సజ్జల గారూ ఇదేంటి సారూ..

Publish Date:Apr 22, 2022

Advertisement

రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే,అందులో పెద్దగా తప్పు పట్టవలసింది ఉండదు.అయితే,రాజకీయ నేతలు,ముఖ్యంగా అధికార పార్టీ నేతలు,అందునా ప్రభుత్వ ముఖ్య సలహదారు హోదాలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సర్వం తానై చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వ్యక్తి, తమ ప్రభుత్వం వైఫల్యాలు అన్నిటికీ, ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష నాయకుడే బాధ్యుడు అంటే, అది చెప్పే వాళ్ళకు ఎలా ఉన్నా, వినేవాళ్ళకు, కొంచెం చాలా అసహ్యంగా, అసభ్యంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు, ఓ వంక స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తమకు తెలిసిన ‘పవిత్ర’ భాషలో ప్రతిపక్ష పార్టీలు, తమను ఏమీ పీ...లేవని అంటుంటే, ముఖ్యసలహాదారు,అన్నీ ప్రతిపక్ష నేత పుణ్యమే అనడం ఏమిటో అన్న ప్రశ్న పబ్లిక్ నుంచి వినవస్తోంది.  
పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది. నిజానికి అదేమి పెద్ద విషయం కాదు. ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు చుసుకుంటారు.కానీ, పోలవరం డయాఫ్రం వాల్ ఎందుకు దెబ్బతిన్నది, ఎందుకు మరమత్తులు చేయడం లేదు అంటే అందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కారణమని, సజ్జల సమాధానం ఇవ్వడం ఏమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో, చంద్రబాబు రైతులకు త్వరగా  నీళ్లివ్వడానికి వేగంగా పనులు చేయించారని, అందుకే ఇప్పుడు డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని సజ్జల చెబుతున్నారు.అదే నిజమని అనుకున్నా, మూడేళ్ళుగా అధికారంలో ఉన్న శ్రీ సజ్జల వారి సర్కార్ ఏమి చేస్తోందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు డయాఫ్రం వాల్ ఎలా కట్టాలో నిపుణులకు కూడా తెలియడం లేదని ఆయన చెబుతున్నారు.అంటే మూడేళ్ళుగా పోలవరం పనులను ప్రభుత్వం పట్టించుకోనే లేదని సజ్జల చెపుతున్నారా, ఆనే ప్రశ్న కూడా వినవస్తోంది. అందుకే తమ ప్రభుత్వ వైఫల్యాలకు, చేతకాని తనానికి   చంద్రబాబు నాయుడే కారణమని చెప్పడం విడ్డూరంగానే కాదు, వినేందుకు వికారంగానూ ఉందని సామాన్యులు అంటున్నారు.  
అలాగే సజ్జల ప్రతిపక్షాల పై చేస్తున్న రాజకీయ విమర్శలు కూడా గీత దాటుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన విశేష రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్న ప్రతిపక్షనేత  చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ నాయకుని పట్టుకుని,ఆయన ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని అనడం సజ్జల స్థాయికి తగదని విమర్శకులు అంటున్నారు. నిజానికి, మీడియా స్వేచ్చను కూడా హరించి వేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం విపక్షాల పై దుపు తప్పి విమర్శలు చేయడం వలన ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారుతుందని మాజీ మంత్రులు సహ వైసీపీ సీనియర్ నాయకులు కూడా, ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.  
నిజానికి,సజ్జల రామకృష్ణా రెడ్డి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు కాదు, పార్టీలోనూ పదవులు ఉన్నా ఆయన ప్రధానంగా ప్రభుత్వ సలహదారు మాత్రమే.నిజానికి, జగన్ రెడ్డి ప్రభుత్వంలో అలాంటి సలహాదారులు చాలా మందే ఉన్నారు.అందు లో ఒకటీ అరా పేర్లు తప్పించి, మిగిలినవారు ఎవరో, ఏమి చేస్తుంటారో కూడా ఎవరికీ తెలియదు. మరో వంక సంబందిత శాఖలకు మంత్రులున్నారు. అయినా తగుదునమ్మాఅని అన్నిటికీ సజ్జల ఒక్కరే ఎందుకు సీన్’లోకి వస్తారు, అనే ప్రశ్నకూడా వినవస్తోంది. నిజానికి,సజ్జల వ్యవహర సరళి పట్ల  ఇటు మంత్రులు,అధికారులలో,అదే విధంగా పార్టీ నాయకులు కార్యకర్తలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్త మవుతోందని అంటున్నారు. ముఖ్యమంత్రికి తమకు మధ్య అడ్డుగోడలు కడుతున్నారనే అభియోగం అన్ని విపుల నుంచి వినవస్తోంది.ఈ నేపధ్యంలోనే మీడియా వర్గాల్లో సజ్జల రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు,అనే చర్చ జరుగుతోంది. అంతే కాదు, సజ్జల వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా పార్టీని, ప్రభుత్వాన్ని తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ముందు ముందు ముఖ్యమంత్రికే ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కూడా గుసగుసలు పోతున్నట్లు తెలుస్తోంది.అయితే జగన్మోహన్ రెడ్డికి  కూడా అన్నీ తెలుసునని, అయినా ఆయన సజ్జలకు చెక్ పెట్టే సమయం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు.

By
en-us Political News

  
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.
స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా? అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.