సెల్ఫ్ అటాక్ వ్యూహం బూమరాంగ్..

Publish Date:Apr 14, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో చేసిందేమిటన్నది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన సర్కార్ పట్ల ప్రజా వ్యతిరేకత పీక్స్ చేరింది. ఆయన మనమంతా సిద్ధం బస్సు యాత్రలలోనైతేనేమి, ఆయన పార్టీ అభ్యర్థుల ప్రచారం కోసం జనం వద్దకు వెళ్లిన సందర్భాలలో అయితేనేమి.. వస్తున్న ప్రజా స్పందన చూస్తే ఆ విషయం స్పష్టంగా అవగతమైపోతోంది. ప్రజలకు, పరిశీలకులకే కాదు.. స్వయంగా జగన్ కు ఆయన పార్టీ నేతలకూ కూడా విషయం విస్పష్టంగా బోధపడింది. దీంతో ఓటమి దెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. ప్రజలలో ఎమోషన్లు పెచ్చరిల్లేలా చేయడమొక్కటే మార్గమని నిర్ధారణకు వచ్చేశారు. గత ఎన్నికలలో జనంలో సెంటిమెంట్ ఎమోషన్ ను రగిల్చి విజయం సాధించిన అనుభవం ఎలాగూ ఉండనే ఉంది. మరో సారి దానిమీదే అధారపడి సెకండ్ చాన్స్ కొట్టేద్దామని వైసీపీ అధినేత పక్కా ప్రణాళిక రచించారు. 
దీంతో గత ఎన్నికల ముందు సక్సెస్ అయిన కోడి కత్తి డ్రామానే మళ్లీ నమ్ముకున్నారు. ఈ సారి కోడికత్తికి బదులు గులకరాయి దాడి డ్రామాకు తెరతీశారు. జగన్ పై గులకరాయి దాడి, ఆ వెంటనే వైసీపీ సామాజిక మాధ్యమం వింగ్, ఆ పార్టీ నేతలు, చివరాఖరికి మెయిన్ స్ట్రీమ్ లోని కొన్ని ఆయన అనుకూల మీడియా సంస్థలు.. గులకరాయి దాడిని హత్యయత్నంగా అభివర్ణిస్తూ విస్తృత ప్రచారం చేసేశారు. ఆ పార్టీ నేతలు మైకుల ముందుకు, మీడియా ముందుకు వచ్చి దాడిని ఖండఖండాలుగా చీల్చి చెండాడేశారు. ఈ సారి కావలసినంత మైలేజి వచ్చేస్తుంది, మరో సారి అధికారం ఖాయమన్న భావనకు వచ్చేశారు. అయితే ఈ సారి ఆయన దాడి డ్రామా బూమరాంగ్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. 

గతంలో  అంటే గత ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో తన మీద జరిగిందని జనగ్ చెప్పుకున్న దాడి సమయంలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీంతో చంద్రబాబు అధికారంలో ఉండి, ఓటమి భయంతో తనపై హత్యయత్నం చేశారు అంటే జనం నమ్మారు. కానీ ఇప్పుడు జరిగిన గులకరాయి హత్యయత్నం సమయంలో అధికారంలో ఉన్నది స్వయంగా జగన్. ఆయనే ముఖ్యమంత్రి. అటువంటి జగన్ తన పై చంద్రబాబు గులకరాయితో హత్యయత్నం చేయించారని ఆరోపణలు చేస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. ఆయనకు భద్రతగా నిలవాల్సిన సెక్యూరిటీ సిబ్బంది సరిగ్గా దాడి సమయానికే కింద కూర్చుండి పోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో కరెంటు పోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. కరెంటు పోయింది సరే కనీసం ఫ్లడ్ లైట్లైనా ఎందుకు వేయలేదని నిలదీస్తున్నారు. అయినా చీకటి పడగానే బస్సులోకి వెళ్లిపోయే జగన్ దాడి జరిగిన రోజు మాత్రమే చీకటి పడినా, కరెంటు లేకపోయినా ఎందుకు బస్సుపైనే ఉండిపోయారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరిశీలకులు సైతం దాడి జరిగిన తీరును  చూస్తుంటే ఇది స్వయంగా జగన్ కోసం జగన్ చేత జగనే చేయించుకున్నారనిపిస్తోందని విశ్లేషణలు చేస్తున్నారు. మొత్తం మీద ఈ సారి గులకరాయి  హత్యాయత్నం ఆరోపణల డ్రామా బూమరాంగ్ అయ్యిందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ దాడి జగన్ పై సానుభూతి కలగడానికి బదులు ఏవగింపు కలగడానికి దోహదపడేలా కనిపిస్తోందని విశ్లేషణలు చేస్తున్నారు.  

చిలకలూరి పేట కూటమి సభ సందర్భంగా ప్రధాని పాల్గొన్న సభలో సైతం బట్టబయలైన భద్రతాలోపాలు, ఆ తరువాత పింఛన్ల పంపిణీ విషయంలో జగన్ పార్టీ ప్రదర్శించిన అత్యుత్సాహం, వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం నిర్ణయానికి తెలుగుదేశం ఒత్తిడే కారణం అంటూ చేసిన ప్రచారం అన్నిటినీ కలిపి చూస్తున్న జనం.. గెలవడం కోసం జగన్ ఎంతకైనా తెగించేస్తారన్న అభిప్రాయానికి వచ్చేశారు. అందుకే జగన్ పై గులకరాయి హత్యాయత్నానికి వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్రంలో జరిగిన ఆందోళనల్లో జనం భాగస్వామ్యం ఇసుమంతైనా కనిపించలేదు. జగన్ పార్టీ ఆస్థాన ఉపన్యాసకులు తమదైన భాషలో ప్రతిపక్ష పార్టీలు, నేతలపై చేసిన విమర్శలు వినా మరెవ్వరూ నోరెత్తలేదు. 

 అదే సమయంలో గతంలో  చంద్రబాబుపై రాళ్ల దాడి సందర్భంగా  గుడివాడ నాని అదే కొడాలి నాని, ఆర్కే రోజా, జోగిరమేష్, అంబటి రాంబాబు వంటి  ప్రత్యేక భాషలో ఆరితేరిన వైసీపీ నేతలు ఆ దాడి సింపతీ కోసం చంద్రబాబు చేయించుకున్న దాడిగా అభివర్ణిస్తూ చేసిన ప్రసంగాల క్లిప్పింగులను నెటిజన్లు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ చేస్తూ వైసీపీ డ్రామాపై తెగ సెటైర్లు గుప్పిస్తున్నారు. 
అలాగే బందరు నాని అదే పేర్ని నాని కడపు మండితే ఇలాంటి దాడులే జరుగుతాయి. ప్రజలను మోసం చేస్తే వారు రాళ్లు విసరక ఏం చేస్తారు అని గతంలో బాబుపై దాడి సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేస్తూ జగన్ పై నిజంగా దాడి జరిగి ఉంటే అది ప్రజాగ్రహమే కదా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా జగన్ పై దాడి జరిగిందని జనం ఇసుమంతైనా నమ్మడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    తెలుగుదేశం నేతలు కోడికత్తి 2.0 వెర్షన్ అంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు. ప్రజలను ఒక సారి మోసం చేయగలరు కానీ ప్రతిసారీ కాదని అంటున్నారు. 

 చిలకలూరి పేటలో  ప్రధాని పాల్గొన్న  కూటమి సభలో  తీవ్ర భద్రతా వైఫల్యాలపైనే కేంద్ర హోం శాఖ సీరియస్ గా ఉంది.  రాష్ట్రంలో డిజిపితో సహా 22 మంది పోలీస్ ఉన్నతాధికారులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు  చేశారు. దానిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే దృష్టిపెట్టింది. ఇప్పుడు సీఎం జగన్ పై గులకరాయి దాడి జరిగింది. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్‌   రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వివరణ కోరింది. గులకరాయి దాడి ఘటనతొ  వైసీపీ తనంత తానే రోకటిలో తలపెట్టి వేటు కోసం ఎదురు చూసే పరిస్థితిలో పడిందని పరిశీలకులు అం టున్నారు. సానుభూతి ఓట్ల మాట అటుంచి ఎన్నికల సంఘం చర్యలకు రెడీ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ పై దాడి జరిగిందని అటు జనమూ నమ్మడం లేదు...ఇటు ఎన్నికల సంఘమూ చర్యలకు సమాయత్తమౌతుండటంతో జగన్ పార్టీకి రెండిందాలా నష్టమేజరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.