జగన్ నీకు క్యారెక్టర్ ఉందా?.. సూటిగా నిలదీసిన షర్మిల!

Publish Date:Feb 7, 2025

Advertisement

ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయానా సోదరి అయిన షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న జగన్ మోహన్ రెడ్డికి ఇతరుల క్యారెక్టర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదని కుండబద్దలు కొట్టారు. 

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో ఓటమి తరువాత నుంచీ వైసీపీకి గడ్డు కాలం దాపురించినట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా నాయకులు బయటకు వెళ్లిపోతున్నారు. అలా వెళ్లి పోతున్నవారిలో జగన్ కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన వారూ ఉంటున్నారు. కొద్ది రోజుల కిందటే వైసీపీలో కీలక నేత, జగన్ కుటుంబానికి సన్నిహితుడు, జగన్ అక్రమ కేసులలో సహ నిందితుడు అయిన విజయసాయిరెడ్డి పార్టీకి దూరమయ్యారు. పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. ఇక నుంచీ తాను రాజకీయాల జోలికి పోనని ప్రకటించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ పట్ల తన స్వామి భక్తిని ప్రదర్శించారు. తనకు అవకాశాలిచ్చినందుకు ఆయనకు కృతజ్ణతలు తెలిపారు. ఇక నుంచి వ్యవసాయమే తన వ్యాపకం అని చెప్పిన విజయసాయిరెడ్డి అన్నట్లుగానే తాను సాగు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపే ఫొటోలను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. అక్కడితో రాజకీయాలలో, వైసీపీలో విజయసాయి రెడ్డి పాత్రకు ఎండ్ కార్డ్ పడిపోయిందనే అంతా భావించారు. 

అయితే జగన్ విదేశీ పర్యటన ముగించుకు వచ్చిన కొన్ని రోజుల తరువాత తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ రెడ్డి రాజీనామాపై స్పందించారు.  అన్ని అవకాశాలూ ఇచ్చిన పార్టీని కాదని బయటకు వెళ్లపోవడం సరికాదన్నట్లుగా మాట్లాడారు. రాజకీయాలలో ఎవరికైనా సరే క్యారెక్టర్ ముఖ్యమని అనడం ద్వారా   విజయసాయిరెడ్డికి క్యారెక్టర్ లేదని చెప్పకనే చెప్పారు. 
దీనిపై విజయసాయి కూడా ఘాటుగా స్పందించారు. తనకు క్యారెక్టర్ లేదని జగన్ అనడాన్ని తప్పుపట్టారు. క్యారెక్టర్ ఉంది కనుకనే పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులు కున్నానని చెప్పుకొచ్చారు.  తన క్యారెక్టర్ గురించి జగన్ మాటలు పూర్తి అవాస్తవాలు అన్నదే విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా చేసిన పోస్టు సారాంశం. విజయ సాయి రెడ్డి తరువాత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన మోపిదేవి వెంకటరమణ కూడా జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ కు క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు విమర్శలు ఉన్నాయి. జగన్ అక్రమ ఆస్తుల కేసులో తాను జైలుకు వెళ్లిన సంగతిని గుర్తు చేస్తూ నిజంగా తనకు క్యారెక్టర్ లేకపోతే జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కుని ఉండేవాడినే కాదని చెప్పుకొచ్చారు.

వీరిద్దరి  కౌంటర్ ను తలదన్నేలా ఇప్పడు షర్మిల మీడియా ముందుకు వచ్చి జగన్ క్యారెక్టర్ పై సంచలన విషయాలను వెల్లడించారు.  జగన్ వ్యక్తిత్వం, విశ్వసనీయత గురించి మాట్లాడటం అతి పెద్ద జోక్ గా షర్మిల అభివర్ణించారు.  తోబుట్టువునైన తనపైనా, తన వ్యక్తిత్వంపైనా జగన్ నీచాతినీచంగా బురద జల్లారని షర్మిల ఆరోపించారు. విజయసాయి వైసీపీకి రాజీనామా చేసిన తరువాత తనతో భేటీ అయ్యారని చెప్పిన షర్మిల ఆ సందర్భంగా ఆయన చాలా చాలా విషయాలు చెప్పారని పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా విజయసాయి గతంలో మీడియా సమావేశంలో మాట్లాడడానికి కారణం జగన్ ఒత్తిడేనని విజయసాయి తనతో చెప్పారనీ, షేర్ల విషయంలో జగన్ చెబుతున్నదంతా అవాస్తవమని తన తల్లి విజయమ్మ లేఖ రాయడంతో మరో సారి మీడియా సమావేశం పెట్టి విజయమ్మలేఖను ఖండించాల్సిందిగా జగన్ విజయసాయిపై ఒత్తిడి తెచ్చారనీ, ఆయన వినకపోవడంతో సుబ్బారెడ్డితో మీడియా సమావేశంలో మాట్లాడించారనీ షర్మిల తెలిపారు. ఈ విషయాలన్నీ విజయసాయి స్వయంగా తనతో చెప్పారని షర్మిల వెల్లడించారు. ఇంత నీచానికి ఒడిగట్టిన జగన్ క్యారెక్టర్ గురించి మాట్లాడటమేంటని ఆమె ఎద్దేవా చేశారు. జగన్ కు క్యారెక్టర్ అంటే అర్ధం తెలియదని దుయ్యబట్టారు.  

మేనకోడలు, మేనల్లుడి ఆస్తులు కాజేయాలని కుట్రలు చేసిన వ్యక్తి జగన్ అని షర్మిల విమర్శలు గుప్పించారు.   జగన్, ఆయన భార్య భారతి బైబిల్ ముందు పెట్టుకుని వారి క్యారెక్టర్ ఏంటో, ఎంత దిగజారిపోయారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. 

By
en-us Political News

  
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.