మదనపల్లిలో ఏడేళ్ల బాలికపై హత్యాచారం

Publish Date:Feb 17, 2026

Advertisement

అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో  ఏడేళ్ల బాలిక హత్యాచారానికి గురైంది. గుండెలనిలిచే విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటూ.. సోమవారం (ఫిబ్రవరి 16)సాయంత్రం అదృశ్యమైన చిన్నారి తెల్లవారేసరికి పక్కింట్లోనే హత్యాచారానికి గురై కనిపించింది.  వివరాలిలా ఉన్నాయి. సోమవారం (ఫిబ్రవరి 16) సాయంత్రం అదృశ్యమైన ఏడెళ్ల రిషిక ప్రియ పక్కింట్లోనే శవమై తేలడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మదనపల్లి  వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే రిషిక ప్రియ సోమవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమైంది. రాత్రి కావస్తున్నా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు స్థానికంగా ఉన్న అనుమానితులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో పక్కింట్లోనే నివసించే ఒక వ్యక్తి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అతని ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీలలో బాలిక మృతదేహం ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో ఉండటం గుర్తించారు.  నిందితుడు బాలికకు చాక్లెట్లు ఇస్తాననీ,  మరేదైనా మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.   ఆ తర్వాత బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించి,  ఆమె కేకలు వేస్తుందన్న భయంతోనో గొంతు నులిమి చంపేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. హత్య   అనంతరం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి దాచేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

By
en-us Political News

  
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది.
తెలంగాణలో ఆదివారం పెట్రోల్ బంకుల మూసివేతపై సాగుతున్న ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అసలు నిజమేంటో, అధికారులు ఏమన్నారో ఈ స్టోరీలో తెలుసుకోండి.
హైదరాబాద్‌లో నమోదైన ఫోక్సో కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది.
హైదరాబాద్ ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేశామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పరిధిలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కొహెడ గ్రామంలో చోటుచేసుకున్న ఓ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్.. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ (జేజీఎఫ్)..
బండి భగీరథ్‌‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పనిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు.
బినెట్ ఆమోదం తరువాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 47.60 కిలోమీటర్ల పొడవున ఆరు కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. మచిలీపట్నం , రేపల్లె మధ్య రైల్వేలైన్‌లో మొత్తం 70 బ్రిడ్జిలు, 24 అండర్‌ బ్రిడ్జిలు రానున్నాయి.
రాష్ట్రంలో రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, ఏపీని డిఫెన్స్ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది.
దీంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ.. డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి)మంత్రిత్వ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియ జేశారు.
హుస్సేన్ సాగర్ వైపు వెడుతుండగా, దారిలో రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగానే.. పోలీసులకు చెప్పుకుంటే తన కష్టం తీరుతుందేమోనన్న ఆశకలిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.