అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు.. అనుమానితుడి అరెస్టు

Publish Date:Mar 26, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి  వరుస అగ్నిప్రమాదాలకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా పలు అనుమానాలు కూడా వ్యక్తమౌతున్న నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక పురోగతి సాధించారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించి , రాయపూడి పరిధిలోని జరిగిన అగ్నిప్రమాద  ఘటనతో సంబంధం ఉందనే అనుమానంతో రామకుమార్ అనే వాచ్‌మెన్‌ను పోలీసులు గురువారం (మార్చి 26)  అదుపులోకి తీసుకున్నారు. గత సోమవారం రాత్రి సుమారు   రాజధాని ప్రాంతంలోని ప్రిన్సిపల్ కార్యదర్శుల బంగళాల  సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

ఈ అగ్నిప్రమాదం  అమరావతి నిర్మాణ పనులు చేస్తున్న  మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన పైపులు నిల్వ ఉంచిన చోట  సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు, కంపెనీ సిబ్బంది  పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మూడు ఫైర్ టెండర్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా అగ్నిప్రమాదం సంభవించడానికి అవకాశం లేని మైదాన ప్రాంతంలో మంటలు ఎగసిపడటంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

 అమరావతి  అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్న తరుణంలో  వరుస అగ్నిప్రమాదాల వెనుక   కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించి  ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్  ఏర్పాటు చేశారు. సిట్ రంగంలోకి దిగిన గంటల వ్యవధిలోనే ఈ అగ్రిప్రమాదాలకు సంబంధించి ఒక అనుమానితుడిని అదుపులోనికి తీసుకుంది.  అతడిని సిట్ విచారిస్తున్నది.  అమరావతి నిర్మాణ పనులకు ఆటంకం కలిగేలా వరుస అగ్ని ప్రమాదాలపై రాజధాని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా సిట్ విచారణలో అగ్నిప్రమాదాలకు అసలు కారణాలు వెలుగులోకి వస్తాయని భావిస్తు న్నారు.    

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగం పెంచింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి తమ ప్రతాపం చూపించారు.
ఇటీవల కాలంలో సమాజంలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో, అంతే వేగంగా చిన్న చిన్న కారణాలకే విడాకుల దాకా వెళ్తున్నాయి.
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఒక సాదాసీదా ఆర్టీసీ బస్సు డ్రైవర్ అన్న మాటలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ముగింపు దశకు చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిచెందిన నాగరాజు అనే వ్యక్తి ఆ ఫోన్ చేశాడు. నిరంజన్ అనే తన కుమారుడు కర్నూలులోని జయరాజ్ స్టీల్స్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురై కాచిగూడ రైల్వే స్టేషన్ రైలు పట్టాలపై ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని, ఆ విషయం తెలియజేస్తూ.. తనకు వీడియో పంపాడని తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికొత్త జవాబుదారీతనానికి నాంది పలుకుతూ ఆయన నన్ను ప్రశ్నించండి అనే వినూత్న కార్యక్రమానికి నాంది పలికారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పౌరుడికీ, ముఖ్యంగా యువతకు తమ నాయకుడిని నేరుగా నిలదీసే హక్కును కల్పించారు. ప్రజాప్రతినిధికి ఓటేసి గెలిపించిన ప్రజలకు తమ సమస్యలపై, నియోజకవర్గ ప్రగతిపై ప్రశ్నించే పూర్తి హక్కు ఉందని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.
డిసెంబర్‌లోనే కిషన్‌సింగ్ అలియాస్ పప్పుకు సుపారీ అప్పగించినట్లు అనుమానిస్తున్న పోలీసులు… ఈ హత్యను ప్రమాదంలా చూపించేందుకు ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఈ ముఠా కారు స్టంట్స్‌లో దీటైన అభిజిత్‌ను రంగంలోకి దింపారు.
ఈ మ్యాచ్‌లో లీగ్ దశ ముగిసే సరికి పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రెండో స్థానంలో గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ధర్మశాల వేదికగా ఈ హై-వోల్టేజ్ పోరు జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు అత్యంత ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.
జయమ్మ, సోమయ్య దంపతులు ప్రతిరోజూ ఇతర కూలీలతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే సోమయ్యకు 60 ఏళ్లు నిండడంతో, తమతో పాటు ప్రతిరోజూ చెమటోడ్చి పని చేసే తోటి కూలీల సమక్షంలోనే ఈ వేడుకను జరుపుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్ బహదూర్‌పురాలో బ్యాటరీ వ్యాపారం నిర్వహిస్తున్న రాకేష్ వర్మకు ముంబైకి చెందిన మజార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ పరిచయంతోనే గత డిసెంబర్‌లో మజార్ వద్ద నుంచి కోకైన్ కొనుగోలు చేసినట్లు రాకేష్ వర్మ సిట్‌కు తెలిపినట్టు సమాచారం.
దాదాపు 11 గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో హీరా గ్రూప్‌కు చెందిన ఆస్తుల విక్రయాలు, అనుమతులు, అధికారిక నిర్ణయాలపై వివరణలు కోరినట్లు సమాచారం. హీరా గ్రూప్‌పై మనీలాండరింగ్‌, పెట్టుబడిదారుల మోసం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఇప్పటికే పలు ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ అటాచ్‌ చేసిన ఆస్తులను విక్రయించేందుకు అనుమతులు ఇచ్చే ప్రక్రియలో అమోయ్ కుమార్ సహకరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ పరిధిలో అమెరికా నౌకాదళ ఆస్తులపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ దాడులు పరిమిత సైనిక చర్య మాత్రమేనని, పూర్తి స్థాయి యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించడం తమ ఉద్దేశం కాదని అమెరికా సీనియర్ అధికారులు పేర్కొన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భీతావహంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.