వైసీపీకి ఉద్యోగుల టిట్ ఫ‌ర్ టాట్‌!.. సోష‌ల్ మీడియాలో బిగ్ ఫైట్‌..

Publish Date:Jan 24, 2022

Advertisement

జీతాలు పెంచామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. పెర‌గ‌లేదు త‌గ్గాయ‌ని ఉద్యోగులు అంటున్నారు. కొత్త‌ పీఆర్సీ వ‌ద్దు.. పాత జీతాలే ఇవ్వ‌మంటూ ఉద్య‌మిస్తున్నారు. మీకు ఇప్పుడిచ్చేదే ఎక్కువ‌.. ఇంకా పెంచే ప్ర‌స‌క్తే లేదంటూ స‌ర్కారు ఎదురుదాడి చేస్తోంది. వైసీపీ గ్రూపుల‌ను ఉసిగొల్పి.. సోష‌ల్ మీడియాలో ఉద్యోగుల ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తోంది. ప్ర‌భుత్వం చెప్పేదంతా అబ‌ద్ద‌మంటూ.. ఏది రియ‌ల్‌? ఏది వైర‌ల్‌? అర్థం అయ్యేలా వివ‌రిస్తూ ఉద్యోగ గ్రూపులు సైతం పోస్టులు పెడుతున్నాయి. వైసీపీ చేస్తున్న‌ ప్ర‌చారం.. అందుకు ఏపీటీఎఫ్ ఇస్తున్న వివ‌రణ ఆస‌క్తిక‌రంగా ఉంది. సోష‌ల్ మీడియాలో టిట్ ఫ‌ర్ టాట్ పోస్టులు తెగ వైర‌ల్ అవుతున్నాయి.

--వైసీపీ వాదన: కొత్త పీఆర్సీలో జీతాల కోత అవాస్తవం. రూ.10వేల కోట్లు అదనంగా ఇస్తున్నాం.
--ఏపీటీఎఫ్ వివ‌ర‌ణ‌: అబద్ధపు ప్రచారం. కొత్త జీతాలు వద్దు. ప్రస్తుత జీతభత్యాల్ని కొనసాగించండి.

--వైసీపీ వాదన: జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో 10 శాతం స్థలాల్ని కేటాయించాం. 20 శాతం రాయితీపై అందిస్తున్నాం.
--ఏపీటీఎఫ్ వివ‌ర‌ణ‌: స్థలాల కేటాయింపు.. రాయితీల్నిఎవరూ అడగలేదు. రాయితీల రూపంలో రూ.10 లక్షల లబ్థి చేకూరుస్తున్నట్లు చెబుతున్నారు. స్థలం ఖరీదు రూ.50 లక్షలా? సగటు ఉద్యోగి కొనగలరా? ఇది సంక్షేమమా? స్థిరాస్తి వ్యాపారమా? ఉద్యోగులు సొసైటీగా ఉండి కోరిన సరసమైన ధరకు స్థలాల కేటాయింపు ఏమైంది?

--వైసీపీ వాదన:  విభజన సమస్యలు.. కొవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గింది.
--ఏపీటీఎఫ్ వివ‌ర‌ణ‌: విభజన సమస్యలు ఉన్న కాలంలో అంటే 2015లో 43 శాతం ఫిట్ మెంట్ పొందాం. ప్రస్తుతం విభజన సమస్యలన్నీ సర్దుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం పెరిగిందని కాగ్ గణాంకాలే చెబుతున్నాయి. జీతభత్యాలు తగ్గించి.. ఐఆర్ రూపంలో ఇచ్చిన దాన్ని డీఏల నుంచి రికవరీ చేస్తున్నారు. 

--వైసీపీ వాదన: దేశంలో ఎక్కడా లేని రీతిలో రిటైర్మెంట్ వయసును 60నుంచి 62కు పెంచాం.
--ఏపీటీఎఫ్ వివ‌ర‌ణ‌: లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ.. ఉపాధ్యాయ.. కార్మికులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.

--వైసీపీ వాదన: విలీనంతో ఆర్టీసీ ఉద్యోగాలు మెరుగుపడ్డాయి.
--ఏపీటీఎఫ్ వివ‌ర‌ణ‌: కార్పొరేషన్ ఉద్యోగులు కాస్తా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత పెనం మీద నుంచి పొయ్యి మీద పడినట్లైంది. ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న హక్కులు.. రాయితీలు వారు పొందుతున్నారా? కార్పొరేషన్ లో ఉన్న పరిస్థితి కంటే ప్రస్తుతం వారి జీవితాలు ఎలా మెరుగుపడ్డాయో వివరిస్తారా?

--వైపీపీ వాదన: గ్రాట్యూటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాం.
--ఏపీటీఎఫ్ వివ‌ర‌ణ‌: పెంచాల్సింది రూ.20 లక్షలు. సవరించిన వేతనాలతో ప్రతి ఉద్యోగి రూ.2-4 లక్షలు పోగొట్టుకుంటున్నారు. 

--వైసీపీ వాదన:  ఉద్యోగులను సంఘాల నాయకులు పెడదోవ పట్టించారు
--ఏపీటీఎఫ్ వివ‌ర‌ణ‌: కలెక్టరేట్ల దిగ్భంధంలో నాయకత్వాన్ని అరెస్టు చేసినా.. లక్షల మంది ఎవరికి వారుగా పోరాటంలోకి వచ్చారు. నాయకుల నుంచి ఉద్యోగులను విడదీయాల‌నేదే మీ ఎత్తుగడ. 

--వైసీపీ వాదన: నాయకుల మాటలు విని ఆందోళన చేస్తే దెబ్బ తినేది ఉద్యోగులే.
--ఏపీటీఎఫ్ వివ‌ర‌ణ‌: కొత్త పీఆర్సీతో ఉన్న హక్కులను కోల్పోయేలా చేశారు. కొత్తగా దెబ్బ తినేది ఏమీ లేదు.

By
en-us Political News

  
ఎవరు ఎంత అధికారంలో అయినా వుండవచ్చు... మా మాటకు ఎదురు లేదు.. మేం చేసిన దానికి తిరుగులేదు అనే ధీమాలో వుంటే వుండొచ్చు..
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ వారం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని చూస్తున్న అధికారుల జాబితాను రెడీ చేసుకున్న ఈసీ ఆ జాబితాలో ఒక్కొక్క‌రి పై బదిలీ వేటు వేస్తూ వ‌స్తున్న. ఇప్ప‌టికే ప‌లువురు అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసిన ఈసీ.. ఆదివారం (మే6) రాష్ట్ర డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై బ‌దిలీ వేటు వేసింది.
 ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిలో నూతన డిజిపి నియామకమయ్యారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది. 
ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది.
‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్‌ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు.
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇక్క‌డ జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌ల‌లో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
వైసీపీ నాయకుడు జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని,
మామూలు ఓట్లతో మెజారిటీలు సాధిస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కించినా నామమాత్రం అవుతుంది. కానీ ఈసారి నెక్ టూ నెక్ గా ఏపీలో పోరాటం ఉంది. వంద, యాభై, పాతిక, పదీ ఓట్ల తేడాతో కూడా అభ్యర్ధుల గెలుపు ఉండనుంది. దాంతో అపుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే డిసైండ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత పెరిగింది.
మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ ఇచ్చిన మాటకు పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వరన్న సంగతి ఈ ఐదేళ్ల కాలంలో పదే పదే రుజువైంది. మాట ఇవ్వడం మడమ తప్పటం అన్నది జగన్ నైజంగా జనం భావించే పరిస్థితికి వచ్చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.