నిరంతర ఒత్తిడి.. నిత్య నరకం ఈజ్ ఈక్వల్ టు సాఫ్ట్ వేర్ ఉద్యోగం

Publish Date:Mar 10, 2026

Advertisement

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏసీ గదులు, లక్షల్లో జీతాలు, వీకెండ్ పార్టీలు.  అయితే బయటకు ఇంత గ్లామరస్ గా కనిపించే ఆ జీవితం వెనుక కష్టాలను, కన్నీటి గాథలను ఓ టెక్కి సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. ముఖ్యంగా బెంగళూరులో  టెక్కీల జీవితం నరక ప్రాయమని ఆ సీనియర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి వ్యక్తం చేసిన ఆవేదన పై నెటిజనులు నూటికి నూరుపాళ్లు నిజం అంటూ స్పందిస్తున్నారు.  ఆ టెక్కీ సాప్ఘ్ వేర్ ఉద్యోగి దైనందిన కార్యక్రమం ఎలా మొదలై, ఎలా ముగుస్తుందో వివరించిన ఆ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

 పొద్దున్న ఏడున్నరకు ఫిల్టర్ కాఫీతో మొదలై రాత్రి పదకొండున్నరకు కోడ్ రివ్యూతో ముగుస్తుందన్నది ఆ పోస్టు సారాశం. మొత్తం మీద ఆయన చెప్పిన దాని ప్రకారం ఉదయం ఎనిమిదిన్న లోపు  ఇంటి నుంచి బయటపడాలి. ఏ మాత్రం ఆలస్యమైనా బెంగళూరు ట్రాఫిక్ పద్మవ్యూహంలో అభిమన్యుడిలా చిక్కుకుపోవడం ఖాయం.  ఇక ఎలాగోలా ఆఫీసుకు చేరినా.. ఉదయం తొమ్మిదిన్నర నుంచీ టీమ్ మీటింగ్స్, ఆ మీటింగ్స్ మధ్యలో కూడా వందల సంఖ్యలో గ్రూపుల నోటిఫికేషన్లు.. వీటి మధ్య ఎలాగోలా పని ప్రారంభించినా.. బాస్ ల నుంచి అనవసర కాల్స్.. వీటి మధ్య పనిపై దృష్టి పెట్టి టాస్క్ పూర్తి చేయడమనేది అసిధారావ్రతంగా మారుతుంది. మామూలుగా ఒక మెయిల్ తో అయిపోయే పనికి కూడా గంటల కొద్దీ మీటింగ్ లు.. వీటన్నిటితో.. పని సాగక.. పెండింగ్ పని ఇంటి దగ్గర చేసుకోవచ్చులే అని ఆరున్నరకు ఆఫీసు నుంచి బయటపడినా.. రిలాక్స్ అనేదే ఉండదు. వాకింగ్ కు వెళ్లినా, జిమ్ కి వెళ్లినా మనసు మాత్రం పూర్తి చేయాల్సిన పని మీదే. ఇక రాత్రి పదకొండున్నర వరకూ పని చేసి కోడ్ రివ్యూ చేసి లాప్ టాప్ కట్టేసినా.. ఏ కాల్ వస్తుందో అని కలత నిద్ర, తలవద్ద లాప్ టాప్.. ఇలా ఒక రోజు.. రెండు రోజులూ కాదు.. ప్రతిరోజూ అశాంతే, ఆందోళనే, ఖంగారే, టాస్క్ పూర్తవుతుందా? లేదా అన్న ఆందోళనే...  
సీనియర్ టెక్కీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగుల దైనందన జీవిత కష్టాలపై నెటిజనులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. దీనిపై స్పందించి దాదాపు అందరూ.. ఇది అచ్చంగా తమ జీవితమేనంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  ట్రాఫిక్ వల్ల సగం శక్తి, అర్ధంపర్థం లేని మీటింగ్ ల వల్ల మిగిలిన సగం శక్తీ ఆవిరైపోతే.. ఇక అసలు పని ఎప్పటికి పూర్తయ్యేను? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇక పని ఎప్పుడు చేయాలి?" అని ప్రశ్నిస్తున్నారు. నిరంతర ఒత్తిడితో.. ఇసుమంతైనా ప్రశాంతత లేని జీవి ఈ భూ ప్రపంచం మీద ఏదైనా ఉందంటే.. ఆ జీవి కచ్చితంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగే అని నెటిజనులు సైటైర్లు వేస్తున్నారు. 

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఒక కీలక కేసులో సుప్రీంకోర్టు ఓ కీలకమైన తీర్పు వెల్లడించింది.
యూసుఫ్ అఫ్రిది ఎల్ఈటీలో ఫీల్డ్ కమాండర్ మాత్రమే కాదు.. ఆ సంస్థకు ఒక మేధావిగా, సిద్ధాంతకర్తగా కూడా గుర్తింపు పొందాడు. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో ఉగ్రవాదుల నియామకాలు, వారికి ఆయుధ శిక్షణ, స్థానిక నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించేవాడు.
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఈ సమీక్షకు పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సీఎం అధికారులను వివరణ కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అంబర్‌పేట్ చే నంబర్ చౌరస్తా వద్ద సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
సాంకేతిక నిపుణులకు ఆండ్రాయిడ్ అందించే డెవలపర్ ఆప్షన్స్ ఒక అద్భుతమైన వరం. ఐఫోన్‌లో ఇటువంటి నియంత్రణ పొందాలంటే ఎక్స్-కోడ్ వంటి పరికరాల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్‌లో నేరుగా ఫోన్ నుండే యానిమేషన్ వేగాన్ని మార్చుకోవడం.. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ నియంత్రించడం వంటి వాటి ద్వారా ఫోన్ వేగాన్ని పెంచుకోవచ్చు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం ఈసారి ఆసక్తికర సంకేతాలను ఇస్తోంది.
అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనా ప్రకారం, ఒకవేళ ఈ దిగ్బంధనం ఇలాగే కొనసాగితే యూరప్ వద్ద ఉన్న నిల్వలు మరో ఆరు వారాలకు సరిపోవడమే గగనం. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఇంధన భద్రతా సంక్షోభంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారతీయ సంస్కృతిలో మాతృదేవో భవ అనే వాక్యానికి అక్షర రూపం ఇచ్చారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సోదరులు.
ఐటీ వర్సెస్ ఏఐ అనేది ఒక యుద్ధంలా కాకుండా, ఒక పరిణామంలా చూడాలంటారు నిపుణులు. నిజం చెప్పాలంటే.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, కానీ ఉద్యోగాల స్వ‌రూప‌- స్వభావాలు మారిపోతాయంటున్నారు.
తిరుపతి జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఒక ఘటనపై చంద్రబాబు స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలందుకుంటోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అనుచరులు టోల్ ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యానికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినంగా స్పందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.