చిక్కుల్లో సిద్దు కాంగ్రెస్’లో కలవరం

Publish Date:Jun 18, 2022

Advertisement

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్దరామయ్య నోరు జారారు. అది కూడా ఒక అధికార పార్టీ  దళిత ఎమ్మెల్సీ మీద నోరు జారారు. నోరు జారడం అంటే ఎదో ఒక మాటనడం కాదు ... దళిత ఎమ్మెల్సీని చలవాది నారాయణస్వామిని కులం పేరుతో దూషించారు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. పోలీసు కేసు పెట్టారు. సిద్దరామయ్య తనను కులం పేరుతో దూషించాడని, చలవాది నారాయణస్వామి మాజే మఖ్యమంత్రి పై ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు పెట్టారు.

పోలీసులు కేసు నమోడు చేసారు. ఇటీవలే బీజేపీ టికెట్ పై ఎమ్మెల్సీ గా గెలిచిన చలవాది నారాయణస్వామి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పడ బీజేపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇలా ఎమ్మెల్సీ అయిన వెంటనే సిద్దరామయ్య పై  ఏకంగా ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు పెట్టడం, రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది. బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో అయన కేసు ఫైల్ చేసారు. అదలా ఉంటే చలవాది నారాయణస్వామి, మాజీ ముఖ్యమంత్రి గత గత చరిత్రను కూడా ఏకరువు పెట్టారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల నుంచి సిద్దరామయ్యకు దళితులంటే చిన్న చూపేనని, ఆయన ఎప్పుడు దళితులకు విలువ ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొనారు.

అలాగే, కేసు నమోదు చేసిన సందర్భంగా మీడియాతో మాటలాడిన ఎమ్మెల్సీ నారాయణస్వామి తనను కులం పేరుతొ దూషించడమే కాకుండా, దళితజాతి మొత్తాన్ని అవమానించారని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు.అందుకే, యన పై తనకు వ్యక్తిగతంగా గౌరవం ఉన్నా, కేసు పెట్టవలసి వచ్చిందని నారాయణస్వామి అన్నారు. సిద్దరామయ్యను అరెస్టు చెయ్యడంలో పోలీసులు ఆలస్యం చేస్తే తాను నిరాహారదీక్షకు దిగి ధర్నా చేస్తానని ఎమ్మెల్సీ హెచ్చరించారు. 

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి, దళితురాలు మోటమ్మకూడా తన ఎదుగుదలకు మాజీ సీఎం సిద్దరామయ్య అడ్డుపడ్డారని ఆమె ఆత్మకథలో రాశారని, మోటమ్మ విషయంలో, నా విషయంలో సిద్దరామయ్య తీరు గమనిస్తే ఆయన దళితులకు మర్యాద ఇవ్వరని అర్థం అవుతోందని చలవాది అన్నారు. మొత్తం మీద మాజీ సీఎం మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడం ఇప్పుడు కర్ణాటకలో, కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి పై ఇలాంటి ఆరోపణలు రావడం,, పార్టీకి నష్టం కలగ చేస్తుందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్త పరుస్తున్నాయి.

By
en-us Political News

  
ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు.
తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.
కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి వ‌చ్చిన ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.
రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే.
తెలంగాణ‌లో కమలం పార్టీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది? రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌ అన్న‌దొక చ‌ర్చ‌.
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు.
అప్పట్లో అధికారపార్టీలో ఉన్న అనంతబాబుతో అధికారంలో ఉన్న వై ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైసీపీ సభ్యులు వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.