మోదీ సర్కార్ వ‌ర్సెస్ సోష‌ల్ మీడియా.. కొత్త రూల్స్ లోగుట్టు ఏంటి?

Publish Date:May 27, 2021

Advertisement

కొత్త డిజిట‌ల్ రూల్స్‌. ఇండియాలో ఇదే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్‌. సోష‌ల్ మీడియాను కంట్రోల్ చేయటానికి కేంద్రం కుట్ర చేస్తోంద‌నేది ఓ ఆరోప‌ణ‌. వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌కు భంగం వాటిల్లుతుంద‌నేది మ‌రో వాద‌న‌. అందుకే, అమ‌లుకు గ‌డువు ముగిసినా.. కోర్టు కేసులు, వ‌రుస కౌంట‌ర్ల‌తో మోదీ స‌ర్కారు వ‌ర్సెస్ సోష‌ల్ మీడియా ర‌చ్చ రంజుగా సాగుతోంది. 

కొత్త నిబంధనలను సవాల్ చేస్తూ వాట్సాప్ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. వాట్సాప్ కోర్టుకు వెళ్ల‌డాన్ని కేంద్రం తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. ఇది ప్ర‌భుత్వ విధానాల‌ను ధిక్క‌రించ‌డ‌మేనంటూ హూంక‌రించింది. కేంద్రం చెప్పిన‌ట్టు చేస్తే వ్య‌క్తి స్వేచ్ఛ‌ను ఉల్లంఘించిన వారిమి అవుతామంటూ వాట్సాప్ తేల్చి చెప్పింది. అటు, ట్విట‌ర్ సైతం.. ఓకే, బ‌ట్ నాట్ ఓకే అన్న‌ట్టు ఓ ప్ర‌క‌ట‌న చేసింది.

వర్తింపచేయదగిన చట్టానికి లోబడి ఉండటానికి కృషి చేస్తామని ట్విటర్ ప్రకటించింది. అయితే స్వేచ్ఛగా, అరమరికలు లేకుండా మాట్లాడుకోవడాన్ని అడ్డుకునే నిబంధనలను మార్చాలని కోరడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. 

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం ప్రకారం, సామాజిక మాధ్యమాల కంపెనీలు భారత దేశంలో కాంప్లియెన్స్ ఆఫీసర్‌ను నియమించాలి. ఫిర్యాదులపై స్పందించేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. చట్టబద్ధమైన ఆదేశం జారీ చేసినప్పటి నుంచి 36 గంటల్లోగా సంబంధిత కంటెంట్‌ను తొలగించాలి. భారత దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే సందేశం సామాజిక మాధ్యమంలో పోస్ట్ అయినపుడు, దానిని మొదట ఎవరు పోస్ట్ చేశారో చెప్పాలని ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి కంపెనీలకు కొత్త ఐటీ రూల్స్ చెప్తున్నాయి. అదేవిధంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్ట్‌లు, అత్యాచారాలు వంటి నేరాలను ప్రేరేపించే పోస్ట్‌ల విషయంలో కూడా సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు అందజేయాలనేది కొత్త రూల్స్ సారాంశం. అయితే, కేంద్రం చెప్పిన‌ట్టు చేస్తే తాము పాటిస్తున్న వ్య‌క్తి గోప్య‌త‌కు భంగం వాటిల్లుతుంద‌నేది వాట్సాప్‌, ట్విట‌ర్‌ల అభ్యంత‌రం. 

కొత్త రూల్స్‌కు వ్యతిరేకంగా వాట్సాప్ కోర్టుకు వెళ్ల‌గా.. ట్విటర్ గురువారం ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది. ట్విటర్ సర్వీస్‌ను అందుబాటులో ఉంచడం కోసం భారతదేశంలో వర్తించే చట్టాలకు అనుగుణంగా పని చేయడానికి కృషి చేస్తామని తెలిపింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా తాము చేస్తున్నట్లుగానే, పారదర్శకతా సూత్రాల మార్గదర్శకత్వంలో కచ్చితంగా పని చేస్తామని, తమ సర్వీస్‌పైగల ప్రతి గళానికి సాధికారత కల్పించేందుకు కట్టుబడి ఉంటామని, చట్టపరమైన నిబంధనల మేరకు భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యతలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని ట్విట‌ర్‌ తెలిపింది. 

ప్రస్తుతం, భారతదేశంలో తమ ఉద్యోగుల విషయంలో జరిగిన సంఘటనల పట్ల, తాము సేవలందిస్తున్న ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛకు సంభవించే అవకాశంగల ముప్పు పట్ల ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది. ‘‘మా అంతర్జాతీయ సేవా నిబంధనల అమలుకు ప్రతిస్పందనగా పోలీసులు బెదిరింపు వ్యూహాలను ఉపయోగించడం, అదేవిధంగా కొత్త ఐటీ రూల్స్ మౌలికాంశాలపైనా ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా భారతదేశంలోని పౌర సమాజంలో చాలా మందితో పాటు మాకు కూడా ఆందోళన ఉంది’’ అని తెలిపింది. 

స్వేచ్ఛగా, అరమరికలు లేకుండా, బహిరంగంగా మాట్లాడుకోవడానికి ఆటంకాలు కల్పించే ఈ నిబంధనల్లో మార్పు కోసం వాదనలు వినిపించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు స్ప‌ష్టం చేసింది. భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక సంభాషణను కొనసాగిస్తామని, పరస్పర గౌరవభావం, సహకారంతో కూడిన వైఖరిని అనుసరించడం చాలా ముఖ్యమని నమ్ముతున్నట్లు తెలిపింది. ప్రజల ప్రయోజనాలను కాపాడవలసిన సమష్టి బాధ్యత ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు, పరిశ్రమ, పౌర సమాజానికి ఉందని గుర్తు చేసింది. 

‘కాంగ్రెస్ టూల్‌కిట్’పై బీజేపీ నేతల పోస్ట్‌లకు ట్విటర్ ‘‘మానిప్యులేటెడ్ మీడియా’’ అని ట్యాగ్ చేసింది. ఈ ట్యాగ్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరింది. దీనిపై నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని ట్విటర్ ఇండియా కార్యాలయాలకు ఇటీవ‌ల వెళ్లారు. దీంతో ట్విటర్, కేంద్ర ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సోష‌ల్ మీడియా వ‌ర్సెస్ మోదీ స‌ర్కారు వార్‌లో ఎవ‌రిది పైచేయి అవుతుందో చూడాలి...

By
en-us Political News

  
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.