political-news-img

సీబీఎస్ఈ కీలక నిర్ణయం...12వ తరగతి పరీక్షలు రద్దు

ఇరాన్‌ , అమెరికా- ఇజ్రాయెల్‌ల పరస్పర దాడులతో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల్లో ఈనెల 16 నుంచి జరగాల్సిన 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. ఈ మేరకు సీబీఎస్ఈ ఆదివారం (15-3-26న) ప్రకటన వెలువరించింది. గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఇ విద్యార్థుల విషయంలో 2026 మార్చి 16 నుంచి 2026 ఏప్రిల్ 10 వరకు 12వ తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఈ పరీక్షలు రద్దయ్యాయి. ఈ దేశాల్లో 12వ తరగతి విద్యార్థుల పరీక్షలు, ఫలితాల ప్రకటన విధానంపై తగిన సమయంలో విడిగా తెలియజేస్తామని సర్క్యులర్‌లో పేర్కొంది. పశ్చిమాసియాలో మార్చి 11 వరకు నిర్వహించాల్సిన 10వ తరగతి బోర్డు పరీక్షలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే సీబీఎస్‌ఈ ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియా దేశాల్లోని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల ప్రిన్సిపాల్‌లు ఈ మేరకు విద్యార్థులకు తెలియజేయాలని తన ప్రకటనలో పేర్కొంది.

Publish Date: Mar 15, 2026 6:20PM

political-news-img

హైడ్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న స్థానికులు

హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కొనసాగు తున్న భూ వివాదానికి చివరికి అధికారులు చెక్ పెట్టి... సమస్యను పరిష్కారించారు. ప్రభుత్వానికి, దేవాదాయ శాఖకు చెందిన భూమిని ఒక వర్గానికి చెందిన వ్యక్తులు రాత్రికి రాత్రే కబ్జా చేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ విషయంపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో హైడ్రా అధికా రులు రంగంలోకి దిగి కబ్జాను తొలగించారు. అత్తాపూర్ పరిసర ప్రాంతాలైన రాంబాగ్, హైదర్ గూడ ప్రాంతాలకు చెందిన స్థానికులు కబ్జాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిపై అక్రమంగా రేకుల ప్రహరీ షెడ్ నిర్మించి ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ ఎమ్మార్వో, ఆర్డీఓ, పోలీసు అధికా రులు, జిల్లా కలెక్టర్ వరకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ వెంటనే చర్యలు తీసుకోకపో వడంతో స్థానికులు మరోసారి కబ్జా చేసిన స్థలం వద్దే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.ఈ విషయం కాస్త తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. రెవెన్యూ అధికారులతో కూడా చర్చించి భూమి యాజమా న్యానికి సంబంధించిన వివరాలను సేకరించారు. సమస్యను సమగ్రంగా పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు. తదుపరి విచారణలో భూమి ప్రభుత్వానికి మరియు దేవాదాయ శాఖకు చెందినదేనని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో హైడ్రా అధికారులు తక్షణ చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆదివారం ఉదయం భారీ పోలీస్ బందోబస్తుతో హైడ్రా బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. కబ్జా చేసిన వర్గం నిర్మించిన రేకుల ప్రహరీ షెడ్డును తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడ పెనిషింగ్ నిర్వహించి భూమిని రక్షించారు. అయితే షెడ్ తొలగింపు సమయంలో కబ్జా చేసిన వర్గానికి చెందిన కొందరు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని అక్కడ ఉన్న వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ, దేవాదాయ శాఖకు చెందిన విలువైన భూమిని కాపాడిన హైడ్రా అధికారుల చర్యలను స్థానికులు స్వాగతించారు. సమస్యను తక్షణం పరిష్కరించి అక్రమ కబ్జాను తొలగించినందుకు హైడ్రా బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు ఇలాంటి చర్యలు కొనసాగిస్తే నగరంలో భూ కబ్జాలకు చెక్ పడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా స్థానికులు హైడ్రాధికారులు చేసిన చర్యలకు సంతోషపడుతూ హైడ్రా కమిషనర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

Publish Date: Mar 15, 2026 6:07PM

political-news-img

వివేక హత్య కేసు విచారణ సీబీఐ బాధ్యతగా చేయలేదు : సునీత

కడప జిల్లా పులివెందుల పట్టణంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ముందుగా ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఇంటి సమీపంలోని పార్కులో ఉన్న వివేకానంద రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద రెడ్డి భార్య సుగుణమ్మ, కుమార్తె సునీత రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బామ్మర్ది శివప్రకాష్ రెడ్డి, కుటుంబ సభ్యులు ప్రతాప్ రెడ్డి, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి మాట్లాడుతూ కీలక ఆరోపణలు చేశారు. తన తండ్రి హత్య కేసును సీబీఐ బాధ్యతగా విచారించలేదని ఆమె ఆరోపించారు. ఈ కేసులో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కీలక నిందితుల విషయంలో సీబీఐ చెప్పింది వినడమే తప్ప లోతుగా విచారణ జరపలేదని అన్నారు. హత్య అనంతరం నిందితుల మధ్య భారీగా ఫోన్ సంభాషణలు, మెసేజ్‌లు జరిగినట్లు తెలిపారు.ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణిని కూడా విచారించలేదని పేర్కొన్నారు. కేసులో నిజం బయటపడే వరకు తన పోరాటం కొనసాగుతుందని సునీత రెడ్డి స్పష్టం చేశారు.

Publish Date: Mar 15, 2026 5:48PM

political-news-img

డ్రగ్స్ కేసులో నాపేరు లాగితే చట్టపరమైన చర్యలు...కేటీఆర్ హెచ్చరిక

మొయినాబాదులో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో నిన్న సాయంత్రం సమయంలో జరిగిన డ్రగ్స్ పార్టీ గురించి ఈవిల్ టీంకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో దాడులు చేసి ఆ పార్టీలో పాల్గొన్న 11 మందిని అదుపులోకి తీసుకొని వారికి డ్రగ్స్ టెస్టులు చేయడం జరిగింది. అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు...అంతే కాకుండా డ్రగ్స్ వ్యవహారంలో తన పేరును అనవసరంగా లాగితే చట్టపరమైన నోటీసులతో స్పందిస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. డ్రగ్స్ మనుషులను రాక్షసులుగా మార్చేస్తాయని, బాధ్యతా యుతమైన పదవుల్లో ఉన్నవారు కూడా డ్రగ్స్ వాడటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.తాను వ్యక్తిగతంగా డ్రగ్స్ మరియు ఇతర అక్రమ పదార్థాల వాడకానికి పూర్తిగా వ్యతిరేకినని కేటీఆర్ స్పష్టం చేశారు. తమ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) డ్రగ్స్ వాడకాన్ని మరియు ఏ విధమైన చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఖండి స్తుందని తెలిపారు. డ్రగ్స్ వినియోగించే వారు గానీ, విక్రయించే వారు గానీ వారి రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా చట్టం ప్రకారం కఠినంగా శిక్షించబ డాలని ఆయన అన్నారు. అయితే, డ్రగ్స్ కేసును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించి బీఆర్‌ఎస్ పార్టీని ఈ విషయంలోకి లాగడం తాను తీవ్రంగా ఖండిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌తో రాజకీయంగా స్కోర్లు సెటిల్ చేసుకోవడానికి డ్రగ్స్ కేసును ఉప యోగించడం అసహ్యకర మైన రాజకీయాలకు నిదర్శనమని విమర్శిం చారు.ఇప్పటికే తాను అనేకసార్లు చెప్పినట్లుగా, ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్స్ పరీక్షలకు హాజరుకావాలన్న సూచనను స్వాగతిస్తున్నానని చెప్పారు. ప్రజాప్రతినిధులే ముందుగా ఉదాహరణగా నిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, భవిష్యత్తులో ఏ డ్రగ్స్ కేసులోనైనా తన పేరును అనవసరంగా ప్రస్తావిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కేటీఆర్ గట్టిగా హెచ్చరించారు.

Publish Date: Mar 15, 2026 5:11PM

political-news-img

ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు స్టేషన్ బెయిల్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. ఆయనతో పాటు పుత్త మధు, ప్రియాంక రెడ్డికి కూడా అధికారులు బెయిల్ ఇచ్చారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అవసర మైన న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత వారిని విడుదల చేశారు. ఇదిలా ఉండగా మీడియా దృష్టికి చిక్క కుండా మహేష్ యాదవ్‌ను పోలీసులు స్టేషన్ నుంచి బయటకు పంపినట్లు సమాచారం. పోలీస్ వాహనాలను బయటకు తీసుకొచ్చి పరిస్థితిని సాధారణంగా ఉన్నట్లు చూపిస్తూ, అనంతరం ఎంపీని మరో కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు..

Publish Date: Mar 15, 2026 5:00PM

political-news-img

పుట్టా మహేష్‌ను సస్పెండ్ చేయాలి...విపక్షాలు డిమాండ్

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పాజిటవ్ రావటంపై ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. ఎంపీ పుట్టాను వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టబడితే ఇంత వరకు సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు స్పందించకపోవడం దారుణమని వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఎంపీ పుట్టాను తక్షణమే అనర్హత వేటు వేయాలని, తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఎంపీ కొకైన్‌తో విందు, చిందులు చేయడం దారుణమని... డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఎంపీ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని, యువతను డ్రగ్స్ వాడమని ప్రోత్సహిస్తున్నారా? అని షర్మిల నిలదీశారు. ఓట్లు వేసి గెలిపించిన ఏలూరు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్‌పై నిజంగానే కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలనుకుంటే, ముందుగా తమ సొంత పార్టీ ఎంపీపై చర్యలు తీసుకుని సీఎం చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని షర్మిల సవాల్ విసిరారు.డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తుంటే...డ్రగ్స్ కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పట్టుబడటం సిగ్గు చేటని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ 10 ఏళ్ల పాలనలో విచ్చలవిడిగా దందా నడిచింది అని మనోహర్ రెడ్డి తెలిపారు.

Publish Date: Mar 15, 2026 4:50PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img