సాఫ్ట్ వేర్ వ్యవసాయం

Publish Date:Jul 20, 2021

Advertisement

కరోనాకి ముందు లాక్ డౌన్ అంటే ప్రపంచానికి పెద్దగా తెలీదు. దీని కారణంగా ఎంతోమంది ఉపాధిని కోల్పోయారు. ఆర్ధికంగా చితికిపోయారు. అయితే సాఫ్ట్ వేర్ రంగంలో పని చేస్తున్నవాళ్లపై కరోనా లాక్ డౌన్ ప్రభావం తక్కువనే చెప్పాలి. కారణం ఇంటి వద్దనుంచే పని చేసే వెసులుబాటు ఉండటం. అయితే  పని విధానం కొత్తగా ఉండటం. ఎప్పటికప్పుడు టీం సభ్యులతో ఫోన్ లో అందుబాటులో ఉండి చర్చల్లో పాల్గొనడం ఇలా కంపెనీ లో వెచ్చించే సమయంకన్నా వర్క్ ఫ్రం హోమ్ లో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీనివలన ఎంతోమంది సాఫ్ట్ వేర్ యువత ఒత్తిడికి లోనై మానసిక సమస్యలకు గురవుతున్నారు. దీనిని అదిగమించేందుకు కొంతమంది ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాలకు దగ్గరవుతున్నారు అనేది కాదనలేని వాస్తవం.

ప్రకాశం జిల్లా,కనిగిరి ప్రాంతం గార్లపేట గ్రామానికి చెందిన రాంబాబు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. లాక్ డౌన్ కారణంగా తను కూడాఇంటికి వచ్చేసాడు. అందరిలాగే పని ఒత్తిడి వలన ఇతను కూడా మొదట్లో కొంత ఇబ్బంది పడ్డాడు. అయితే దానిని అదిగమించేందుకు రొటీన్ కి భిన్నంగా  స్మార్ట్ వ్యవసాయాన్ని ఎంచుకున్నాడు. ఇంటి ఆవరణలోనే కూరగాయలు పండించాలి అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవు విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. కొంత వారి సహాయం కూడా తీసుకొని ఇంటి ఆవరణలోని మట్టిని తవ్వి  పరిసర ప్రాంతంలోనే ఎరువు తో మిశ్రమం అయిన మట్టిని తెప్పించి సత్తువ కలిగిన నేలను తయారు చేసాడు. నాణ్యమైన విత్తనాలు తెప్పించి నాటి చిన్న కూరగాయల తోటని సృష్టి చేసి స్నేహితులకు మిగతా గ్రామంలో యువతకు ఆదర్శంగా నిలబడ్డాడు రాంబాబు. ఇప్పుడు తనకే కాదు చుట్టుపక్కల వాళ్లకి కూడా తను పండించిన కూరగాయలను అందిస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నాడు. 

కుటుంబానిది వ్యవసాయ నేపధ్యమే అయినా వాణిజ్యపంటలే గానీ కూరగాయలు పండేవి కాదు. ప్రతి రెండు మూడు రోజులకు ఇంటికి కూరగాయలు అవసరమయ్యేవి. అవి అతనే మార్కెట్ కి వెళ్లి కొనుగోలు చేసుకొని వచ్చేవాడు. ఇలా రెండు నెలలు గడిచాక పని ఒత్తిడి, మరోవైపు తరచూ మార్కెట్ కి వెళ్లి ఇవి కొనుగోలు చేసుకురావడం చికాకుగా అనిపించింది. ఆ సమయంలో ఇంటి ఆవరణలోనే కూరగాయలు పండిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. అలా తన స్మార్ట్ వ్యవసాయ ప్రయాణం మొదలైందని చెప్పుకొచ్చారు. ఈ పని వలన నిరంతరం ల్యాప్ టాప్ ముందు కూర్చొని ఉండే నాకు ఈ తోట పెంపకం మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని సంతృప్తిని ఇస్తుంది అన్నారు.

రెండు అంకెల జీతం రాగానే పాశ్చాత్య పోకడలకు పోయి, అర్థంలేని వ్యాపకాల ప్రభావంతో వ్యసనాలకు అలవాటు పడి మన మూలలను మరిచిపోతున్న కొంతమంది యువతకు రాంబాబు ప్రయాణం ఆదర్శనీయం. ఆచరణీయం. మీరు కూడా కొత్తగా ఒకటి ప్రయత్నించండి.

"ప్రతి ఆలోచనా ఒక అగ్నికణం. దానిని సన్మార్గంలో రగిలించి వెలిగించావంటే నీతోపాటు చుట్టూ సమాజాన్ని కూడా వెలిగిస్తుంది."

◆వెంకటేష్ పువ్వాడ

 

By
en-us Political News

  
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది...
కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు, ఇతరుల నుండి అన్యాయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, ఇతరుల తప్పులకు తాము నష్టాన్ని  అనుభవిస్తున్నప్పుడు చాలా మంది న్యాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తారు.
మోసపోవడం,  మోసం చేయడం,  తప్పు చేయడం,  తప్పించుకు తిరగడం,  చట్టానికి విరుద్దంగా, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం..  ఒకటి రెండు కాదు..
ఏ సంబంధానికైనా నమ్మకం పునాది.  కానీ నేటి డిజిటల్ యుగంలో ఈ నమ్మకం కొన్ని విషయాల చుట్టూనే తిరుగుతుంది. వాటిలో ఫోన్ చాలా ముఖ్యమైనది. భార్యాభర్తలు ఒకరి ఫోన్ మరొకరు చెక్ చేయడంలో తప్పేముందని చాలా మంది అంటుంటారు....
జీవితం చాలా విచిత్రమైనది. నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండదు,  ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుందో లేదో తెలియదు.  కానీ చాలామంది రేపు ఇలా ఉంటే బాగుంటుంది అనే ఆశాభావంతో ఉంటారు.  ప్రతీది ఇలా జరగాలి, ఇలా జరిగితే బాగుంటుంది అని కొన్ని అంచనాలు కూడా పెట్టుకుంటారు....
ఎమోషన్స్  అనేవి మాటలకు అందని చర్యలు.  మాటల ద్వారా చెప్పలేని ఎన్నో విషయాలను ఎమోషన్స్ ద్వారా వ్యక్తం చేస్తుంటారు.  ఈ ఎమోషన్స్ ద్వారా అనుబంధం ఉన్నంత వరకు ఎవరైనా, ఏ బంధమైనా బాగుంటుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.