వాగ్దానాలొకరివి, అమలు చేసేవారువేరొకరూ?

Publish Date:Feb 26, 2013

Advertisement

 

జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు ఆ పార్టీలో అధికారికంగా ఏ పదవీ లేకపోయినప్పటికీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె గత కొన్ని నెలలుగా పాదయాత్ర చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీని అభిమానించేవారు ఎవరయినా ఆ పార్టీ కోసం పనిచేయవచ్చును. కనుక ఆమె పాదయాత్రను కూడా ఎవరూ తప్పుపట్టలేరు. కానీ, ఆమె ఆ పార్టీ అధ్యక్షుడి సోదరి అనే ఏకైక అర్హతతో పార్టీ తరపున వాగ్దానాలు గుప్పించడం మాత్రం సహేతుకంగా లేదు. అదేపని, పార్టీ గౌరవద్యక్షురాలిగా ఉన్న ఆమె తల్లి విజయమ్మగారో, లేదా పార్టీలో అధికారిక బాధ్యతలు నిర్వహిస్తున్న మరెవరయినా చేసి ఉంటే సహేతుకంగా ఉండేది. కానీ షర్మిల, పార్టీతో ఏ సంబంధము లేకపోయినా తన సోదరుడు జగన్ తరపున షర్మిల లెక్కలేనన్ని పెద్దపెద్ద వాగ్దానాలు అవలీలగా గుప్పించడం చాలా విడ్డూరం.

 

పార్టీలో ఏ అధికారిక హోదా కలిగి ఉందని ఆమె కేవలం పార్టీ అధ్యక్షుడి చెల్లెలు అనే ఏకైక హోదాతో ఈ విధంగా వాగ్దానాలు చేయడమంటే, పార్టీని కుటుంబ వ్యవహారం గా చూస్తున్నారు తప్ప ఒక రాజేకీయ వేదికగా భావించడంలేదని అనుకోవాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఇప్పుడు ఆమె చేస్తున్న వాగ్దానల్లన్నీ కూడా నీటి మీద వ్రాతలే అనుకోక తప్పదు. ఇందుకు మరో ప్రత్యామ్నాయం ఏమిటంటే, పార్టీలో అధికారికంగా ఏదో ఒకపదవి చేప్పట్టి ఆప్పుడు ఇటువంటి వాగ్దానాలు పుంకానుపుంకాలుగా చేసుకోవచ్చును. లేదా పనిలోపనిగా ఆమె ఇప్పుడు (తన సోదరుడి తరపున) ప్రజలకు చేస్తున్నవాగ్దానాలను, అతను ఖచ్చితంగా అమలుచేస్తాడని లేదా తనే స్వయంగా అతనిచేత అమలు చేయిస్తానని, మరో ప్రత్యేక వాగ్దానం కూడా చేస్తుండటం మంచిది.

 

రాజకీయపార్టీలు అధికారికంగా చేస్తున్న వాగ్దానాలకే దిక్కు లేన్నపుడు, పార్టీతో ఏ సంబందమూ లేని ఆమె చేస్తున్న వాగ్దానాలను, వేరొకరు ఎలా అమలుచేస్తారని ఆలోచిస్తే, ఇదంతా ఎంత నిరుపయోగమయిన కార్యక్రమమో అర్ధం అవుతుంది. ఆమె తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్న కారణంగా తమ పార్టీని బ్రతికించి ఉంచుకోవడానికి మాత్రమే పాదయాత్రలు చేస్తూ, పార్టీని గురించి ప్రచారం చేసుకొంటూ, అధికార పార్టీని విమర్శించుకొంటూ ముందుకు సాగిపోవచ్చును. ఇంకా ఆసక్తి ఉంటే,  కానీ ఈవిధంగా తన నోటికొచ్చిన వాగ్దానాలు ఎడాపెడా చేసుకుపోవడం, ప్రజలను తన అన్నకు ఓటేయమని కోరడం, అతనికి ఓటేస్తే తన వాగ్దానాలన్నిటినీ అతను నేరవేరుస్తాడని చెప్పడం విచిత్రంగా ఉంది.

 

ఉదాహరణకు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గనుక, అతను చేసే వాగ్దానాలకు అధికారికంగా చేసినవని చెప్పవచ్చును. (వాటిని అతను అమలు చేస్తాడా లేదా అనేది తరువాత సంగతి) కానీ, అదే అతని కుమారుడు లోకేష్ పాదయాత్రలు చేసి వాగ్దానాలు చేసినట్లయితే మాత్రం వాటికి విలువ ఉండదు.

 

కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీకి మొదటి నుండే ఒక అధికారం కట్టబెట్టారు. గనుక, అతని వాగ్దానాలకు కూడా అధికారికమయినవే అవుతాయి. ప్రస్తుతం అతను పార్టీ ఉపాద్య్యక్షుడు కూడా అయ్యాడు గనుక, అతని ప్రతీ వాగ్దానం కూడా పూర్తీ అధికారికంగా చెలామణి అవుతాయి.

 

కనుక, షర్మిల కూడా పార్టీలో అధికారికంగా ఏదయినా పదవి పుచ్చుకొని, అప్పుడు ఇటువంటి వాగ్దానాలు చేస్తే సబబుగా ఉంటుంది. లేకుంటే, ఆమె ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నట్లు భావించవలసి ఉంటుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.