హరికృష్ణ తెదేపా వఖల్తా ఎందుకు పుచ్చుకొన్నట్లో

Publish Date:Aug 1, 2013

Advertisement

 

వైకాపా పెట్టిన ఫ్లెక్సీ బ్యానర్ చిచ్చుతో తెదేపాకు దూరమయి, పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్ననందమూరి హరికృష్ణ నిన్నజరిగిన పంచాయితీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ అవినీతి, అసమర్థ పార్టీలను త్రిప్పికొట్టి, తెలుగు దేశం పార్టీని గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇంత కాలం పార్టీ అంటే గిట్టనట్లు వ్యవహరించిన హరికృష్ణ, ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీ తరపున మాట్లాడటం ఆశ్చర్యం కలిగించినా, ఆయన తెదేపా ద్వారా తన రాజకీయ జీవితం కొనసాగించేందుకే ఆసక్తి చూపుతున్నందునే ఆవిధంగా మాట్లాడినట్లు అర్ధం అవుతోంది.

 

రాజ్యసభ సభ్యుడయిన హరికృష్ణ మరో తొమ్మిది నెలలలో జరగనున్నఎన్నికలలో ఈ సారి గన్నవరం నియోజక వర్గం నుండి శాసనసభకు పోటీచేసే ఆలోచన ఉన్నట్లు ఇదివరకు ఒకసారి తెలిపారు. బహుశః దానిని దృష్టిలో ఉంచుకొనే ఇప్పుడు మళ్ళీ పార్టీ తరపున మాట్లాడి ఉండవచ్చును. అయితే, మారిన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో తెదేపా తప్పని సరి విజయం సాదించాలంటే కేవలం గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్స్ ఇవ్వవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మరి తెదేపా ఆయనకు టికెట్ కేటాయించగలదని భావించలేము. అదీగాక రాష్ట్ర విభజన తరువాత, దాదాపు 140 సీట్లు మాత్రమే ఉండే అవకాశం ఉన్నందున టికెట్స్ కోసం పోటీ చాల అధికంగా ఉండబోతోంది. రానున్న ఎన్నికలలో గెలవడం తేదేపాకు ఎంత ముఖ్యమో వైకాపా, కాంగ్రెస్ పార్టీలకు కూడా అంతే ముఖ్యం గనుక వారి మధ్య చాల తీవ్రమయిన పోటీ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో హరికృష్ణ పార్టీ టికెట్ ఆశిస్తూ మళ్ళీ చంద్రబాబుకి దగ్గర కావాలని ప్రయత్నిస్తే మాత్రం ఆయనకు నిరాశ తప్పదు.

By
en-us Political News

  
తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.
కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి వ‌చ్చిన ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.
రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే.
తెలంగాణ‌లో కమలం పార్టీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది? రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌ అన్న‌దొక చ‌ర్చ‌.
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు.
అప్పట్లో అధికారపార్టీలో ఉన్న అనంతబాబుతో అధికారంలో ఉన్న వై ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైసీపీ సభ్యులు వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
2018 ఎన్నికల ప్రచార సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా ధాఖలు చేసిన పరువునష్టం కేసు సుల్తాన్ పూర్ లోని ప్రజాప్రతినిథుల ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.