సికిందరాబాద్.. విశాఖ వందేభారత్ రైలు.. ప్రయాణీకుల జోరు

Publish Date:Apr 11, 2026

Advertisement

తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న ప్రతిష్టాత్మక సెమీ హైస్పీడ్ రైలు  వందే భారత్ ఎక్స్‌ప్రెస్  అనూహ్య ఆదరణతో దూసుకుపోతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడుస్తున్న ఈ రైలు..  దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ప్రయాణికుల ఆదరణ పొందిన   రైలుగా సరికొత్త రికార్డు సృష్టించింది. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవడమే కాకుండా..  విమాన ప్రయాణానికి మించిన సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు వందేభారత్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

రైల్వే శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం..  సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ రైలు ఆక్యుపెన్సీ రేటు 100 శాతానికి పైగా నమోదవుతోంది. కొన్ని సందర్భాల్లో వెయిటింగ్ లిస్ట్ కూడా భారీగా ఉంటోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న ఇతర రైళ్లతో పోలిస్తే, సికిందరాబాద్, విశాఖ మార్గంలో నడిచే వందే భారత్ లో ప్రయాణానికే ప్రయాణీకులు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్గంలో ప్రయాణీకుల రద్దీ స్థిరంగా ఉంటోంది. ఇక పండుగలు, వారాంతపు సెలవు దినాల్లో సీట్ల కోసం నెలల ముందే బుకింగ్స్ పూర్తవుతున్నాయి.

ఈ రైలు విజయవంతం కావడానికి ప్రధాన కారణం ప్రయాణ సమయం తగ్గడమేనంటున్నారు రైల్వే అధికారులు. గతంలో విశాఖ చేరుకోవడానికి పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టేది, కానీ వందే భారత్  కేవలం 8 గంటల లోపు ప్రయాణీకులను గమ్యస్థానం చేరుస్తోంది. దీనితో పాటు నాణ్యమైన ఆహారం, మెరుగైన భద్రత, సుఖవంతమైన సీటింగ్ వ్యవస్థ ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈ రైలు సేవలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు.

ప్రయాణికుల నుండి వస్తున్న భారీ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, రైల్వే అధికారులు ఇప్పటికే ఈ మార్గంలో రెండో వందే భారత్ రైలును కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ రెండు రైళ్లు కూడా దాదాపు పూర్తి సామర్థ్యంతో నడుస్తుండటం తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న రవాణా అవసరాలను ప్రతిబింబిస్తోంది. దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై రూట్లలో నడిచే వందే భారత్ రైళ్ల కంటే కూడా సికింద్రాబాద్-వైజాగ్ రూట్‌కే ప్రయాణికులు బ్రహ్మరథం పడుతున్నారు.

భవిష్యత్తులో ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సమాయత్తమౌతోంది.  ముఖ్యంగా బోగీల సంఖ్యను పెంచడం లేదా మరిన్ని స్టాపేజీలు,  సమయపాలన వంటి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ మరిన్ని వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచిస్తున్నది. రానున్న రోజుల్లో ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల హవా మరింత పెరగనుందని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
తమ డబ్బు గురించి అడగడంతో ఒత్తిడి, బెదిరింపులు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆక్సిడెంట్ చేసి చంపిస్తాం అంటూ మంగ్లీ అనుచరులు బెదిరించారని సుబ్బారావు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కెన్యా నుంచి వచ్చిన 24 మంది మహిళలు సాధారణ ప్రయాణికుల్లా విమానం దిగారు. కస్టమ్స్ తనిఖీలను తప్పించుకోవాలనే ఉద్దేశంతో బురఖాలు ధరించి బంగారాన్ని బ్యాగుల్లో దాచారు. అనుమానం రాకుండా నెమ్మదిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా జరపాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి అధికారిక ఆహ్వానం పంపినట్లు సమాచారం.
యుద్ధం సృష్టించిన మానవ విషాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఇరాన్ ప్రతినిధి బృందం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు చెందిన రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, వారి ఛాయాచిత్రాలను తమ వెంట తీసుకువచ్చింది.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు మొత్తం 13,95,43,231 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. 2024-25 కాలంలో 12,18,53,535 లడ్డూలు అమ్ముడవగా, కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే అదనంగా సుమారు 1.76 కోట్ల లడ్డూల విక్రయాలు పెరగడం గమనార్హం.
ఐలాపురంలోని సర్వే నంబర్ 101లో సుమారు 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో గత కొంతకాలంగా అక్రమార్కులు పాగా వేసి నివాసాలను, బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమారు 400 గజాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఒక బిల్డర్ ఆరంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న హైడ్రా బృందం, భారీ పోలీసు బందోబస్తు నడుమ ఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతలు చేపట్టింది.
ఖాజీపేటలో ఒక విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలవ్వగా, రాజూపాలెం మండలంలో పాత కక్షలు ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఈ రెండు ఘటనలు జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితికి, యువతలో పెరుగుతున్న హింసా ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి.
202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చిన అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి, ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, అండర్-19 ప్రతిభావంతులు మెగా లీగ్‌లో అనుభవజ్ఞులను అధిగమిస్తూ, కీలకమైన మ్యాచుల్లో విజయావకాశాలను మారుస్తూ రికీ పాంటింగ్ వంటి కోచ్‌ల ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా ఐపీఎల్ ప్లాట్‌ఫారమ్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కుర్రాడు ముకుల్ చౌదరి అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు.
మహిళా భద్రతకు మరింత బలం చేకూర్చేలా షీ నేత్ర పేరిట ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. నగర కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం ఏడు ప్రత్యేక టీమ్స్‌ను రంగంలోకి దించారు.
మదీనా కాలనీలో ఉన్న సలామి కోల్డ్ స్టోరేజ్‌ లో కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కనీస పారిశుద్ధ్యం లేకుండా, మాంస వ్యర్థాలను నిల్వ ఉంచినట్లుగా అధికారులు గుర్తించారు.
గతంలో బడ్జెట్ లీక్ అయితే 30 మంది మంత్రులు రాజీనామా చేశారని, ఎన్టీఆర్ ఎవరూ లేకుండా 15 రోజులు ప్రభుత్వాన్ని నడిపారని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే. పేపర్ లీక్ కేసులో గతంలో ఓ మంత్రి రాజీనామా చేసిన విషయాన్నీ ప్రస్తావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.