మహిళ ట్రైనీ ఐపీఎస్‌ పై లైంగిక వేధింపుల కేసు ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు దర్యాప్తు బదిలీ.!

Publish Date:Jul 22, 2026

Advertisement

నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లో మహిళ ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న ఈ కేసును ఉన్నతాధికారులు ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేశారు. మహిళలకు సంబంధించిన సున్నితమైన కేసు కావడంతో ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, తదుపరి దర్యాప్తును షీటీమ్స్‌కు అప్పగించారు. షీటీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షణలో విచారణ కొనసాగించానున్నారు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసి    ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు వైద్యులు తెలిపిన నేపథ్యంలో   ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. డిశ్చార్జ్ అనంతరం వైద్యుల అనుమతి మేరకు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. కేసు దర్యాప్తులో ఆయన వాంగ్మూలం కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డి పేరుతో ఉన్నట్లు భావిస్తున్న ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులోని అంశాలు, కేసులోని ఇతర ఆధారాలతో సరిపోల్చి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. 

మరోవైపు, తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.  ఈ విచారణలో ప్రభుత్వం, పోలీసుల తరఫున సమర్పించే వాదనలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవైపు షీటీమ్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు వేగం పుంజుకోగా, మరోవైపు హైకోర్టులో విచారణ కొనసాగనుంది. 

sexual harassment case against female trainee IPS officer,  transferred to women saftey wing, Uday Krishnareddy, Sucide, Attempt

By
en-us Political News

  
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ తెలంగాణ భవన్‌
మందుల సామేల్ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి కౌంటర్..!
దేశంలో ప్రస్తుతం నిరుద్యోగ యువత విద్యార్థుల భవిష్యత్తు తీవ్ర గందరగోళంలో పడింది.
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ కీలక అడుగు వేసింది.
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత మళ్లీ తీవ్ర రూపం దాల్చింది.
నా నియోజకవర్గానికి జోలికి వస్తే మీకు మర్యాద దక్కదు.. ఘాటు హెచ్చరిక..!
ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధులు ఈరోజు కేవలం నిరసనలకు వేదికగా మాత్రమే లేవు
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి ..పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
చివరికి మర్డర్ చేయించింది కూడా సవతి తల్లే..!
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ విషాదం చోటుచేసుకుంది.
పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం
నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి, తన తీర్పును ఈనెల 27కి రిజర్వ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.