మళ్ళీ రాష్ట్రానికి అవే విదిలింపులు

Publish Date:Feb 26, 2013

Advertisement

 

గత మూడు దశాబ్దాలుగా రైల్వేమంత్రిగా ఎవరు బాధ్యతలు చేప్పటినప్పటికీ, అందరికీ మన రాష్ట్రం అంటే చిన్న చూపే. వివిధ రాష్ట్రాలకు చేసిన కేటాయింపులతో పోలిస్తే, మన రాష్ట్రం ఎప్పుడు కూడా ఆఖరి వరుసలోనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ మనుగడకు 42 మంది యం.పీ.లను మన రాష్ట్రం అందిస్తున్నప్పటికీ, మరెందుకో తెలియదు కానీ మొదటి నుండి మన రాష్ట్రం అంటే చిన్నచూపే. అయినప్పటికీ, కేంద్రం పట్ల మన విదేయతలో వీసమంత మార్పులేదు. నిలదీసి ప్రశ్నించే ప్రసక్తే లేదు.

 

తమిళనాడు, ఒరిస్సా, రాజస్తాన్,బీహార్, బెంగాల్ మొదలయిన రాష్ట్రాలకు చెందిన నేతలు, తమకు అవసరమయిన ప్రాజెక్టులను, రైల్వే లయిన్లను, కొత్త రైళ్ళను తీవ్ర ఒత్తిడి చేసి మరీ సాధించుకొంటుంటే, మన రాష్ట్రానికే చెందిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సాక్షాత్ రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నపటికీ కొత్తగా సాదించింది ఏమి లేదు. ఇక రైల్వేలోఉన్న మంత్రిగారే ఏమిచేయలేన్నపుడు, ఇక మన 42 మంది యం.పీ.లు మనకి ఏదో ఓరగబెడతారనుకోవడం ఒట్టి భ్రమ.

 

కొంతమంది యం.పీ.లు తమకి తెలంగాణా సమస్య కంటే మరేమీ ప్రాధాన్యం లేదని బహిరంగంగానే చెపుతారు. మిగిలిన వారు రాజకీయ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో, పార్టీ అంతర్గత కుమ్ములాటలతో, తమ స్వంత వ్యాపారాలు, కాంట్రాక్టులతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు.

 

రాష్ట్ర ప్రయోజనాలకంటే స్వప్రయోజనాలే వారికి మిన్న. ఒకవేళ ఎవరయినా యం.పీ. డిల్లీ చుట్టూ తిరిగి ఒక రైల్వే ప్రాజెక్ట్ కానీ, మరొకటి కానీ సాదించేందుకు కృషి చేస్తుంటే, తమ రాజకీయ ప్రాభల్యం ఎక్కడ దెబ్బతింటుందో అనే బెంగతో, అతని లేదా ఆమె కాళ్ళుపట్టుకు లాగడానికి ప్రయత్నించేవారే తప్ప, వారితో చేతులు కలిపి కృషిచేయడం అరుదు. కొందరికి ప్రాంతీయ వాదం అడ్డొస్తే, మరికొందరికి అసూయ, అహం, బేషజం వంటివి అడ్డొస్తాయి.

 

మొత్తం మీద, ప్రతీ ఏట రైల్వేమంత్రిగారు మనకి మొండి చేయడం చూపడం, మనకి రావాల్సిన, దక్కాల్సిన, రైళ్ళను, ప్రాజెక్టులను ఇరుగుపొరుగు రాష్ట్రాలవారు గద్దలా తన్నుకు పోవడం షరా మామూలే. ప్రజలు నిస్సహాయంగా చూస్తూ ఈ విధంగా ఆక్రందనలు చేయడము మామూలే.

 

తిరుపతి, విశాఖలలో కొత్త రైల్వే జోన్ల ఏర్పాటు, రాష్ట్రంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను దేశంలో ప్రముఖ నగరాలతో కలుపుతూ కొత్త రైళ్ళు వంటి డిమాండ్లు చాలానే ఉన్నపటికీ, ఈసారి రైల్వే బడ్జెట్లో కర్నూల్ లో వేగన్ రిపేర్ వర్క్ షాప్, 22కొత్త లైన్ల నిర్మాణానికి అనుమతులు మాత్రమే పెర్కొనవలసినవి. ఈ కొత్త ప్రాజెక్టులు ఈ ఏడాది మొదలు పెడితే అవి ఎన్ని సంవత్సరాల తరువాత పూర్తవుతాయో ఎవరికీ తెలియదు. అందువల్ల వాటివల్ల రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు ఒరిగేదేమీ లేదు.

 

రాష్ట్రానికి రెండు,మూడు కొత్త రైళ్ళను విదిలించిన మన రైల్వేమంత్రి బన్సాల్ గారు, విజయవాడలో రైల్‌నీరు బాటిలింగ్‌ ప్లాంటును, విశాఖలో డిల్లీ తరహాలో (విదేశీ) పర్యాటకులకు విలాసవంతమయిన విశ్రాంతి గదులను ఏర్పాటు చేయడమే ఆయన మన రాష్ట్రానికిచ్చిన ఒక పెద్దవరం అన్నట్లు అభివర్ణించి చెప్పడం పుండు మీద కారం చల్లడమే అవుతుంది. విజయవాడలో నీళ్ళ ప్లాంటు, విశాఖలో విలాసవంతమయిన విశ్రాంతి గదులవల్ల రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల వారికి ఏమి ప్రయోజనమో ఆయనే చెప్పాలి.

 

ప్రజలు కోరుకొంటున్నవాటికి, ఆయన ఇస్తున్నవాటికీ ఎక్కడా పొసగదు. ప్రజలకి కొత్త రైళ్ళు కావాలి, కొత్త రైల్వే జోన్లు కావాలి, ఉపాధి కల్పించే కోచ్చ్ ఫ్యాక్టరీ కావలి తప్ప నీళ్ళ ప్లాంటులు, లిఫ్టులూ, విలాసవంతమయిన విశ్రాంతి గదులు కాదు. మన యం.పీ.లలో చైతన్యం లేనపుడు, మంత్రిగారు మాత్రం ఏమిచేస్తారు? అడగందే అమ్మయినా పెట్టదని పెద్దలు ఊరికే అనలేదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.