షర్మిల నోటికి ఎవరయినా లోకువే

Publish Date:Sep 10, 2013

Advertisement

 

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పాద యాత్రలు, బస్సుయాత్రలు చేస్తున్నషర్మిల కనీసం ఇంతవరకు ఆ పార్టీ సభ్యత్వమయినా తీసుకొన్నారో లేదో తెలియదు. ఆమె పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి అనే ఏకైక అర్హతతో పార్టీ తరపున పనిచేస్తున్నారు. ఆమె చిరకాలం రాజకీయాలలో ఉండబోదని స్వయంగా ఆమె భర్త అనిల్ కుమార్ ఇటీవలే మీడియాతో అన్నారు. అయినప్పటికీ ఆమె వైకాపా తరపున ప్రజలకు చాలా వాగ్దానాలు, హామీలు గుప్పిస్తూనే ఉన్నారు. పార్టీలో ఏ హోదా లేకపోయినా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన చప్రాసీ దగ్గర నుండి ప్రధాని మంత్రి దాకా ఎవరినీ విడిచిపెట్టకుండా తీవ్ర విమర్శలు చేస్తూన్నారు. అదేవిధంగా తెదేపా, తెరాస తదితర రాజకీయ పార్టీల నేతలు తన నోటి ముందు బలాదూర్ అన్న రీతిగా తన వయసుకు, పార్టీలో హోదాకు(?) మించి మాట్లాడుతున్నారు.

 

ఆమె ఇంత వరకు కనీసం ఒక కార్పొరేటర్ వంటి చిన్న పదవిలో కూడా పనిచేసిన అనుభవం లేదు. రాష్ట్రాన్ని,దేశాన్నినడిపించడంలోఉండే కష్ట సుఖాలు ఆమెకు తెలియకపోయినా ముఖ్యమంత్రి దగ్గర నుండి ప్రధాని వరకు అందరూ కూడా ఆమెకు లోకువే. ఈ రోజు ఆమె ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేయాల్సిందంతా చేసి, ఇప్పుడు ఏమి తెలియనట్లు దిష్టి బొమ్మలా కూర్చోన్నారని, ఆయన నిజంగానే రాష్ట్ర సమైక్యత కోరుకుంటున్నట్లయితే వెంటనే రాజీనామా చేసి ఉండాల్సిందని అన్నారు.

 

వైకాపాలో కనీసం కార్యకర్తకూడా కాని ఆమె యావత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కీలక భాద్యతలు నిర్వహిస్తున్నవ్యక్తిని పట్టుకొని దిష్టిబొమ్మ అనడం, రాజీనామా చేయమనడం చాల అనుచితం. ఆయన ఆ పదవిలో కొనసాగాలో వద్దో చెప్పడానికి కూడా ఆమెకు తగిన అర్హత, రాజకీయానుభవం లేవు. రాజకీయాలంటే కేవలం నోరు పారేసుకోవడం కాదనే సంగతి ఆమె తెలుసుకోవలసి ఉంది. తనకంటే వయసులో, రాజకీయాలలో అన్ని విషయాలలో ఎంతో అనుభవం కలిగిన వారి పట్ల ఆమె మాట్లాడుతున్నతీరు చాలా ఆక్షేపనీయంగా ఉంది.

 

కనీసం వారి అనుభవంత వయసు కూడా లేని ఆమె చిన్నాపెద్దా చూడకుండా నోటికి వచ్చినట్లు తూలనాడుతూ, దానినే రాజకీయాలనే భ్రమలో ముందుకు సాగుతోంది. సమైక్యాంధ్ర కోసం బస్సు యాత్ర మొదలుపెట్టిన ఆమె, కేవలం అందుకు సంబందించిన మాటలు మాట్లాడితే ఎవరయినా హర్షిస్తారు. లేదా ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించావచ్చో చెప్పినా ప్రజలు హర్షిస్తారు. లేకుంటే ప్రజలను తమ పార్టీకే ఓటేసి గెలిపించమని నేరుగా కోరినా అర్ధం ఉంది. కానీ, ప్రజలను ఆకట్టుకోవడం కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడటాన్ని మాత్రం ఎవరూ హర్షించరు.

By
en-us Political News

  
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.