రాజకీయాలకు బలవుతున్న తెలుగుజాతి

Publish Date:Aug 1, 2013

Advertisement

......సాయి లక్ష్మీ మద్దాల

 

 

 

తెలుగుజాతి విదేశీయురాలి పుణ్యమా అని రెండుగా చీలిపోయింది. ఎంటువంటి ముందస్తు జాగ్రత్తలు, నిర్ణయాలు లేకుండానే వామపక్ష నిర్ణయం,....తీర్మానం జరిగిపోయాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం పూర్తయ్యే వరకు ఏ ఒక్క రాజకీయ నేత నోరు మెదపలేదు. మరి ముఖ్యంగా ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి వ్యవహారశైలి మాత్రం చాలా విడ్డురంగాను, విచిత్రంగానూ ఉంది. రెండు రాష్ట్రాలుగా విడిపోయి, విడగొట్టబడిన సందర్భంలో ఆయా ప్రాంతప్రజల మనోభావాలను, భావోద్వేగాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు ఏ రాజకీయ నేత కూడా. దీనిని ఏమనాలి?

 

 

మరీ ముఖ్యంగా ఇపుడు కొత్తగా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని దానికి కొత్తగా ఒక రాజధానిని నిర్దేశించడం అంటే, అది రాత్రికి రాత్రే అయిపోయే కార్యక్రమం కాదు. ఒక జాతిని, ఒక ప్రాంతాన్ని రెండుగా చీల్చాలంటే అక్కడ తలెత్తే భౌగోళిక సమస్యలు, మౌలిక సమస్యలు, ఎవరికి తెలియనిది కావు. ఒక ప్రాంతాన్ని విభజించితే నిర్ణయం తీసుకున్నప్పుడు, ముందుగా అవలంభించవలసిన నిబంధనలు ఎందుకు పాటించలేదు.


 

ఒక రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించేటప్పుడు ముఖ్యంగా తలెత్తే వివాదం నీటి వివాదం. నీటి పంపకాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు జరగలేదు. ముఖ్యంగా తలెత్తే సమస్యలను ఒకసారి కూలంకుషంగా పరిశీలిస్తే నీటి సమస్య, ఇక్కడ హైదరాబాద్ లో 30,40 సంవత్సరాలుగా సెటిలయిన వివిధ ప్రభుత్వ రంగ ఉద్యోగుల భవితవ్యం, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వ్యాపారస్తుల భవితవ్యం, వివిధ ప్రైవేటు సంస్థల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ రకంగా విశ్లేషించుకోండి. హైదరాబాద్ లో సెటిల్ అయిన వివిధ ప్రాంత వాసులకు జీవన భరోసా ఎవరు కల్పిస్తారు.



పోలవరానికి జాతీయ హోదా కల్పించటం అంటే అది ఒక కాగితం మీద రాసుకున్నంత తేలికగా జరిగిపోయే వ్యవహారమా. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవేవి ఏళ్లకేల్లుగా నలుగుతున్న సమస్య. ఆ నిర్మాణం జరగాలంటే అక్కడ తలెత్తే మౌలిక సమస్యలకు ఎవరు భాధ్యులు? ఇన్ని రకాల సమస్యలు ఒక ప్రాంత విభజనలో అంతర్లీనంగా దాగొని ఉంటే ఒక 10గంటల వ్యవధిలో ఒక 20మంది సభ్యులు 10కోట్ల మంది ప్రజానీకం తలరాతను ఎలా శాసించగలిగారు? మరీ ముఖ్యంగా ప్రధాన సమస్య "హైదరాబాద్". హైదరాబాద్ ను 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్నారు. మరి ఈ 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఎవరి అధీనంలో ఉండాలి?




రాష్ట్ర విభజనలో ఉన్న ఇన్ని సమస్యలు చంద్రబాబు నాయుడి దృష్టికి రాలేదా? ఆంధ్ర రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా ఆయన తన కర్తవ్యాన్ని ఎందుకు విస్మరించారు? విభజన అనంతరం రాష్ట్రంలో తలెత్తబోయే సమస్యల విషయంలో ఒక కమిటీని వేయటం ద్వారా, సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందనే ప్రతిపాదనను ఆయన ఎందుకు ముందుకు తీసుకురాలేదు. ఆ మేరకు కాంగ్రెస్స్ అధిష్టానాన్ని ఎందుకు ఒత్తిడి చేయలేదు. ఏ ప్రలోభాలను చంద్రబాబు లొంగిపోయి, అధిష్ఠానం ముందు నోరు మెదపలేకపోయారు.



విభజన కార్యక్రమం ముగిసిన తరువాత ఇపుడు కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రాభివృద్ధికి 4,5 లక్షల కోట్ల నిధులు కావాలని, హైదరాబాద్ తరహాలో కొత్త రాజధానిని అభివృద్ధి చేయాలని ఆయన వ్యాఖ్యానించడం దేనికి నిదర్శనం? హైదరాబాద్ ఒక్క రోజుల్లోనే, ఒక్క సంవత్సరంలోనే అభివృద్ధిని సాధించిందా? ఆ విషయం చంద్రబాబుకు తెలియదా? అన్నిటికి మించి ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా కల్పించమని బాబుగారు మాట్లాడటం అందరిని విస్మయానికి గురిచేసింది. రెండు ప్రాంతాలలోను టి.డి.పి. ఉంటుందని ఆయన వ్యాఖ్యానిస్తున్నట్లుగానే, నేడు ఆయనకు కావాల్సింది కేవలం రాజకీయ లబ్ది మాత్రమేనా? తెలుగుజాతి సంక్షేమం కదా?

By
en-us Political News

  
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.