దళిత సోదరుడు సింగయ్యది జగన్ చేసిన హత్యే : సోమిరెడ్డి

Publish Date:Jun 25, 2025

Advertisement

 

దళిత సోదరుడు సింగయ్యను హత్య చేసింది మాజీ సీఎం జగనేని టీడీపీ నేత మాజీ మంత్రి,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎటువంటి అనుమతులు లేకుండా 9 గంటలు వేల మందితో ర్యాలీ చేశారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ హచయాంలో దళితులు చనిపోతే కనీసం పట్టించుకోలేదని తెలిపారు. సింగయ్య మృతిని జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు.వైఎస్సార్ పేరు తీసేసి రప్ప...రప్ప పార్టీ అని పెట్టుకో పార్టీ అని పెట్టుకోవాలని సూచించారు.  ర్యాలీలో కాన్వాయ్ కింద పడితే తొక్కేసి వెళ్లిపోయారని విమర్శించారు. 

కనీసం దిగి బాధితుడిని ఆస్పత్రికి కూడా తరలించలేదని, సింగయ్యది ముమ్మాటికీ హత్యని సోమిరెడ్డి ఆరోపించారు.తీవ్రంగా గాయపడిన సింగయ్యను ముళ్లకంపల్లో పడేసి వెళ్ళిపోతారా.. అంటూ జగన్‌పై సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ లాంటి వారి వల్ల దళితులు, గిరిజనుల ప్రాణాలకు హానీ కలుగుతోందన్నారు. ఈ దేశ చరిత్రలో రూ. 43 వేల‌ కోట్ల కుంభకోణంలో జగన్ నిందితుడని సోమిరెడ్డి అన్నారు. జగన్ పర్యటనలో 679 మంది పోలీసులను పెడితే ఇంకా బందోబస్తు సరిపోలేదని విమర్శలు చేస్తున్నారని, 90 కిలోమీటర్ల రోప్ పార్టీని పెట్టాలా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. 

జగన్‌కు సిగ్గూ శరం ఉండాలన్నారు. జగన్ కోసం వచ్చిన అభిమానిని నిలువునా ప్రాణాలు తీశారని దుయ్యబట్టారు. ఆయన కారులో ఉన్న పెద్దరెడ్డి కారు కింద పడితే అలాగే వదిలేసి వెళుతారా అని ప్రశ్నించారు. జగన్ పర్యటనలో ముగ్గురు చనిపోయారని, జగన్ తీసుకున్న అనుమతి ఒకటి.. చేసింది మరొకటని విమర్శించారు. గత వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, ఒక ముఖ్యమంత్రి అనుకుంటే ఎంత అవినీతి చేయోచ్చో.. ఏపీ లిక్కర్ స్కామ్ చూస్తే అర్థమవుతోందని సోమిరెడ్డి తెలిపారు.

By
en-us Political News

  
రాష్ట్రీయ సయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్.. ఇంచుమించుగా వారం రోజుల కిందట ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జూలై 9న ప్రధానమంత్రి రిటైర్మెంట్ గురించి, సూచన ప్రాయంగా చేసిన వ్యాఖ్య రాజకీయ సంచలనంగా మారింది.
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్.. అన్నారు చిలకమర్తి వారు. ప్రసన్నయాదవం పద్యకావ్యంలో... నాలుగు పాదాల చంపకమాల పద్యంలో ఇది నాలుగో పాదం. తెలుగు భాషఫై కొద్దిపాటి మక్కువ, కొంచెంగా ప్రవేశం ఉన్న ఎవరికైనా ఈ పద్య పాదం తరచూ గుర్తుకు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా.. డ్రైవర్ సంధ్యారాణి వంటి వారి కథలు విన్నపుడు చిలకమర్తి వారి పద్యం చటుక్కున వచ్చి నాలుక పై వాలుతుంది.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. లైఫ్‌ అండ్‌ లెగసీ ఆఫ్‌ పీవీ అంశంపై సీఎం ఢిల్లీలో ప్రసంగించిన చంద్రబాబు . అనేక పార్టీలను ఒప్పించి పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చారన్నారు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ చెత్త రికార్డ్ నమోదు చేసింది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో విండీస్ రెండో అత్యల్ప స్కోరు చేస్తే... ఆస్ట్రేలియా టీమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది
లాస్‌ ఏంజెలెస్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు కూడా చోటు దక్కింది. చివరిసారిగా 1900 ఒలింపిక్స్‌లో మాత్రమే క్రికెట్ ఆడారు. ఈ క్రీడా సంరంభంలో భాగంగా 2028 జులై 12 నుంచి క్రికెట్ మ్యాచులు మొదలు అవుతాయి.
ఆశలన్నీ ఆవిరై పోయిన సందర్భంలో.. కేరళ నర్స్‌ నిమిష ప్రియకు ఊరట లభిచింది. మరో కొన్ని గంటల్లో ఉరి కంబం ఎక్కవలసిన ఆమెకు, యెమెన్‌ ప్రభుత్వం ఉరి శిక్షను వాయిదా వేసి, మరో ఆశకు ప్రాణం పోసింది.
తెలంగాణలో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి సంవత్సరన్నరపైగా అవుతుండటం, పరిషత్‌ల గడువు ముగిసి సంవత్సరం పూర్తవుతుండటంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండి, నిధులు రాక అభివృద్ధి కుంటుపడింది.
వైసీపీ సీనియర్ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.
వైయస్సార్ కడప జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో దారుణం జరిగింది.ఇక్కడ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. హత్య గురైన బాలిక మృతదేహం ముళ్ళపొదల్లో నగ్నంగా పడి ఉండడం చూస్తే హంతకుడు హత్యాచారానికి పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బాలీవుడ్ నటుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ దత్ ముంబై పేళ్లలకు సంబంధించి మరోసారి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సంజయ్‌దత్ తలుచుకుని ఉంటే ముంబై పేలుళ్లను ఆపి ఉండేవారని ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుమల దేవుడి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ కేసులో సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ కల్తి వ్యవహారంలో వాస్తవాలను వెలికి తీయడం లక్ష్యంగా సుప్రీం కోర్టు గత ఏడాది అక్టోబర్ లో స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి విదితమే.
తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సొంత ఇంట్లో అడుగుపెట్టే భాగ్యం ఇప్పట్లో లేనట్లు కనిపిస్తోంది. ఆయన ఎప్పుడు తాడిపత్రి బయలుదేరినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతోంది.
బనకచర్ల ప్రాజెక్టు పై చర్చించడానికి తెలంగాణ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. ఏపీ ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం బుధవారం జరగ నుంది. ఈ సమావేశంలో బనకచర్లపై విస్తృతంగా చర్చించాలన్నది ఏపీ ప్రతిపాదన.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.