మే 1 నుంచి 15 వరకూ తిరుమలలో బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు.. సిఫారసు లేఖలకు నో

Publish Date:Apr 28, 2025

Advertisement

వేసవి సెలవులు కావడం, ఇంటర్ టెన్త్ పరీక్షా ఫలితాల విడుదల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. మరీ ముఖ్యంగా వారాంతాలలో అయితే తిరుమల కొండపై ఇసుక వేస్తే రాలనంతగా భక్త జనసందోహం ఉంటోంది. ఎలా చూసినా సగటున రోజుకు 80 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో  తిరుమల తిరుపతి దేవస్థానం.. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలగకూడదు, వారికి స్వామి వారి దర్శనం త్వరితగతిన చేయించాలన్న లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1 నుంచి 15వ తేదీ వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు విధించింది.   నేరుగా వచ్చే ప్రోటోకాల్  వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయించింది.  ఎమ్మెల్యే, ఎంపీ ఇతర అధికార, ప్రముఖుల సిఫారసు లేఖలతో వచ్చేవారికి బ్రేక్ దర్శనాలకు కల్పించరాదని నిర్ణయించింది. అంటే ఎటువంటి సిఫారసు లేఖలను పరిగణనలోనికి తీసుకోదన్న మాట. అయితే  శ్రీవాణి, డోనర్స్ దర్శనాలు యథావిధిగా అమలు అవుతాయి.  

గత ప్రభుత్వ హయాంలో తిరమలకు వచ్చే వీఐపీలకు అనువుగా బ్రేక్ దర్శనాలను మార్పు చేశారు. అప్పటి వరకు ఉన్న ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాల స్థానంలో  ప్రోటోకాల్, రెఫెరల్, జనరల్ గా మార్పు చేశారు. అదే విధంగా దర్శన సమయాన్ని కూడా మార్పు చేశారు.  వైసీపీ హయాంలో వేకువ జామున 5 గంటల నుంచి ఉన్న దర్శన సమయాన్ని ఉదయం 7.30 గంటలకు జనరల్ దర్శనం 10 గంటల కు ప్రోటోకాల్.. శ్రీవాణి... రెఫరల్, డోనార్స్, ఎంప్లాయిస్ ను అనుమతిస్తారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే బ్రేక్ మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. దీంతో సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనానికి తీవ్ర ఆలస్యం జరిగేది. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొలువుదీరిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆ దర్శన వేళల్లో మార్పు చేసింది.  టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తొలి బోర్డు సమావేశంలో నే దర్శన సమయాన్ని మార్పు చేస్తామని ప్రకటన చేశారు. మే నెల 1 నుంచి 15 వరకు రద్దీ పెరుగుతున్న తరుణంలో ప్రయోగాత్మకంగా దర్శన సమయాన్ని మార్పు చేయనుంది. మే 15 వరకు ఉదయం 6 గంటలకు ప్రోటోకాల్ దర్శనం అమలు చేయనున్నారు. దీని పై భక్తుల అభిప్రాయాలు సేకరించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.

By
en-us Political News

  
పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని రాజ్యసభ నేత కపిల్ సిబల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉపా చట్టాన్ని ఉపయోగించాలని ఆయన సూచించారు.
భారత్‌, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ నేటి నుంచి పున:ప్రారంభం కానుంది. పఠాన్‌ కోట్‌, జమ్ములో పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడుల నేపథ్యంలో మే 8న ధర్మశాలలో దిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో.. తొమ్మిది రోజుల అనంతరం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పునఃప్రారంభం కానుంది.
ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. 138 దేశాలతో పోటీపడి ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలవడంపై సీవీ ఆనంద్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబుకు హైదరాబాద్‌ నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. 2017లో కాళేశ్వరం ప్రాజెక్టుకు భూసేకరణ సమయంలో ఆయనపై నమోదైన కేసును కొట్టిసింది.
విజయవాడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ వల్లభనేని వంశీకి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. వివిధ కేసుల్లో రిమాండ్‌ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీ మీద తాజాగా మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. గన్నవరంలో భారీగా అక్రమ మైనింగ్‌ కేసుకు పాల్పడ్డారని ఆరోపణల మీద ఒక కేసు, నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలతో మరో కేసును నమోదు చేశారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ... ఇస్రో శ్రీహరికోట నుంచి ఇప్పటివరకు 100 రాకెట్లను ప్రయోగించింది. 101వ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. విజయం పరంపరంలో కొనసాగుతున్న ఇస్రో ఈ ప్రయోగాన్ని కూడా విజయవంతం అయ్యేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారు.
మిస్ వరల్డ్ పోటీల సందర్బంగా హైదరాబాద్ సచివాలయం దగ్గర కలకలం చోటుచేసుకుంది. సెక్రటేరియట్ వద్ద వివిధ దేశాల జెండాలు ఏర్పాటు చేయగా ఇజ్రాయిల్ జెండాను జకీర్ అనే వ్యక్తి తొలగించాడు
ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తమదైన బ్రాండ్ ఉన్న నేతల్లో ప్రస్తుత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ పేరు చెప్పగానే టీడీపీ అధికారంలోకి రావడానికి తొలిమెట్టు ఆయనే అని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. వైసీపీ అధికారంలో ఉండగా ఎన్నికలకు సుమారు ఏడాది ముందు అధికార పార్టీలో ఉండి అసమ్మతి బావుటా ఎగురవేశారు. దాంతో అప్పటి అధికార పార్టీ సందిగ్ధంలో పడింది. ఆయన విమర్శలను కట్టడి చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. మరో వైపు ఈడీ కూడా రంగ ప్రవేశం చేసింది. ఇప్పటికే ఈ కేసులో జగన్ కు అత్యంత సన్నిహితుడైన రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారేందుకు రెడీ అయ్యారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఈడీ కూడా రాజ్ కేసిరెడ్డిని విచారించి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
బుకాయించడానికి, బొంకడానికి పాక్ కు ఇక ఏ అవకాశమూ లేకుండా పోయింది. అందుకే పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎలాంటి శషబిషలకూ తావులేకుండా, తటపటాయించకుండా భారత్ పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై దాడులు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించేశారు. అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ క్షిపణి దాడులకు చేసిందని బాహాటంగా ఒప్పేసుసున్నారు.
తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే బీఆర్ఎస్ లో ఏం జరుగుతోందన్నదే. అసలు పార్టీ కర్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హరీష్ రావు నివాసానికి వెళ్లి రెండు గంటల పాటు ఏం చర్చించారన్న దానిపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తొందరపాటు నిర్ణయాల వల్ల ఆయనకు, ఆయన పార్టీకీ తీరని డ్యామేజ్ జరిగిందన్నది వాస్తవం.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వారాంతం కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.