సీమాంద్రాలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి లోక్ సభకు 333మంది, అసెంబ్లీకి 2241 అభ్యర్ధులు బరిలో ఉన్నారు. రేపు జరుగబోయే ఎన్నికలలో 3,67,62,975 మంది ఓటర్లు ఈ అభ్యర్ధుల భవితవ్యం తేల్చనున్నారు. రేపు జరుగబోయే ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ చాలా విస్త్రుత ఏర్పాట్లే చేసింది. 13 జిల్లాల్లో మొత్తం 40,708 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. వీటిలో 13వేల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. దాదాపు లక్షా ఇరవవేల మంది పోలీసులతో కనీ వినీ ఎరుగని రీతిలో చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మొట్టమొదటిసారిగా 84 హెలికాప్టర్లు, ఒక ఎయిర్ అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. ఇందులో 2 హెలికాప్టర్లను, ఎయిర్ అంబులెన్స్ను నక్సల్ ప్రభావిత ప్రాంతమయిన పాడేరు ప్రాంతానికి కేటాయించారు. అదేవిధంగా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలకు కూడా ప్రత్యేకంగా దాదాపు 60 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ఈ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీలయిన తెదేపా, వైకాపాలకు చాలా కీలకమయినవి గనుక ఆయా పార్టీల నేతలు, కార్యకర్తల నడుమ ఘర్షణలు చెలరేగే అవకాశం ఉండవచ్చనే ఆలోచనతోనే ఇంత భారీ భద్రత ఏర్పాటు చేయవలసి వస్తోంది.
ఇక రాష్ట్ర విభజన తరువాత ఒక సంధికాలంలో జరుగుతున్న ఈ ఎన్నికలలో ఎవరికి విజయం దక్కుతుందో తెలియని పరిస్థితుల్లో కూడా ఇంత మంది పోటీ చేయాలనుకోవడం విశేషమే. ఈ ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి ఆధిక్యత రానట్లయితే, అప్పుడు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసిన గెలిచినవారే కింగ్ మేకర్స్ అవుతారు. బహుశః అందుకే ఈ సారి ఇంతమంది బరిలో దిగి ఉండవచ్చును. అయితే ఈసారి ఇంతగా పోరాటం చేసిన తరువాత ఏ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన దానికి పెనుసవాళ్లు ఎదుర్కోక తప్పదు. ఆరు నూరయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక తప్పదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/seemandhra-39-33262.html
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.