Publish Date:Feb 17, 2026
సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తులు , గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఓబులాపురం మైనింగ్ కేసుల నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం (ఫిబ్రవరి 17) కొట్టి వేసింది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్లు దాఖలు చేయగా డిస్మిస్ చేసిన సంగతి విదితమే. ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆమె పిటిషన్లు కొట్టివేయడంతో శ్రీలక్ష్మికి శిక్ష తప్పదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.
ఓబులాపురం మైనింగ్, జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి తాను కేవలం ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే విధులు నిర్వహించానని.. ఇందులో ఎటువంటి వ్యక్తి గత ప్రయోజనం లేదని శ్రీలక్ష్మి తన పిటిషన్ ల లో పేర్కొన్నారు. పేర్కొన్నారు. అయితే సిబిఐ తరపు న్యాయవాదులు ఓబులాపురం మైనింగ్ లీజుల కేటాయింపులో.. క్విడ్ ప్రోకో వ్యవహారాల్లో శ్రీలక్ష్మి కీలక పాత్ర పోషించారని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం, కేసు ఈ దశలో ఆమె పేరు తొలగింపు సాధ్యం కాదని స్పష్టం చేసింది. సిబిఐ చూపిన అభియోగాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నందున, శ్రీలక్ష్మి ట్రయల్ కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం కోర్టు పేర్కొంది
ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగింది.
ఇప్పటికే ఈ కేసులో నిందితులందరికీ జైలు శిక్ష ఖరారు అయ్యింది. ఒక్క శ్రీ లక్ష్మీ విషయంలో మాత్రమే విచారణ జరగలేదు. అయితే తాజాగా ఆమె పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఆమెకు సైతం శిక్ష తప్పదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ కేసుల్లో ఆమె చాలా కాలం పాటు శ్రీలక్ష్మి రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి విదితమే. కాగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక శ్రీలక్ష్మి తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారు. ఆమెకు అప్పట్లో జగన్ సర్కార్ ప్రాధాన్యమిచ్చింది. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/set-back-ti-ias-srilakshmi-in-supreme-court-36-214233.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.