వైఎస్ జగన్ అక్రమాస్తులపై సీబీఐ మరో మూడు చార్జ్ షీట్లు

Publish Date:Sep 10, 2013

Advertisement

 

జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులలో విచారణ ముగించేందుకు సుప్రీంకోర్టు సీబీఐకి ఇచ్చిన నాలుగు నెలల గడువు మొన్న 8వ తేదీతో ముగిసింది. అందువల్ల సీబీఐ తన విచారణ పూర్తి చేసి తుది చార్జ్ షీట్ దాఖలు చేస్తుందని అందరూ ఆశిస్తుంటే, సీబీఐ అందరినీ ఆశ్చర్యపరుస్తూ మంగళవారం నాడు మరో మూడు కొత్త చార్జ్ షీట్స్ దాఖలు చేసింది. దీనితో సీబీఐ ఇంత వరకు మొత్తం 8 చార్జ్ షీట్లు దాఖలు చేసినట్లయింది. త్వరలో మరో రెండు దాఖలు చేస్తామని సీబీఐ కోర్టుకు తెలియజేసింది.

 

ఇక సీబీఐ ఈ రోజు పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్ మరియు భారతి సిమెంట్స్ పై వేర్వేరుగా దాఖలుచేసిన మూడు చార్జ్ షీట్లలో కూడా జగన్మోహన్ రెడ్డి ని ఏ1 నిందితుడిగా పేర్కొంది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఈ మూడు సిమెంట్ కంపెనీలకు కాగ్నానదీ జలాలను విరివిగా వాడుకోవడానికి అనుమతులు, అదేవిధంగా వివద జిల్లాలలో సున్నపురాయి గనులు, వాటిని తవ్వుకోవడానికి అనుమతులు మంజూరు చేసినందుకు ప్రతిగా, ఈ మూడు కంపెనీలు జగన్మోహన్ రెడ్డి కి చెందిన జగతి పబ్లికేషన్స్ మరియు కార్మెల్ ఏసియా కంపెనీలలో వందల కోట్ల రూపాయలు పెట్టుబడులను పెట్టడం లంచంమే అవుతుందని ఆరోపిస్తోంది.

 

ఇక ఈ రోజు సీబీఐ వేసిన చార్జ్ షీట్లలో భారీ నీటి పారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్యకి, మాజీ గనుల శాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి సీబీఐ ఉచ్చుబిగిస్తుందని మీడియాలో వస్తున్న ఊహాగానాలకు విరుద్దంగా వారిద్దరి పేర్లను చార్జ్ షీట్ల నుండి మినహాయించడం వారిరువురికీ చాలా ఉపశమనం కలిగించింది.

 

ఇక సీబీఐ తన విచారణ పూర్తి చేసినా చేయకున్నా జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో బెయిలుకి దరఖాస్తు చేసుకోవచ్చునని నాలుగు నెలల క్రితమే సుప్రీంకోర్టు చెప్పినందున అతను త్వరలో బెయిలుకు దరఖాస్తుకు చేసుకోవచ్చును. మూడు రోజుల క్రితమే కోర్టు ఆయన రిమాండ్ ఈ నెల 20వరకు పొడిగించింది. గనుక ఆ సమయానికి ఆయన తన బెయిలు దరఖాస్తును కోర్టుకి సమర్పించవచ్చును. అయితే, మారిన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో అతనికి బెయిలు మంజూరు అవుతుందా లేదా అనేది ప్రశ్న.

 

ఒకవేళ అతను బెయిలుపొంది బయటకు రాగలగితే, రాష్ట్ర రాజకీయ సమీకరణాలు పెద్ద ఎత్తున మారవచ్చును. సమైక్యాంధ్ర నినాదంతో దూసుకుపోతున్న ఆయన పార్టీలోకి, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు దూకే అవకాశం ఉంది.

By
en-us Political News

  
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.