ఎల్ నినో ఎఫెక్ట్.. తాగు, సాగునీటికి తీవ్ర కొరత!

Publish Date:May 9, 2026

Advertisement

ఎల్‌నినో ప్రభావం ఇండయాపై తీవ్రంగా ఉండనుంది.   ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను దెబ్బతీసే  ఎల్ నినో ఈ సారి ఇండియాపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఇన్ కాయిస్) పేర్కొంది.   పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న అసాధారణ మార్పుల వల్ల కారణంగా ఏర్పడే ఎల్ నినో ప్రభావం ఇండియాపై వచ్చే ఏడాది జనవరి వరకూ ఉంటుందని పేర్కొంది.  

పసిఫిక్ మహాసముద్రంలోని తూర్పు,  మధ్య ప్రాంత ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయనీ,   దీనివల్ల దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గి..  కరువు పరిస్థితులు ఏర్పడే  ముప్పు ఉందని తెలిపింది.  ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందనీ, అందువల్ల   సాగునీటి కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 

ఈ అంచనాలను రూపొందించడానికి   అత్యంత అధునాతనమైన  బేయేసియన్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్  (బీసీఎన్ఎన్) అనే డీప్ లెర్నింగ్ మోడల్‌ను ఉపయోగించారు. ఈ టెక్నాలజీ సహాయంతో వాతావరణంలో వచ్చే మార్పులను దాదాపు రెండేళ్ల ముందే పసిగట్టవచ్చు. ఈ మోడల్ విశ్లేషణ ప్రకారం..  రాబోయే రెండున్నరేళ్ల పాటు ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుంది. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణ పరిస్థితులను అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉంది. 

సముద్ర మట్టంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కేవలం భూమిపైనే కాకుండా, సముద్ర గర్భంలోనూ పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ఉత్తర హిందూ మహాసముద్రంలో సుదీర్ఘమైన  మెరైన్ హీట్ వేవ్స్ వస్తాయి.  దీనివల్ల సముద్ర పర్యావరణ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా, చేపల వేటపై ఆధారపడే మత్స్యకారుల జీవనోపాధికి కూడా గండి పడుతుంది.  

గతంలో ఎల్‌నినో ప్రభావం వల్ల దేశంలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. 2023లో కూడా వర్షపాతం తగ్గడం వల్ల వరి, పప్పుధాన్యాల సాగుపై ప్రభావం పడింది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు ఆశాజనకంగా లేకపోవడంతో ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.   2027 వరకు ఇదే పరిస్థితి కొనసాగితే సాగునీటితో పాటు తాగునీటి ఎద్దడి కూడా ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాలు,  రైతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించడం, నీటి పొదుపు చర్యలు చేపట్టడం వంటి ముందస్తు జాగ్రత్తలు అవసరమని పేర్కొంటున్నారు.  

By
en-us Political News

  
గాదె సాయికృష్ణ అదృశ్యం ఉదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనంగా మారింది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూశారు.
విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను పీపీ పద్ధతిలో ఆతిథ్య రంగానికి అప్పగించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నట్టు ముగ్గురు మంత్రుల కమిటీ ప్రకటించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లతో యోగభ్యాసం చేయించిన రామ్ దేవ్ బాబా
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం, అలాగే పోలీసుల కస్టడీలోనే అతను మరణించాడంటూ వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
యోగా గురు  బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం  జరిగిన ఈ  కార్యక్రమంలో వేలాది మంది   పాల్గొని రికార్డు సృష్టించారు.
ఈ నెల 26వ తేదీ వరకు మధ్యం తర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు బండి భగీరథ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌ పై విడుదలయ్యారు.
. ఆ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల కోసం అందుబాటులో ఉన్న వసతులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పోషకాహార సేవలపై ఆరా తీశారు. కేంద్రంలోని నిల్వల రిజిస్టర్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది సరికొత్త ఇండక్షన్ స్టవ్‌పై తయారు చేసిన రాగి జావను సీఎంకు అందించగా.. ఆయన చిన్నారుల పక్కనే కూర్చుని దానిని సేవించారు. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేలా అంగన్‌వాడీ ఆవరణలో ఒక మొక్కను నాటారు.
2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతని వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడానికే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం హార్దిక్ బౌలింగ్ చేసేందుకు పూర్తిగా ఫిట్‌గా లేడని సమాచారం. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా హార్దిక్ ఆడటం లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పల్నాడు జిల్లా పర్యటనలో ఒక సామాన్య గృహస్థుడిగా మారిపోయారు. స్థానిక రైతు క్షేత్రంలో ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనెను కొనుగోలు చేసే క్రమంలో ఆయన తన సతీమణి భువనేశ్వరికి ఫోన్ చేశారు. చేసి వేరుశనగ నూనె కొనమంటావా అని అడిగారు.
సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ నిగర్ సుల్తానా 36 పరుగులు, శోభన మోస్తరీ22 పరుగులతో రాణించారు. ఇక చివరి ఓవర్లలో షోర్నా అక్తర్ కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్ల సాయంతో అజేయంగా 39 పరుగులు సాధించడంతో బంగ్లా జట్టు ఆ మాత్రం స్కోరైనా చేరగలిగింది. పాకిస్థాన్ బౌలర్లలో ఫాతిమా సనా రెండు వికెట్లు పడగొట్టింది.
ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అంపైర్ ఇచ్చిన పెనాల్టీ రన్స్ తో కలిసి టీమ్ ఇండియా తొలి ఓవర్ లో ఏకంగా 23 పరుగులు సాధించింది. దీంతో 2004లో బంగ్లాదేశ్‌పై తొలి ఓవర్లోనే 22 పరుగులు సాధించి నెలకొల్పిన పాత రికార్డు కనుమరుగైపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.