రాజుకుంటున్న వర్గీక‘రణం’

Publish Date:Jul 28, 2016

Advertisement

దళితుల కోసం కేటాయించిన రిజర్వేషన్లలో వర్గీకరణ జరగాలంటూ గత రెండు దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమం మరోసారి తెరమీదకు వచ్చింది. తెలంగాణ ఉద్యమకాలంలో కాస్త నిద్రాణంగా ఉన్న ఈ ఆకాంక్ష ఇప్పుడు మళ్లీ వినిపించడం మొదలైంది. వర్గీకరణ జరగాలన్న నినాదంతో మంద కృష్ణమాదిగ దిల్లీలో మరోసారి ధర్నా చేపట్టడంతో దేశమంతా అటువైపుగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది.


బీసీలలో వివిధ కులాల వెనుకబాటుతనాన్నీ, జనాభా నిష్ఫత్తినీ దృష్టిలో ఉంచుకుని వారికి లభించే రిజర్వేషన్లను వేర్వేరుగా విభజించారు. దాని వల్ల ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కిందన్న తృప్తి ఉంది. కానీ ఇదే తరహా వర్గీకరణను దళితులలో ఎందుకు చేపట్టకూడదన్నదే మాదిగల ప్రశ్న. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రెండు దశాబ్దాల క్రితమే రామచంద్రరాజు కమిషన్‌ను నియమించారు. కమిషన్‌ నివేదిక వర్గీకరణకు అనుకూలంగా రావడంతో కొన్నాళ్లపాటు దాని అమలు కూడా జరిగింది. అయితే చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా ఈ వర్గీకరణ ఉందంటూ సుప్రీంకోర్టు ఆక్షేపించడంతో వర్గీకరణ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.


మందకృష్ణ మాదిగ నేతృత్వం వహిస్తున్న మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (యం.ఆర్‌.పి.ఎస్‌) ఈ వర్గీకరణ కోసం గట్టిగా పట్టుబడుతోంది. మరోవైపు ఆర్‌.కృష్ణయ్య వంటి నేతల నేతృత్వంలో ఉన్న మాల సంఘాలు వర్గీకరణకు వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని విప్పుతున్నాయి. కృష్ణయ్య ఏకంగా మరో అడుగు ముందుకు వేసి, తన డిమాండ్లను నెరవేర్చుకునేందుకు రాజకీయ నేతలతో సైతం జట్టు కట్టారు. ఇరు వర్గాలూ తమకు అనుకూలమైన వాదనలకే కట్టుబడి ఉండటంతో సమస్య జటిలమైపోయింది. పరస్పర అంగీకారంతోనూ, చర్చలతోనూ ముందుకు సాగాల్సిన పరిష్కారం కాస్తా పీటముడిగా మారిపోయింది.


ఈ సమయంలో పార్లమెంటులో వర్గీకరణకు అనుకూలంగా చట్టాన్ని చేసే ధైర్యం ఎవరు చేస్తారన్నది సందేహమే! అలాంటి ధైర్యంతో ముందుకు సాగితే కనుక, తెలుగు రాష్ట్రాలలోని దళితులలో అధికశాతం ఉన్న మాలల ఆగ్రహానికి సదరు పార్టీలు గురి కావలసి ఉంటుంది. మరోవైపు మాలల జనాభా అధికం అన్న కారణంతోనే వర్గీకరణ జరగాలంటూ మాదిగలు పట్టుబడుతున్నారు. బి.సిలలో ఇలాంటి వర్గీకరణ జరిగినప్పుడు ఎలాంటి అశాంతీ తలెత్తలేదని గుర్తు చేస్తోంది యం.ఆర్‌.పిఎస్! వర్గీకరణే కనుక లేకపోతే దళితులలో మరింత దయనీయమైన స్థితిలో ఉన్న పాకి వంటి ఉపకులాలవారు ఎప్పటికీ రిజర్వేషన్ల ఫలాలను అందుకోలేరని హెచ్చరిస్తోంది.


ఏది ఏమైనా మరోసారి ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ సమస్య వార్తల్లోకి వచ్చింది. దిల్లీలో మంద కృష్ణ మాదిగ సాగించిన నిరసన కార్యక్రమాలలో పాల్గొన్న యెండ్లూరి సుధాకర్‌ వంటి మేధావులు మాలల అభ్యంతరాల మీద విరుచుకుపడ్డారు. మరోవైపు మాలలు మాత్రం వర్గీకరణ పేరుతో దళితులలో చీలిక తీసుకు రావడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. పైగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జనాభా సమీకరణలు, నాయకత్వాలు ఒక్కసారిగా మారిపోయాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణ ఉద్యమం అంత బలంగా లేదనీ, ఇటు తెలంగాణలో మాదిగల సంఖ్యే ఎక్కువగా ఉందనీ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చే వాదనలలో మళ్లీ మార్పు తప్పదు. దాంతో ఈ సమస్య అసలు పరిష్కారం అవుతుందా అని ఎదురుచూడటం తప్ప చేయగలిగిందేమీ లేదు. ఏది ఏమైనా ఒకటిగా ఉండాల్సిన మాలమాదిగలు ఇలా వర్గీకరణ పేరుతో కత్తులు దూసుకోవడం మాత్రం బాధాకరం!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.