కొడాలి నాని గుండా గిరీ...ఆర్ఐపై ఇసుక మాఫియా దాడి!

Publish Date:Apr 22, 2022

Advertisement

గుడివాడ మండలంలో ఇసుక మాఫియా వీరంగం సృష్టించింది. ఏకంగా ఆర్ఐ మీదే దాడికి యత్నించింది. సకాలంలో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఆర్ఐ ప్రాణాలతో బైటపడ్డారు. వైకాపా దన్నుతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా గుడివాడ అంటే అక్కడ వైకాపా మాజీ మంత్రి కొడాలి నానిదే హవా!

వాస్తవానికి ఆర్ఐపై దాడి చేసినది నానీ గ్యాంగేనని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. సంఘటన జరిగిన తీరును బట్టి అధికార పార్టీ దన్ను లేకుండా ఈ దాడి జరిగే అవకాశమే లేదని అంటున్నారు. 
ఇంతకీ అసలేం జరిగిందంటే... 
కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామ పరిధిలోని అక్రమ ఇసుక మాఫియా  రాత్రివేళలలో కాల్వల వెంట అక్రమంగా ఇసుకను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మేరకు  ఆర్ఐ అరవింద్ అక్కడకు ఇద్దరు సిబ్బందిలో  వెళ్లారు. అక్రమ ఇసుక తరలింపును, తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మాఫియాదారులు ఆర్‌ఐను అడ్డుకోవటమే కాకుండా దాడికి దిగారు. ఏకంగా జేసీబీతో తొక్కించే ప్రయత్నం చేశారు. జేసీబీతో పక్కకు నెట్టివేశారు. సరిగ్గా అదే సమయానికి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దీంతో మాఫీయా గ్యాంగ్ పలాయనం చిత్తగించింది. ఈ దాడిపై  ఆర్ఐ  అక్రమ ఇసుక తవ్వకాలను  ను అడ్డుకొనేందుకు ఇద్దరు సిబ్బందితో తాను వెళ్లానని,  తనపై  పలువురు   దాడికి దిగారని, జేసీబీపీ  జేసీబీతో నెట్టివేసే ప్రయత్నం చేశారన్నారు.   ఆర్ఐపై దాడికి  పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
ఇక తెలుగుదేశం ముఖ్యమంత్రి అండతోనే  ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదని ఆరోపణలు చేస్తున్నారు. కొడాలి నాని ప్రత్యక్ష ప్రమేయంతోనే మాఫియా గుడివాడ మండలంలో రెచ్చిపోతున్నదన్నారు. మంత్రి పదవి పోయిన తరువాత పశువుల కొట్టంలో కాలం వెళ్లదీస్తున్నానని చెబుతున్న కొడాలి చేస్తున్నది ఇసుక అక్రమ దందాయేనని విమర్శిస్తున్నాయి. కాగా ఆర్ఐపై దాడి జరిగిన స్థలాన్ని తెలుగుదేశం నాయకులు పరిశీలించారు. వైకాపా అండతోనే, వారి దన్నుతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని, అధికారులపై దాడులకు సైతం వెరవడం లేదని ఆరోపించారు.   ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు గుడివాడలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 

గత నెళ్లాళ్లుగా అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోలేదనీ, కొడాలి నాని, ఆయన అనుచరుల అరాచకాలకు హద్దు, అడ్డు, అదుపూ లేకుండా పోయిందనీ, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారని తెలుగుదేశం ఆరోపించింది. 

By
en-us Political News

  
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.
స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా? అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు.
ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత ఇటీవల పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భూముల వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
గత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నారా బ్రహ్మణి తొలి సారిగా ప్రజల మధ్యకు వచ్చి అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో తమకు ఎదురే లేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలు, అప్పటి తన కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవించక తప్పడం లేదు.
సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.