Publish Date:Oct 24, 2020
బీహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో తీవ్ర దుమారం రేపుతోంది. మరీ ముఖ్యంగా ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే బీహార్ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామన్న బీజేపీ హామీపై ఇపుడు దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీజేపీ ఒకప్పటి మిత్రపక్షమైన శివసేన తన అధికార పత్రిక సామ్నా వేదికగా ఈ హామీని తీవ్రంగా తప్పు పట్టింది. "ప్రాణాంతకమైన కరోనా వైరస్ ను ఎదుర్కునే వ్యాక్సిన్ పై బీజేపీ రాజకీయాలు చేస్తోంది. బీహార్ కు కరోనా వ్యాక్సిన్ అందాలి. కానీ మిగిలిన రాష్ట్రాలేమైనా పాకిస్తాన్ లో ఉన్నాయా? వ్యాక్సిన్ పై దేశంలోని అన్ని రాష్ట్రాలకూ సమాన హక్కులున్నాయి." అని సామ్నాలో తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
కరోనా తో మొత్తం దేశం తీవ్రంగా బాధపడుతోందని, అయితే కేవలం బిహార్ మాత్రమే కోవిడ్ తో బాధపడటం లేదని అలాంటి పరిస్థితిలో వ్యాక్సిన్ రాజకీయాలు చేయడం ఏంటని బీజేపీ పై శివసేన తీవ్రంగా విమర్శించింది. ఇటువంటి పరిస్థితుల్లో జాతి, కుల, మత, ప్రాంత భేదాల్లేకుండా అందరికీ కరోనా వ్యాక్సిన్ అందేలా చూస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని, కానీ బీజేపీ మాత్రం బీహార్ ఎన్నికల సందర్భంగా రాజకీయం చేస్తోందని శివసేన తప్పు పట్టింది. అసలు ఈ విషయంలో బీజేపీని ఎవరు గైడ్ చేస్తున్నారో తమకు తెలియదని, బీజేపీ నాయకత్వంలో ఏం లోపముందో కూడా తమకు తెలియదని విమర్శించింది.
అంతేకాకుండా బీహార్ ఎన్నికలలో వివిధ పార్టీల నేతలు కోవిడ్ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదని, ప్రచార సమయంలో కనీసం భౌతిక దూరాన్ని పాటించడం లేదని శివసేన మండిపడింది. "కరోనా మహమ్మారి వ్యాపిస్స్తున్న సమయంలో దేశంలో బిహార్ ఎన్నికలే మొట్టమొదటివి. దీంతో అన్ని ర్యాలీలు వర్చువల్ ర్యాలీలుగా ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే పార్టీలు ఆ విషయాల్నే మరిచిపోయినట్లున్నాయి. అసలు భౌతిక దూరం అనేది ఏమాత్రం లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొందరు ముఖ్య నేతలు హెలికాప్టర్ల సహాయంతో వివిధ ప్రాంతాలకు వెళ్లి, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బహుశా బిహార్ లో ప్రస్తుతానికి కరోనా వైరస్ లాంటిదేమీ లేదు కాబోలు." అంటూ సామ్నా వేదికగా శివసేన సెటైర్లు వేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shiv-sena-fires-on-bjp-over-free-corona-vaccine-promise-25-105516.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.