కొడాలి నాని గుండా గిరీ...ఆర్ఐపై ఇసుక మాఫియా దాడి!

Publish Date:Apr 22, 2022

Advertisement

గుడివాడ మండలంలో ఇసుక మాఫియా వీరంగం సృష్టించింది. ఏకంగా ఆర్ఐ మీదే దాడికి యత్నించింది. సకాలంలో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఆర్ఐ ప్రాణాలతో బైటపడ్డారు. వైకాపా దన్నుతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా గుడివాడ అంటే అక్కడ వైకాపా మాజీ మంత్రి కొడాలి నానిదే హవా!

వాస్తవానికి ఆర్ఐపై దాడి చేసినది నానీ గ్యాంగేనని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. సంఘటన జరిగిన తీరును బట్టి అధికార పార్టీ దన్ను లేకుండా ఈ దాడి జరిగే అవకాశమే లేదని అంటున్నారు. 
ఇంతకీ అసలేం జరిగిందంటే... 
కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామ పరిధిలోని అక్రమ ఇసుక మాఫియా  రాత్రివేళలలో కాల్వల వెంట అక్రమంగా ఇసుకను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మేరకు  ఆర్ఐ అరవింద్ అక్కడకు ఇద్దరు సిబ్బందిలో  వెళ్లారు. అక్రమ ఇసుక తరలింపును, తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మాఫియాదారులు ఆర్‌ఐను అడ్డుకోవటమే కాకుండా దాడికి దిగారు. ఏకంగా జేసీబీతో తొక్కించే ప్రయత్నం చేశారు. జేసీబీతో పక్కకు నెట్టివేశారు. సరిగ్గా అదే సమయానికి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దీంతో మాఫీయా గ్యాంగ్ పలాయనం చిత్తగించింది. ఈ దాడిపై  ఆర్ఐ  అక్రమ ఇసుక తవ్వకాలను  ను అడ్డుకొనేందుకు ఇద్దరు సిబ్బందితో తాను వెళ్లానని,  తనపై  పలువురు   దాడికి దిగారని, జేసీబీపీ  జేసీబీతో నెట్టివేసే ప్రయత్నం చేశారన్నారు.   ఆర్ఐపై దాడికి  పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
ఇక తెలుగుదేశం ముఖ్యమంత్రి అండతోనే  ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదని ఆరోపణలు చేస్తున్నారు. కొడాలి నాని ప్రత్యక్ష ప్రమేయంతోనే మాఫియా గుడివాడ మండలంలో రెచ్చిపోతున్నదన్నారు. మంత్రి పదవి పోయిన తరువాత పశువుల కొట్టంలో కాలం వెళ్లదీస్తున్నానని చెబుతున్న కొడాలి చేస్తున్నది ఇసుక అక్రమ దందాయేనని విమర్శిస్తున్నాయి. కాగా ఆర్ఐపై దాడి జరిగిన స్థలాన్ని తెలుగుదేశం నాయకులు పరిశీలించారు. వైకాపా అండతోనే, వారి దన్నుతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని, అధికారులపై దాడులకు సైతం వెరవడం లేదని ఆరోపించారు.   ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు గుడివాడలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 

గత నెళ్లాళ్లుగా అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోలేదనీ, కొడాలి నాని, ఆయన అనుచరుల అరాచకాలకు హద్దు, అడ్డు, అదుపూ లేకుండా పోయిందనీ, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారని తెలుగుదేశం ఆరోపించింది. 

By
en-us Political News

  
కాకినాడ జిల్లాలోని రంగరాయ వైద్య కళాశాల్లో లైంగిక వేధింపుల ఘటనపై నలుగురు ఆర్ఎంసి ఉద్యోగులు సస్పెన్షన్ విధించారు.
రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పరిపాలన అంశాలను సీఎం గవర్నర్‌కు వివరించారు.
మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట లభించింది. 2014 లో ఆమెపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కోర్టు కొట్టివేసింది.
నంద్యాల శిల్పం సైకిలెక్కనుందా? అన్న టాక్ వినిపిస్తోంది. కారణం.. ఆయన ఓడిపోయినప్పటి నుంచీ వైసీపీ అంటేనే చిన్న చూపు ఏర్పడిందట. అంతే కాదు.. ఎప్పుడో ఎక్కడో ఒక సారి పార్టీ ఆఫీసుకు వచ్చి వెళ్తున్నారట. దీంతో నంద్యాలలో పార్టీ క్రమంగా పట్టు తప్పుతున్నట్టు ఇంటర్నల్ టాక్.
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కల్తీ కల్లు ఘటనకు బాధ్యుడిగా, ఎక్సైజ్ సీఐ వేణు కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య మూడో టెస్టులో టీమిండియా పేసర్ల విజృంభణతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్ 387 పరుగులకు ఆలౌట్ అయింది.
తెలంగాణలో ఈనెల 14న తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ఉంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
బిగ్ బ్యూటిఫుల్ బిల్‌పై ఇటీవల సంతకం చేసిన అమెరిక అధ్యక్షుడు ట్రంప్ భారత్ సహా ఇతర దేశాలకు మరో షాక్ ఇచ్చారు. వీసా ఫీజులను భారీగా పెంచారు. ఈ ఫీజు వల్ల భారతీయులపై సైతం తీవ్ర ప్రభావం చూపనుంది.
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప ఎస్సీ కాలనీలో కుక్కల దాడిలో క్రిందపడి చిన్నారి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
అధికారంలో ఉన్నంత కాలం తప్పొప్పులు, మంచిచెడులు అన్న తేడా లేకుండా ఇష్టారీతిగా బూతులుతో రెచ్చిపోయిన మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడాలి నాని, వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత మాట్లాడడమే మరిచిపోయాడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేంత నిశబ్దాన్ని.. అదేనండీ మౌనాన్ని పాటిస్తున్నారు.
ఆపరేషన్ కగార్ దెబ్బకు మవోయిస్టులు దిగివచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ ఎదుట 22 మంది మవోలు లోంగిపోయారు. వీరిలో 8 మంది మహిళలు ఉన్నారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్‌ భార్గవ సిట్‌ ఎదుట హాజరయ్యారు. తన అనారోగ్యం రీత్యా రాలేనని సిట్ విచారణకు హాజరుకాలేనని ఉదయం ఆయన విచారణాధికారులకు సమాచారం పంపించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఇవ్వడం తమ విజయమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పందించారు. బీసీ రిజర్వేషన్లు కవితకు ఏం సంబంధం అని ప్రశ్నించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.