Publish Date:May 27, 2021
ఓపెన్ చేస్తే.. ఒక ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. బంధువులు అందరు వచ్చారు. ఎవరి పనుల్లో వార్లు ఉన్నారు. ఇల్లు అంత సందడి సందడి.. అనుకున్నట్లుగానే పెళ్లి కూడా జారిపోయింది. పెళ్లి పనులు చేసి అందరు అలిసి పడకుండిపోయారు.. అందులో ఒక మహిళ ఎందుకో తెలియదుగాని ఆ రాత్రిపూట బయటికి వెళ్ళింది. ఇక అంతే..
కట్ చేస్తే.. కొంత మంది ఆమెను ఫాలో అయ్యారు. ఆమె ముఖంపై ముసుగు వేసి, చేతులు కట్టేసి 300 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లారు. అంత నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, తీవ్రంగా గాయపరిచారు. మండపాలలో వినియోగించే వస్త్రాలతో ఆమెను స్తంభానికి కట్టేసినట్టు వివరించారు. బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళను అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడి చిత్రహింసలకు గురిచేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడి, వివస్త్రగా ఉన్న బాధితురాలిని రోడ్డు పక్కన ఓ స్తంభానికి వేలాడదీశారు. కదల్లేక, మాట్లాడలేక ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్ పరోహి గ్రామానికి చెందిన ఏడుగుర్ని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని బాధితురాలు గుర్తించినట్టు తెలిపారు. బాధితురాలి (30) ఆడపడుచు వివాహం సోమవారం రాత్రి జరగడంతో అందుకు నిందితులు సప్లయర్స్ సామాన్లు తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. వివాహం జరిగిన తర్వాత మంగళవారం తెల్లవారుజామున ఆమె ఒంటిరిగా బయటకు వెళ్లడం గమనించిన నిందితులు వెంబడించి ఎత్తుకెళ్లారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను తీవ్రంగా హింసించడంతో శరీరంపై గాయాలయ్యాయి.
బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారని, ప్రస్తుతం ఆమె సమస్తీపూర్ సాదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆ జిల్లా ఎస్పీ మానవ్జీత్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. పరువు పోతుందనే భయంతో బాధిత మహిళ తనపై అత్యాచారం జరగలేదని చెప్పిందన్నారు. కానీ, ఆమెపై అత్యాచారం జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోందని, వైద్యుల నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. బాధితురాలిని కుటుంబసభ్యులు మంగళవారం సాయంత్రం దలాసింగ్సరాయ్ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులకు అక్కడ వైద్యులు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగుచూసింది. దారుణమైన ఘటన బిహార్లో సమస్తీపూర్ జిల్లా బిభూత్పూర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని చఖాబిబ్ రుధియా గ్రామంలో మంగళవారం జరిగింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/seven-people-gang-raped-on-women-39-116356.html
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.