Delhi High Court on Sonam Wangchuk, Ladakh Activist Protest Delhi, Sonam Wangchuk Health Condition, Jantar Mantar Protest July 20

By
en-us Political News

  
లో క‌ల్తీల నిరోధానికి స‌మ‌గ్ర చ‌ట్టాలు ఉన్న దేశాల‌ను సంద‌ర్శించి అక్క‌డి విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. ఆయా అధ్య‌య‌నాల ఆధారంగా ఒక స‌మ‌గ్రమైన నివేదికను త‌యారు చేయాల‌న్నారు.
భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.
ర్యాలీ సందర్భంగా హైడ్రా జిందాబాద్, జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అంటూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులతో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాలాలు వంటి ప్రజా ఆస్తులను కాపాడేం దుకు హైడ్రా చేస్తున్న చర్యలను కొనసాగించాలని కోరారు.
ఒక్కొక్కరిగా ఐదుగురు మునిగిపో తుండగా చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఐదుగురు జాలర్ల మృతదేహాలను వెలికి తీశారు.
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టులో వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో ఇరుపక్షాల లాయర్ల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిందితుడిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నందున అతని రిమాండ్‌ను పొడిగించాలని ప్రభుత్వ పక్ష న్యాయవాదులు కోరారు.
సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని విద్యార్థులు ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారు. సోనమ్ వాంగ్‌చుక్ పోరాటానికి మద్దతుగా తాము కూడా నిరశన దీక్ష చేపట్టనున్నట్లు బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు.
నీతి ఆయోగ్ ఈ ర్యాంకింగ్స్‌ను కేవలం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కాకుండా.. గత కొన్ని ఏళ్ల పారిశ్రామిక విధానాల ఆధారంగా లెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన గందరగోళం, పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను నిలిపివేయడం వంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాయి. పక్క రాష్ట్రాల్లో లాగా పాలసీ కంటిన్యూటీ లేకపోవడం పెట్టుబడిదారుల్లో అపనమ్మకాన్ని కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నడిరోడ్డుపై ఆమె దుస్తులు చించేసి, వివస్త్రను చేసి అవమానించారు. బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించకుండా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది.
రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి.
ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.