సడలిన "ఉక్కు" సంకల్పం

Publish Date:Jul 27, 2016

Advertisement

16 ఏళ్లు పచ్చి మంచి నీళ్లు తాగలేదు..అమ్మను చూడలేదు..ఇంటిముఖం తెలియదు...డాక్టర్ అవ్వాలనుకుంది..ఉక్కు మహిళగా మారింది, ఆమె ఎవరో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. ఆవిడే ఇరోమ్ షర్మిల. మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ 16 ఏళ్లు పాటు చేసిన దీక్షకు ముగింపు పలకాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆగస్టు 9న తన దీక్షను విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఆత్మహత్యాయత్నం ఆరోపణలపై ఇంఫాల్ కోర్టులో విచారణకు హాజరైన షర్మిల..నిరాహారదీక్ష వల్ల సాధించేది లేదని భావిస్తున్నందున వివాదాస్పద ఏఎఫ్ఎస్‌సీఏ చట్టం రద్దుకోసం త్వరలోనే రాజకీయాల్లోకి చేరనున్నట్టు ప్రకటించారు. 

 

కల్లోల ప్రాంతాలుగా ఉన్న అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, త్రిపురలలో పరిస్థితుల్ని అదుపు చేయడం కోసం సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని భారత పార్లమెంట్ 1958 సెప్టెంబర్ 11న ఆమోదించింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని జమ్మూకాశ్మీర్‌కు కూడా వర్తింపజేస్తూ సాయుధ దళాల(జమ్మూకశ్మీర్) ప్రత్యేకాధికారాల చట్టం..1990 అమల్లోకి వచ్చింది. ఈ చట్టం భారత సాయుధ దళాలకు విస్తృతాధికారాలను కల్పించింది. కనిపిస్తే కాల్చివేతకు, ఏ సాకుతోనైనా, ఎవరినైనా అరెస్ట్ చేసేందుకు, ఎటువంటి వారెంట్ లేకుండానే సోదాలు నిర్వహించే అవకాశం సైన్యానికి దక్కింది. అయితే ఈ అధికారాన్ని సైన్యం దుర్వినియోగం చేస్తున్నట్టు ఎప్పటి నుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం మాటున సైన్యం మానభంగాలు, చిత్రహింసలు, పౌరుల్ని విచక్షణారహితంగా కాల్చివేయడం లాంటి చర్యలకు పాల్పడింది. ఈ చట్టం ఆసరాతో అక్రమాలకు పాల్పడిన సైనికుల్ని అరెస్ట్ చేయడం గాని, ఎటువంటి విచారణకైనా గురిచేయడానికి కాని అవకాశం లేదు.

 

ఈ నేపథ్యంలో 2000 నవంబర్‌లో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు సమీపంలోని మాలమ్‌లో బస్టాప్‌లో నిలబడిన 10 మందిని అస్సామ్ రైఫిల్స్ దారుణంగా కాల్చిచంపింది. మృతుల్లో 62 ఏళ్ల మహిళతో పాటు..సినామ్ చంద్రమణి అనే జాతీయ సాహస బాలల అవార్డు అందుకున్న యువతి కూడా ఉంది. ఈ ఘటన షర్మిల జీవితాన్ని మలుపు తిప్పింది. కనీస విచారణ లేకుండా సైన్యం అంతటి దారుణానికి పాల్పడటంపై తీవ్రంగా చలించిన షర్మిల..ఇందుకు కారణమైన సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ దీక్ష ప్రారంభించారు. ఆహారాన్ని తీసుకోకపోవటం మాత్రమే కాదు..ఈ చట్టాన్ని రద్దు చేసేంతవరకు అద్దంలో మొహం కూడా చూసుకోనని, జుట్టును కూడా ముడివేయనని, చివరికి తన తల్లిని కూడా చూడనని తనకు తాను కట్టుబాట్లు విధించుకున్నారు.

 

అలా ఒకరోజు, రెండు రోజులు కాదు ఏకంగా 16 సంవత్సరాల పాటు అన్నపానీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆమెను ఇంఫాల్‌లోని జేఎన్ ఆసుపత్రిలో ఉంచి ముక్కులోపలి నుంచి గొట్టాల ద్వారా ద్రవాహారం అందిస్తున్నారు. అప్పటి నుంచి ఆసుపత్రినే జైలుగా మార్చి అందులోనే షర్మిలనునిర్భందించారు. 16 ఏళ్ల ఈ నిరసన కాలంలో ఆమె ఇంతవరకు తన ఇంటికి వెళ్లనప్పటికీ ఒక్కసారి మాత్రం యాదృచ్ఛికంగా తన తల్లిని కలిశారు. 2009లో ఆమె తల్లి సఖీదేవిని అనారోగ్య కారణాలతో షర్మిల ఉన్న ఆసుపత్రిలోనే చేర్చడంతో తల్లీకూతుళ్లు ఒకరినొకరు చూసుకున్నారు. అంతే తప్ప తనకు తానుగా తల్లిని చూడకపోవడం షర్మిల మొండిపట్టుదలకు నిదర్శనం.

 

2004లో 30 మంది షర్మిల మద్ధతుదారులు ఢీల్లిలోని అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం వద్ద నగ్నంగా నిరసన చేశారు. దీంతో ఈ విషయం అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల చెవిన పడింది. అనేక మంది నోబెల్ బహుమతి అవార్డు గ్రహీతలు, అమ్మెస్టీ ఇంటర్నేషనల్, అన్నాహజారే వంటి సామాజిక వేత్తలు షర్మిల దీక్షకు మద్ధతు పలికారు. అయినా ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయించలేకపోయారు. రోజులు గడుస్తున్నా..ప్రభుత్వ వైఖరిలో ఏ మార్పు లేకపోవడం, ప్రజలు, ప్రజాసంఘాల మద్ధతు కరువువ్వడంతో తన దీక్షను విరమించి రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు షర్మిల.

 

దీనిలో భాగంగా 2017లో జరిగే మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని..వివాహం చేసుకుంటానని ఆమె ప్రకటించారు. ఇరోమ్‌‌ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే తృణమూల్ కాంగ్రెస్, సీపీఎంలు కోరాయి. ఈ ప్రతిపాదనను ఆమె నిరాకరించారు. 28 సంవత్సరాల వయసున్నపుడు దీక్ష ప్రారంభించిన షర్మిలకు ఇప్పుడు 44 సంవత్సరాలు. బహుశా వయసు మీద పడుతుండటం, మునుపటి శక్తి లేకపోవడం కూడా ఆమె దీక్ష విరమణకు కారణం కావచ్చు. ఏది ఏమైనా ప్రపంచంలోనే అత్యంత సుధీర్ఘకాలం పాటు నిరాహార దీక్ష చేసి ఇప్పుడు ఉన్నపళంగా దీక్ష విరమణ చేయడం కుటుంబీకులు, పోరాట సహచరులు సహా యావత్ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.