ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. అన్నను టార్గెట్ చేసిన షర్మిల

Publish Date:Jun 18, 2025

Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. మళ్లీ, మళ్లీ విచారణకు పిలుస్తున్నారు. గంటలకొద్దీ ఎంక్వైరీ చేస్తూ.. ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రణీత్ రావుని కూడా సిట్ విచారిస్తోంది. ఆధారాల ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ కోసం ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు సహా వందలాది మంది ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నవంబర్ 15న ఒక్కరోజే 600 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ట్యాపింగ్‌కు ప్రభాకర్ రావు ఆదేశాలిచ్చారని.. ఆయన డైరెక్షన్‌లోనే ఇదంతా జరిగిందని.. ఇప్పటికే అరెస్ట్ అయిన మిగతా నిందితులు తెలిపారు. మావోయిస్టు సానుభూతిపరుల పేర్ల మీద ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. రివ్యూ కమిటీకి కూడా మావోయిస్టుల పేర్లతోనే నెంబర్లు సమర్పించినట్లు తేలింది. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై నిఘా పెట్టి.. పోలీసులతో దాడులు చేయించినట్లు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగ్ ఓ కారణమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఆరోపించడం.. రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.

2023 ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.. ఎస్ఐబీ ఆఫీసు నుంచి కీలకమైన హార్డ్ డిస్క్‌లు మాయమయ్యాయి. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు.. ప్రణీత్ రావు వాటిని ధ్వంసం చేసి.. మూసీ నదిలో పారేసినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ.. సిట్ అధికారులు కొంత డేటాని సంపాదించారు.  దాంతో.. తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించిన వారితో పాటు సాక్ష్యులను, బాధితులను పిలిచి.. వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. 

ఇలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది.. ముమ్మాటికి నిజమన్నారు. ఇది.. తెలంగాణ, ఏపీ సీఎంల జాయింట్ ఆపరేషన్ అని ఆరోపించారు. కేసీఆర్, జగన్.. ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండేవారని.. వాళ్ల సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయిందని షర్మిల విమర్శించారు. తన ఫోన్ ట్యాప్ అయ్యిందని.. వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారని, తన ఫోన్ ట్యాప్ చేసిన ఆడియోని తనకు వినిపించారన్నారు. ఈ కేసులో.. ఎలాంటి విచారణకైనా వస్తానన్నారు వైఎస్ షర్మిల.

మరోవైపు.. సిట్ అధికారులు ప్రభాకర్ రావును వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా.. 300 అజ్ఞాత ప్రొఫైల్స్, ఇతర కీలక వ్యక్తుల ఫోన్ల ట్యాపింగ్‌పైనే ప్రశ్నిస్తున్నారు. కేసుని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు.. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును.. సిట్ పదే పదే ప్రశ్నిస్తోంది. ఈ విచారణలో మరిన్ని కీలక వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది.

By
en-us Political News

  
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
అసెంబ్లీ సాక్షిగా నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.
స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా? అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.